పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలి…

పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలి

సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి

ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటు పలుకుల రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

సింగరేణిలో పాత విధానంలో నే మెడికల్ బోర్డును నిర్వహించాలని సింగరేణి కాలరేసి వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలో
సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్ జాతా కార్యక్రమం లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్స్ మీద నల్ల బ్యాడ్జీలు ధరించి మెడికల్ బోర్డు,మారుపేర్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్,తదితర అంశాలపై గని మేనేజర్ పిట్ సెక్రటరీ ఎల్.శంకర్ ఆధ్వర్యంలో బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ మెమో రాండం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. బస్ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్చి 30న కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుందని దాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించాలని,పాత విధానంలో మెడికల్ బోర్డును నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన
50 వేలకోట రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికు లకు సొంత ఇంటి పథకాన్ని అమ లు చేయాలని,
పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కంపెనీ చెల్లించాలని,
కాంట్రాక్ట్ కార్మికు లకు ఐపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు.మారు పేర్లు, డిస్మిస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,
స్ట్రక్చర్ సమావే శాలలో ఒప్పుకు న్న వాటిని అమలు పరచా లని కోరారు.కెటికె
–1లో జి శ్రీనివాస్,సదయ్య,కెటికె5 లో ఆసిఫ్ పాషా,రాజేందర్,కేటికె6 లో శ్రీనివాస్,గణేష్,
కెటికె 8 శంకర్, కృష్ణ,ఓసి 2లో కరిముల్లా, రామచందర్,ఓసి 3 లో నూకల. చంద్రమౌళి,మహేందర్ రావు
ఏరియా వర్క్స్ షాప్ లో శ్రీనివాస్, కొమురయ్య లు కార్యక్రమంలో పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి గని మేనేజర్లకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీకాంత్,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ హరీష్ ,మైన్స్ కమిటీ,సేఫ్టీ కమిటీ,షిఫ్ట్ ఇంచార్జిలు, అసిస్టెంట్ షిఫ్ట్ ఇంచార్జిలు,టెంపుల్ కమిటీ,క్యాంటీన్ కమిటీ,కార్యకర్తలు,కార్మిక సోదరులు పాల్గొన్నారు.

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల…

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల

సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉంది

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో 2014 నుండి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగులు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన అనంతరం వివిధ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించడం జరిగిందని అందులో కొన్ని యాజమాన్యం పరిష్కరించిన పూర్తిస్థాయిలో అమలు పరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి దానికి కమిటీ వేసి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కోల్ ఇండియా మాదిరిగానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 6న అన్ని డిపార్ట్మెంట్లలో మెమోరండాలు నిరసన, ధర్నా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8న జిఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. 8 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం జరుగుతుందని సమస్యలను వారికి వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపు నివ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6, 8న జరిగే ధర్నా, నిరస నలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచి సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version