వన దేవతల సన్నిధిలో కోలాహలంగా సమ్మక్క సారలమ్మ జాతర

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం.

#తిరుగువారం రోజున కొనసాగిన భక్తుల రద్దీ.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తో కోలాహలంగా మారింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదట గా జంపన్న వాగు లో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం,ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ కొనసాగుతున్నా తరుణం లో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతర పరిసర ప్రాంతాలలోని వ్యర్ధాలను పారిశుధ్య కార్మికుల ద్వారా తొలగిస్తూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుగువారం సందర్భంగా వన దేవతల పూజారులు కన్నేపల్లి ఆలయం లో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వన దేవతలకు దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి,పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరుస్తారు.

ప్రపంచ స్తాయిలొ మేడారం మహా జాతర ఘనత నిలిచింది…

ప్రపంచ స్తాయిలొ మేడారం మహా జాతర ఘనత నిలిచింది.

జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజలెన్స్ మానటరింగ్ కమిటీ మెంబర్ మురుకుట్ల నరేందర్

మంగపేట నేటిధాత్రి

మునుపెన్నడు లేని విధంగా తెలంగాణ కుంబమేలా సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరని విజయవంతం చేయటములో ముందుండి నడిపించిన ఆదివాసి ముద్దు బిడ్డ,ఈ ప్రాంత ప్రజల దైర్యం గా చెప్పుకోబడుతున్న మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని నరేందర్ అన్నారు
ఏంతో సాహసోపేతంగా అతి తక్కువ సమయములో కొన్ని కోట్ల రూపాయలు వ్యచ్చించి కొట్లాధి మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందించిన మంత్రి సీతక్క ఆలోచన విధానానికి వారి నిశ్చలమైన గొప్ప ఆశయ సాధనకి ధన్యవాదాలు
జాతర పనులు ప్రారంభమైన దగ్గర నుండి ఎన్నో రకాల సమస్యలు ఒడిధుడుగులు వచ్చిన కావాలని కొందరు రాజకీయ లబ్ది కొరకు సృష్టించినప్పటికి అవన్నీ తేట తెల్లం చేసి కేవలం భక్తుల సౌకర్యాలను భక్తుల అవసరాలను మేడారంలో ఈ ప్రాంత బిడ్డల ముందు తరాల భవిశ్యత్తు అవసరాల కోసం కొన్ని వందల సంవత్సరాలు నిలిచేలా
చరిత్ర లో సీతక్క కి ముందు సీతక్క వచ్చిన తర్వాత అని తనదైన శైలిలో ప్రజల గుండెల్లొ ముద్ర వేసుకున్న ఘనత సీతక్క కి సొంతం అని ఆయన అన్నారు

మేడారం జాతర ఎంతగానో మారింది…

మేడారం జాతర ఎంతగానో మారింది…

 

మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.

ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

– డీజీపీ శివధర్‌రెడ్డి.. తల్లులకు మొక్కులు

మేడారం(ములుగు): అదివాసీల సహకారం తో పొలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadhar Reddy) తెలిపారు. వనదేవతలను దర్శించుకున్న డీజీపీ.. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించిన సీసీ పుటేజీల్లో జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే దారుల్లో ఉన్న ట్రాఫిక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోతే అచూకీ తెలుసుకోవడానికి గత జాతరల్లో జాప్యం జరిగేదని,

కానీ ఈ జాతరలో కొత్తగా చైల్ట్‌ ట్రాక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి పిల్లలు, వృద్ధుల చేతులకు హ్యాండ్‌ బ్యాండ్‌ పెట్టడం ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను కనుక్కోవడం సులువ గా మారిందన్నారు తద్వారా బాధితులతో పాటు పోలీస్‌శాఖకు సంతృప్తిని కల్గించం దన్నారు. పొలీస్‌శాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైయినీ ఐపీఎస్‌, డీఎస్పీలు పని నేర్చుకునేందుకు జాతరలో విధులు కేటాయించామన్నారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

గద్దెపై ఆసీనురాలైన వన దేవతలు పరిపూర్ణతను సంత రించుకున్న మొగుళ్ళపల్లి మినీ జాతరత

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భక్తుల గుండెల్లో భక్తి జ్వాలగా వెలిగే వన దేవతలు ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో శుక్రవారం మినీ మేడారం జాతరలో శరణు శరణు సమ్మక్క, శరణు శరణు సారక్క అంటూ. శివసత్తుల పూనకాలతో పోటెత్తిన భక్తజనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగళ్ళపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిలో మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లాలోని పరకాల, నడికూడా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. చిట్యాల టేకుమట్ల, కరీంనగర్ జిల్లా.

ఇల్లంతకుంట, జమ్మికుంట, మండలాలకు చెందిన అశేష భక్త జనవాహినితో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం లో జై సమ్మక్క జై జై సమ్మక్క అంటూ జయజయ ధ్వనులతో మారు మోగింది కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లులు నమ్ముకున్న భక్తులను చల్లంగా చూసేందుకు కష్టాల చీకట్లను తరిమికొట్టి వరాలను వెన్నెలను చల్లెందుకు చల్లని పున్నమి కాంతుల నడుమ సమ్మక్క సారక్క గద్దెలపై కొలువు ధీరడంతో అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుల అంచనాకు మించి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, కానుకలు, యాటపోతులను నైవేద్యంగా సమర్పించి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్న భక్తులు. జాతర ప్రదేశంలోనీ పెద్దవాగు, చిన్నవాగులలోనీ ప్రశాంత వాతావరణంలో తమ కుటుంబ సభ్యులతో అనందంగా జాతరను జరుపుకున్నారు.

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

 

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకోనున్నారు.

ములుగు, జనవరి 30: మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. దీంతో భక్తులను కంట్రోలు చేయడం ఒకానొక దశలో తీవ్రంగా పరిణమించింది. మరో వైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నేడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అందుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ జాతరకు హాజరై.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనె 28న ప్రారంభమైన ఈ జాతర.. 31న ముగియనుంది. ఇంకో వైపు జాతరలో జరుగుతున్న పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అదే సమయంలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కారు అద్దాలతో పాటు స్థానిక షాపులను భక్తులు ధ్వంసం చేశారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని.. వారంతా వీవీఐపీలు, పోలీస్ కుటుంబాల సేవల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మేడారం ఉత్సవాల్లో భాగంగా బుధవారం.. సారలమ్మ, గురువారం.. సమ్మక్కలు గద్దెపైకి చేరుకున్నారు. దీంతో మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైనట్లయింది. గురువారం అర్థరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువెల్ ఓరమ్ మేడారం విచ్ఛేసి.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు వీఐపీలు, వీవీఐపీలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో 25 మంది ఐపీఎస్‌లు అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుకునే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది మేడారం తరలివస్తున్నారు.

నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..

నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..

సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి ..

జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం…

మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి నాలుగు రోజుల పాటు జాతర జరిగే నేపథ్యంలో సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం కంక వనం తో జాతర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగామందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్టించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.జాతరకు కార్మికులు , కార్మికేతరులు, భక్తులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరుతున్నారు.మహిళలకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, క్షౌరషాలలు ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి ,మందమర్రి, రామకృష్ణాపూర్, గద్దెరాగడి ప్రాంతాల నుంచి నుంచి భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.సుమారు 10 నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణం మొత్తం కనిపించేలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారు.టవర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో చోరీలు జరిగే అవకాశం ఉంటే వారిని పసికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ పి రమేష్ ల ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఎస్సై జె శ్రీధర్ నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.సుమారు 300 కు పైగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కంక వనం కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం…

భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం.

మొగుళ్లపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు..

మొగుళ్లపల్లి నేటి దాత్రి.

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి ములకలపల్లి గ్రామాల మధ్య శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి మొదలు కానుంది బుధవారం సారలమ్మ పైడి దరాజు గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి ప్రతిష్టిస్తారు వనదేవతల గద్దెలకు చేరగానే భక్తులు మొక్కులు మొదలవుతాయి రెండేళ్లకోసారి నిర్వచించే ఈ మినీ జాతర సందర్భంగా మొగుళ్ళపల్లి ఉపసర్పంచ్ హిమబిందు కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతర నిర్వాహకులు విశిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు అమ్మవార్లు గద్దెలను పుట్ట మన్ను పసుపు కుంకుమ పాలతో శుభ్రపరిచి ముగ్గులు వేసి అలంకరించారు సాంప్రదాయ రీతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు 1976లో సమ్మక్క సారలమ్మను ప్రతిష్టించారు సమ్మక్క సారలమ్మ జాతరకు భూమి దాత సమ్మక్క సారలమ్మ కమిటీఅధ్యక్షులుఆలూరి గంగాధర్ చేశారు రెండు వాగుల మధ్యలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతమైన రీతిలో జరుగుతుంది భక్తుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు

మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

నర్సంపేట నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు

నర్సంపేట నుండి మేడారం ప్రత్యేక బస్సులు

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈనెల 25 నుండి ఫిబ్రవరి 31 వరకు నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు నడపడనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు.ఇందుకు గాను సుమారు ముప్పైరెండు వేల పైగా ప్రయాణికులు నర్సంపేట నుండి మేడారం జాతరకు ప్రయాణిస్తారని అంచనా వేసామన్నారు.కాగా 145 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పరిస్థితి బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నుండి మేడారంకు పెద్దలకు రూ.270/- పిల్లలకు రూ.170/- గా టికెట్ ధర, కొత్తగూడ నుండి పెద్దలకు 330/-, పిల్లలకు 200/-నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యం సరియైన ధ్రువీకరణ చూపించి ఎక్స్ ప్రెస్ బస్సుల వరకు ప్రయాణానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.బూత్ కౌంటర్లు ఏర్పాటు చేసి
మేడారం జాతరకు తరలివెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం, ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులను బస్సులలో ఎక్కించడం జరుగుతుందని తెలిపారు.టికెట్ కౌంటర్లు 24 గంటలు పనిచేస్తాయి.కాగా జాతరకు సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం తగిన ఏర్పాటు చేయడం తో పాటు త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్, తగు సూచనలను, సలహాలను అందించడానికి హెల్ప్ డెస్క్, మెడికల్ సదుపాయం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ వివరించారు.భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవార్ల గద్దెల అతి సమీపం వరకు చేరుకుంటారని కావున ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందగలరని ఆమె కోరారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రయత్నం

నడీకూడ,నేటిధాత్రి:

 

సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను అడవిలో వేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న చైతన్య కార్యక్రమం చేపట్టారు.
నా ప్లాస్టిక్ నా బ్యాగ్‌లోనే
మా చెత్త మా ఇంటికే
అమ్మల ఆశీర్వాదం అడవిని కాపాడితేనే
అనే నినాదాలతో విద్యార్థులు ఓ పాత క్యారీ బ్యాగ్‌తో ప్రజలలో అవగాహన కల్పించారు.మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ వెంట ఒక క్యారీ బ్యాగ్ వెంట తీసుకెళ్లి అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమం ద్వారా భక్తి అంటే దర్శనం మాత్రమే కాకుండా అడవిని, పర్యావరణాన్ని రక్షించడమూ మన కర్తవ్యం అనే సందేశాన్ని విద్యార్థులు బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లారు.
జాతర కొన్ని రోజులు మాత్రమే ఉన్నా,అడవి తరతరాల పాటు నిలవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు చేస్తున్న ఈ ప్రయత్నం భక్తులలో మార్పు చైతన్యాన్ని కలిగించేలా ఉందని గ్రామస్థులు ప్రశంసించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడితేనే సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం నిలుస్తుందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్పష్టమైన సందేశం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పావని, సత్యపాల్ విద్యార్థులను అభినందించారు.

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి…

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదారాబాద్,నేటిధాత్రి:

 

 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర
మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో గల అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ,ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version