ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా …

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి…

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన కొనారి రఘువీరా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వారి కుటంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో కొద్దిరోజులక్రితం మరణించిన పోగు సారయ్య(భగవంతుడు) కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం…

కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం

ఎమ్మెల్యే దొంతికి కలిసిన పట్టణ గౌడ సంఘం.*

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆ సంఘ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఆహ్వానం పలికారు.
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌడ
సంఘ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ నుండి 7 వరకు నిర్వహించే శ్రీ కంఠమహేశ్వరస్వామి, సూరమాంబ, రేణుకఎల్లమ్మ తల్లి, వనంమైసమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణం పనులను
చేయించాలని కోరడంతో తక్షణమే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ,మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఉపాధ్యక్షులు గాధగోని సాంబయ్య గౌడ్,ఆర్ధిక కార్యదర్శలు నాతి సదానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్ డైరెక్టర్లు. తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మొదలుగాని సురేష్ గౌడ్, వేముల క్రీష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేల్లి ప్రసాద్ గౌడ్, చుక్క రవి గౌడ్,గౌడ గీత కార్మికులు తాళ్ల చంద్రమౌళి గౌడ్, పుల్లూరు రవి గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గిరిగాని మొగిలి,కోయ్యడి కిరణ్ కుమార్ గౌడ్, వేముల సారంగం గౌడ్,కుల పెద్దలు
చుక్క కనకయ్య గౌడ్,వేముల ఐలుసమ్మయ్య గౌడ్,గండు స్వామి, దొమ్మటి కుమారస్వామి గౌడ్,
తదితరు పాల్గొన్నారు.

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం…

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండలం కేంద్రంలోని షౌకత్పల్లి కి చెందిన సుజాత మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ నేతల ద్వారా బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు,
మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, పత్య నాయక్, రాజు నాయక్ ,రమేష్ , రవీందర్ రెడ్డి, సుర మల్లేశం,రాములు,రాంరెడ్డి, ఐలయ్య, బాల్ రెడ్డి, రాజు నాయక్, నాగిరెడ్డి, దేవుల మహారాజ్, అంతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T153147.271.wav?_=1

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..

#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…

#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..

#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

సిర్పూర్ గ్రామపంచాయతీ కొత్త భవనం ప్రారంభం…

మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

సిర్పూర్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నర్సింగరావు వారు వెంట మల్లాపూర్ మండల కేంద్ర పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.

గడీలవ్యవస్థపై గలమెత్తి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ…

గడీలవ్యవస్థపై గలమెత్తి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ

ఐలమ్మ వర్ధంతి సంద ర్భంగా ఘన నివాళులు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

గడీల వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాలబుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఐలమ్మ వర్థంతి సందర్భంగా రజక కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలి కిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు.తెలం గాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అంద రికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపెళ్లి రవీందర్ వైనాల కుమారస్వామి చిందం రవి నిమ్మల రమేష్ రాజ్ కుమార్ రాజు మార్కండేయ తదిత రులు పాల్గొన్నారు.

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం….

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం.

కల్వకుర్తి/ నేటి దాత్రి:

 

 

 

కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపైన ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు సంభవించడం వలన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను మునిసిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కరెంటు వైర్లు, కరెంట్ స్తంభాలు దెబ్బతినడం కరెంటు సప్లై రావడం లేదు.రానున్న పది రోజులలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, దీపావళి కార్తీక మాసం పండుగలు ప్రారంభమవుతున్నాయి కావున భక్తుల ప్రయోజనాల సౌకర్యాల కొరకు కరెంటు వైర్లు, బల్బులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.ప్రతి పండుగకు మున్సిపల్ వారికి చెప్పడం వారు వచ్చి తాత్కాలిక వైరింగ్ చేయడం మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగా పాడైపోతున్నాయి. అలా కాకుండా పర్మినెంట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయగలరు స్తంభాలకు లైట్లు, వైరింగ్ చేయించగలరని కోరుతూ కల్వకుర్తి మున్సిపల్ గారికి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో దయాకర్,పురం మహేశ్వర్ రెడ్డి,
కుడుముల శేఖర్ రెడ్డి,గార్లపాటి, ప్రదీప్ కుమార్,బృంగి వివేకానంద,
ఉప్పరిపల్లి ప్రవీణ్ రెడ్డి,వాగులదాస్ నరేశ్ గౌడ్,కాగుల శ్రీశైలం యాదవ్,
దేవర్ల ఆంజనేయులు,చెందు ముదిరాజ్, రఘు యాదవ్,దేవర్ల వెంకటనారాయణ,రానదీర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి జిల్లా అధ్యక్షుడు కోపర్తి సురేందర్ వినతిపత్రం అందించారు.జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సాంస్కృతిక కళాకారుల కొరకు ఒక గదిని తమకు కేటాయించాలని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ త్వరలోనే జిల్లా సంస్కృతిక సారధి కళాకారుల కొరకు ఒక గదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగ సంఘం మంచిర్యాల గౌరవ అధ్యక్షులు మామిండ్ల లచ్చన్న,అధ్యక్షులు కొప్పర్తి సురేందర్,ఉపాధ్యక్షులు వెల్థురు పోశం,ప్రదాన కార్యదర్శి గొడిసెల కృష్ణ
సహాయ కార్యదర్శి వావిలాల నాగలక్ష్మి,కోశ అధికారి కొప్పర్తి రవీందర్ పాల్గొన్నారు.

తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

చీకటయపాలెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాండవుల బిక్షం, బూర్గుల వెంకటమ్మ అలాగే తొర్రూర్ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల పుల్లయ్య, శమంతుల వేణు అలాగే కంటయపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోనె చిరంజీవి మరియు చింతలపల్లి గ్రామానికి చెందిన కొండం నరసింహారెడ్డి గారి తండ్రి గారు కొండం వెంకట్ రెడ్డి గారు ఇటీవల మరణించగా ఆయా కుటుంబాలను పరామర్శించి వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించడం జరిగింది.

వీరి వెంట మండల మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య తొర్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ లు పాకనాటి సునీల్ రెడ్డి, శ్రీరామ్ సుధీర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాళ్లు నాయక్, రాయిశెట్టి వెంకన్న, ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, కర్నే నాగరాజు, ధరావత్ జై సింగ్, తూర్పాటి రవి ,పేర్ల జంపా, లేగల వెంకటరెడ్డి, మంగళంపల్లి ఆశయ్య, నిమ్మల శేఖర్,పయ్యావుల రామ్మూర్తి, మహిళా నాయకురాలు కనకపూడి సుచరిత ,తొర్రూర్ బి ఆర్ స్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వద్దిరాజు కుటుంబం ప్రత్యేక గణేశ్ పూజ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-61.wav?_=2

ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025

నేటిధాత్రి:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.

Vigneshwara

ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143411.649.wav?_=3

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరుకోళ్లూరి రామయ్య మృతి

నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

గుండాల(భద్రాద్రికొత్త

గూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుకొళ్ళూరి రామయ్య అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకుని వారి మృత దేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన గుండాల మండల పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా ఖదీర్ మాట్లాడుతు రామయ్య ని అందరూ తమ ఇంటి పేరుతో కాకుండా పట్వారి రామయ్య అని సంభోదించే వారు ఈ ప్రాంతానికి వారు ఎంత సేవ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి మరణం పార్టీకి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య , మండల ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య , సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,ఎస్కె అబ్దుల్ నభి, పాయం గణేష్ , నునావత్ రవి,యువజన నాయకులు ఈసం భద్రయ్య,పల్లపు రాజేష్,బొంగు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=4

 

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత.

దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
ఆదివాసి జేఏసి ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పోలేబోయిన సుశీల దశదిన కర్మలకుగాను ఆదివాసి జేఏసీ, మరియు దాతల సహాయార్థం 125kg ల బియ్యం, 15kg నూనె ఇవ్వటం జరిగింది. అలాగే తన వంతు సహాయంగా మన మండల రెవిన్యూ భూభారతి ఆపరేటర్ చందా కౌసల్య 6,500 రూపాయలు నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకట నారాయణ గారు, మాజీ సర్పంచులు పాయం నర్సింహారావు గారు, పోలేబోయిన పాపక్క ,ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, పోలేబోయినా సర్వేశ్వరావు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు పోలేబోయినా ప్రేమ్ కుమార్, కలం సంపత్, ఉకే నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, రాజశేఖర్, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

“జహీరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T132220.018-1.wav?_=5

 

కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్
మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు…

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు

గణపతి మండపంలో ఘనంగా పూజలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10 వార్డు పోచమ్మ ఆలయంలో పోచమ్మతల్లి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ,ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు హాజరైయ్యారు.పూజారి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు. మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గణనాధున్ని వేడుకొన్నట్లు తెలిపారు.ఈ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ శీలం సత్యనారాయణ, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కడారి కుమారస్వామి, ఎల్ల స్వామి, బిక్షపతి, పి.కృష్ణ,స్థానిక వ్యాపారులు బండి సుధాకర్, శ్రీనివాస్,కోడమ్ సారంగం, నాగిశెట్టి ప్రవీణ్ తదితరులు స్థానికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version