కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్ మోసపూరిత చర్యలు ప్రజల్లో ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘంలో పనిచేస్తున్న ఏపీవో రాజ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, తన పదవిని దుర్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజలతో నమ్మకం కల్పించి, తరువాత మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన గ్రామస్థులు దీనిపై అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు బాధితులు అతని వ్యవహారాలపై సాక్ష్యాధారాలు సమర్పించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్థులు ఏకమై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. సంబంధిత విభాగం అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. “రాజ్ కుమార్ లాంటి అధికారులు ఉండటం వల్లే సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని గ్రామ పెద్దలు వ్యాఖ్యానించారు. మాసునూరు సర్పంచ్ మాజీ స్వామి దాస్ మూడు సంవత్సరాలుగా నష్టపోతున్నానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version