స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు…

స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ పర్మిషన్ రద్దు చేయాలి కొత్తగా వచ్చే క్రషర్ టెండర్ ను పర్మిషన్స్ ఇవ్వకూడదని కలెక్టర్ కి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు మాట్లా డుతూ గత 13 సంవత్సరా లుగా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ వల్ల చాలా వ్యవసాయం లోని పంట పొలాలలో పెద్దపె ద్ద బండలు ఒక కింటన్ పెద్ద బండలు పంట పొలాలలో పడడం జరిగి పూర్తిగా నాశ నం అవుతున్నది ఏర్పడి శబ్ద కాలుష్యం డాంబర్ ప్లాంట్ వలన వచ్చే వాసన వలన గ్రామంలోని ప్రజలు శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకా శం ఏర్పడి వాయు కాలుష్యం వలన పంటలు దెబ్బతినడం జరుగుతుంది అలాగే గ్రామం లోని ఇల్లు పిల్లర్ల నుండి స్లాబ్ వరకు పగుళ్లు ఏర్పడి కూలి పోయే ప్రమాదం ఉన్నందున అలాగే గుట్టల్లో నివసించే జీవ రాశులు శబ్దాల వలన కోతు లు అడవి పందులు పంటలపై పడి పంటలు పూర్తిగా నాశనం చేస్తున్నాయని అలాగే గ్రామం లోని ఇళ్లకు గుట్టలలో నివసిం చే జీవరాశులు రావడంతో గ్రామ ప్రజలు నానా ఇబ్బం దులు పడుతున్నారని కావున శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషన్ పర్మిషన్స్ ను రద్దు చేయాలని అలాగే కొత్త టెండర్ వేస్తున్న టువంటి క్రషర్ ఏర్పాటును విరమించుకోవాలని వీటిపై ఎమ్మార్వో , ఆర్డీవో , కలెక్టర్ ఫిర్యాదుచేయడం జరిగింది కావున అధికారులు స్పందిం చి పత్తిపాక గ్రామాన్ని పొల్యూ షన్ ద్వారా కాపాడాలని మా గ్రామ పంచాయతీ పాలకవర్గం నుండి అధికారులను కోరుతు న్నాము ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకే శ్వరపు సాయి లక్ష్మి, కొడి మాల మహేందర్, గజ్జి రమే ష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐర బోయిన స్వప్న రాజు, కంద గట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు, నాయకులు పెండేల కిరణ్, పోతుగంటి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం…

ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి నియోజకవర్గం లోని
ఆమనగల్ పట్టణంలో నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థి పత్యానాయక్ ని కాంగ్రెస్ బిజెపి కలసి కుట్ర పన్ని కాంగ్రెస్ లో కి తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పత్యా నాయక్ ఇంటిని ముట్టడించారు దాంతో అధికార పార్టీ నేతలు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణ పై అక్రమ కేసులు బనయించడం తో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్ మోసపూరిత చర్యలు ప్రజల్లో ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘంలో పనిచేస్తున్న ఏపీవో రాజ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, తన పదవిని దుర్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజలతో నమ్మకం కల్పించి, తరువాత మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన గ్రామస్థులు దీనిపై అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు బాధితులు అతని వ్యవహారాలపై సాక్ష్యాధారాలు సమర్పించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్థులు ఏకమై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. సంబంధిత విభాగం అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. “రాజ్ కుమార్ లాంటి అధికారులు ఉండటం వల్లే సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని గ్రామ పెద్దలు వ్యాఖ్యానించారు. మాసునూరు సర్పంచ్ మాజీ స్వామి దాస్ మూడు సంవత్సరాలుగా నష్టపోతున్నానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version