నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోచేరిన మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్
నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బి ఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరముల కాలంలోని దాదాపుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈరోజు మాజీ కౌన్సిలర్ మోతిలాల్ ఖాజా ఖాన్ ఇసాక్ తిరుమల యాదవ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బాదం రమేష్ ఇమ్రాన్ హరికృష్ణ రవీంద్ర చారి అనేకమంది నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

వనపర్తి లో వార్డుల పర్యటనలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి :

మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదే శాల మేరకు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తజ పరుస్తూ వనపర్తి లో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పార్టీ నేతల తో కలిసి 5 20 వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈమేరకు బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజల కు అండ గా ఉంటుందని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణతో,చెరువుల పునరుద్ధరణ,పార్కుల అభివృద్ధి ,విద్యా మెడికల్ ఇంజనీరింగ్ చిట్యాల రోడ్డు లో నూతన మార్కెట్ యార్డు ఇంకా వనపర్తి పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి మున్సిపల్ ఎన్నికలలో బి.ఆర్.ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వార్డుల పర్యటన లోజిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆసరా పింఛన్లు,మహిళలకు 2500,గ్యాస్ సబ్సిడీ, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు అన్నారు వార్డుల పర్యటన లో
జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతిమాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, ఉంగ్లం. తిరుమల్,రమేష్ నాయక్,స్టార్.రహీమ్ గులాం ఖాదర్ ఖాన్ సూర్యవంశంగిరి జోహెబ్ హుస్సేన్ఇమ్రాన్,వార్డ్ అధ్యక్షులు రవి కుమార్,చంద్రయ్య జహంగీర్
ఎర్ర.శ్రీనివాసులుసునీల్ వాల్మీకి,బొడ్డుపల్లిసతీష్ నందిమల్ల.రమేష్,ప్యాత.తిరుపతయ్య,ప్రేమ్ కుమార్ఎ.కె పాషా,బెంగాలీ.రఘు మునికుమార్, గోకం.శివ,రామస్వామి,రామ్ చంద్రయ్య,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ,నల్లవత్తులవెంకట్ ఉందేకోటి.కృష్ణ,తోట.శ్రీను,జావేద్,జానకి రామ్,ఆంజనేయులు,బోయ.లక్ష్మీ,షాహిన్,షాహిద్, దేవమ్మ పార్టీ నేతలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version