విద్యుత్ అంతరయంపై ప్రజావాణిలో ఫిర్యాదు

విద్యుత్ అంతరయంపై ప్రజావాణిలో ఫిర్యాదు

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా భీమరం మండలం మద్దికల్ లో విద్యుత్ అంతరాయంపై స్థానిక మండల బిజెపి నాయకులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. తరచు విద్యుత్ లైన్లలో సమస్యలు ఏర్పడి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని వివిధ పనులకు విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు సంబంధిత సిబ్బంది స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపించారని తెలిపారు.సబ్ స్టేషన్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసి సమస్యను తెలిపిన ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్,బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శేఖర్,ఉపాధ్యక్షులు సెగ్గం మల్లేష్ పాల్గొన్నారు.

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం….

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం.

కల్వకుర్తి/ నేటి దాత్రి:

 

 

 

కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపైన ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు సంభవించడం వలన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను మునిసిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కరెంటు వైర్లు, కరెంట్ స్తంభాలు దెబ్బతినడం కరెంటు సప్లై రావడం లేదు.రానున్న పది రోజులలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, దీపావళి కార్తీక మాసం పండుగలు ప్రారంభమవుతున్నాయి కావున భక్తుల ప్రయోజనాల సౌకర్యాల కొరకు కరెంటు వైర్లు, బల్బులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.ప్రతి పండుగకు మున్సిపల్ వారికి చెప్పడం వారు వచ్చి తాత్కాలిక వైరింగ్ చేయడం మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగా పాడైపోతున్నాయి. అలా కాకుండా పర్మినెంట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయగలరు స్తంభాలకు లైట్లు, వైరింగ్ చేయించగలరని కోరుతూ కల్వకుర్తి మున్సిపల్ గారికి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో దయాకర్,పురం మహేశ్వర్ రెడ్డి,
కుడుముల శేఖర్ రెడ్డి,గార్లపాటి, ప్రదీప్ కుమార్,బృంగి వివేకానంద,
ఉప్పరిపల్లి ప్రవీణ్ రెడ్డి,వాగులదాస్ నరేశ్ గౌడ్,కాగుల శ్రీశైలం యాదవ్,
దేవర్ల ఆంజనేయులు,చెందు ముదిరాజ్, రఘు యాదవ్,దేవర్ల వెంకటనారాయణ,రానదీర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version