నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శం చందుపట్ల కీర్తి రెడ్డి

నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శం చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు
ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు అనంతరం సంఘ మిత్ర డిగ్రీ కాలేజీ నుండి ప్రారంభమైన ర్యాలీ, వివిధ వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. దేశభక్తి నినాదాలతో గాలిలో ర్యాలీ చేశారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ
దేశాన్ని ఐక్యం చేసిన లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. ఆయన నాయకత్వం లేకపోయి ఉంటే మన దేశం ఈరోజు ఒకటిగా ఉండేది కాదు. ఆయన దృఢనిశ్చయంతోనే 562 రియాసతాలను ఒకే భారతదేశంగా ఏకం చేశారు. ఆయన చూపిన మార్గం, ఆయన నిబద్ధత ప్రతి నాయకుడికి, ప్రతి పౌరుడికి స్ఫూర్తి కావాలి, అని అన్నారు.
నేటి తరంలో యువతకు సర్దార్ పటేల్ ఆలోచనలను పరిచయం చేయడం చాలా అవసరం. ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం మనందరిలో నాటుకుపోవాలి. దేశం పట్ల గౌరవం, సమైక్యత పట్ల అవగాహన పెంచుకోవాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు. అందుకే ప్రతి ఒక్కరూ పటేల్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారాలి,” అని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రం మొత్తం “జై సర్దార్ పటేల్”, “ఒక భారతం ఒక మనసు ఒక జెండా” అనే నినాదాలతో మార్మోగింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యత మార్చ్ కో కన్వినర్స్ తాటికొండ రవి కిరణ్ సయ్యద్ గాలిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి రెడ్డి సామల మధుసూదన్ రెడ్డి కొడపాక స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు జీట్టబోయిన సాంబయ్య మీడియా కన్వీనర్ మునేందర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జగ్గయ్య సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ పులి గు జ్జల రాజు బండి శ్రీనివాస్ గుర్రపు నాగరాజ్ గౌడ్ రామకృష్ణ అర్బన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి బీజేవైఎం నాయకులు వంశీ బిఎంఎస్ నాయకులు బిక్షపతి తదితరున్నారు

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు….

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలి ఐలమ్మ ఓ సామాన్య స్త్రీ దొరలకు ఎదురు తిరిగింది. తనపై దాడి చేస్తే ప్రతిఘటించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన దొరలకు సవాల్‌ విసిరి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుకు స్ఫూర్తి ఐలమ్మ, బానిసత్వ సంకెళ్ల నుంచి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించిన వీరవనిత. దొరగడీలో గడ్డి మొలుస్తదని సవాలు విసిరి అచరణలో నిరూపించిన వీరనారి ఐలమ్మ నేటి ఆధిపత్య కుల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ఉద్యమించాలి.
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తన ఉద్యమ నేపథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
చంద్రగిరిశంకర్ ఓరుగంటి ఐలయ్య,బొడ్డుపెల్లి మల్లేష్ , గడ్డం సమ్మయ్య
నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version