తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ…

తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక చాకలి ఐలమ్మ

ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం అని వెల్లడించారు. పెత్తందార్ల దురాగతలను ఆనాటి నిరంకుశ రజాకర్లను కు వ్యతిరేకంగా మొక్క పోయిన ధైర్యంగా ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ చిందం రవి మార్కండేయ దుబాసి కృష్ణమూర్తి,,వలి హైదర్ కట్టయ్య,రాజు, చిరంజీవి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు, చాకలి కులస్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారు

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక…

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

గడీలవ్యవస్థపై గలమెత్తి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ…

గడీలవ్యవస్థపై గలమెత్తి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ

ఐలమ్మ వర్ధంతి సంద ర్భంగా ఘన నివాళులు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

గడీల వ్యవస్థపై గలమెత్తి పోరాడిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాలబుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఐలమ్మ వర్థంతి సందర్భంగా రజక కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలి కిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు.తెలం గాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అంద రికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపెళ్లి రవీందర్ వైనాల కుమారస్వామి చిందం రవి నిమ్మల రమేష్ రాజ్ కుమార్ రాజు మార్కండేయ తదిత రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version