ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

నేటి ధాత్రి -గార్ల :-

వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగు.

రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగు

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని రాయపర్తి రైతు వంతడుపుల సుజాత వారి ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యానశాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుంది,
రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ మాట్లాడుతూ ఇంకా విస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 21000 ఉంది. త్వరలోనే
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము.అదేవిధంగా
నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన,ఆయిల్ ఫామ్ తోటలకు డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది.
ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నది మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలని రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, హెచ్ ఓ టెక్నికల రాకేష్, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ,ఫీల్డ్ ఆఫీసర్ భరత్ తదితర రైతులు పాల్గొన్నారు.

రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చు.!

ఫామ్ ఆయిల్ తోటలతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు

రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామములో రైతు బోయినీ.వాసు 4ఎకరాలతో సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు భవిష్యత్తు ప్రయోజనాల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ ఆయిల్ తోటలు పట్ల రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించామని నిరంజన్ రెడ్డి అన్నారు.ఫామ్ ఆయిల్ తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆదాయం లాబాలు పొందుతూ అదేవిధంగా అంతర్గత కొత్త రాకాల పంటల వేసుకొని జీవనోపాధి పొందవచ్చని అన్నారు.మార్కెట్లో ఫామ్ ఆయిల్ మంచి గిరాకీ ఉన్నదని భవిష్యత్తు మొత్తం ఫాం ఆయిల్ తోటలది మాజీ మంత్రి అన్నారు. పంట సాగు చేస్తున్న వాసుకు సూచనలు చేసి అభినందించారు. మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి వెంట మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, చిట్యాల.రాము,నరసింహ,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీడియా ఇంచార్జి నందిమల్ల అశోక్ తెలిపారు

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం పది వేల పెన్షన్ అమలు గురించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించాడని, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కు ముందడుగు పడడంతో శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చిత్ర పటానికి ఫలాభిషేకం చేశారు. చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు రిటైర్డ్ కార్మికులంతా గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడంతో ఎంపీగా ఎన్నికైన సందర్భంగా సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుమ్మరి మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

కల్వకుర్తి /నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ లు బృంగి ఆనంద్ కుమార్,యెన్నం భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జిల్లెల్ల రాములు, దామోదర్ గౌడ్, చిన్న రాంరెడ్డి, గోరటి శ్రీనివాసులు, రవీందర్,చిన్న, బాలు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సభ్యులు రేష్మ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్ రాజ్, శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాని యాదవ్,రావుల కేశవులు, వెంకటేష్,దున్న సురేష్, శ్రీశైలం మహేందర్, నవీన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version