టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132744.714.wav?_=1

 

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T122357.569.wav?_=2

 

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

కరకగూడo మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడుకొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందినారు కరకగూడెం మండలంలో కాకుండా మంగపేట గోవిందరావుపేట ఏటూర్ నాగారం మండలాలలో అందరికీ సుపరిచితుడు గొప్ప మానవతవాది డ్రైవింగ్ ఫీల్డ్ లో సిద్ధహస్తుడు రాజకీయంలో తుమ్మల నాగేశ్వరరావు వీరఅభిమాని కావడంతో ఇతనిని తుమ్మల అని పేరు పెట్టి పిలుస్తారు. అతనికి భార్య ముగ్గురు కూతుర్లు 10 సంవత్సరాలలోపు ఉన్నారు అందరూ చిన్నపిల్లలు కావడంతో పెద్ద దిక్కు కోల్పోవడంతో అందరూ కన్నీటి పర్వతమయ్యారు దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో పరిస్థితి తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ఎంతో బాధపడుతూ హృదయం చలించిపోయి గుర్తు చేసుకుంటూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 11000/రూపాయలు దశదినకర్మలకు ఆర్థిక సహాయం చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు. పోలబోయిన రామారావు కొమరం తాతారావు చందా నాగేశ్వరరావు గొగ్గలి కృష్ణ పోలే బోయిన కృష్ణారావు పోలే బోయిన సత్యనారాయణ పోలే బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం…

యాదవ హక్కుల సాధనే అంతిమ లక్ష్యం
యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

రాయికల్, అక్టోబర్ 15, నేటి ధాత్రి:

రాజ్యాంగ పరంగా యాదవులకు దక్కాల్సిన హక్కులు సాదించుకోవడమే అంతిమ లక్ష్యం అని అందులో భాగంగానే గ్రామ గ్రామాన యాదవ సంఘ సమావేశాలు నిర్వహించి యాదవులను చేతన్య పరుస్తున్నామని యాదవ సంఘం (a) జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
:- రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ సంఘ భవనలో నిర్వహించారు..
ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య సలహాదారులు తొట్ల చిన్నయ్య యాదవ్,అలిశెట్టి బుచ్చి రాములు యాదవ్,తొట్ల మహిపాల్ యాదవ్,గజనవేణి మహేష్ యాదవ్, మండల నాయకులు ఉష గంగ మల్లయ్య యాదవ్,గంగుల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు..
అనంతరం మైతాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం “86 మంది,” సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు
గనవేని మల్లేష్ యాదవ్ ..
ఈ కార్యక్రమంలో..
మైతాపూర్ గ్రామ యాదవ సంఘ పెద్దమనుషులు, వంగ మల్లయ్య, దుగ్గిళ్ల ఎల్లయ్య, నాగుల గంగయ్య, నాగుల రాజేందర్, నక్క రాజారెడ్డి, గంగుల గంగారాం వంగ ప్రశాంత్ పంచతి గంగన్న గంగుల రాజన్న నక్క అభి కడుముంత రాజన్న బుస గంగారాం నాగుల రెడ్డి పంచతి గంగన్న,సంతోష్ గంగుల మల్లయ్య పంచతి మహేష్, నాగుల గంగారాం, మహిళలు తదితరులు పాల్గొన్నారు..

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ…

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లోకి కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులు…

కాంగ్రెస్ లోకి కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులు

* పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఐటీ మంత్రి వర్యుల

మహాదేవపూర్ అక్టోబర్ 14 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులను మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని కాలేశ్వరం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగునూరి రమేష్ గౌడ్ ను మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లేతగారి రాజబాబు ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఐటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంథని క్యాంపు కార్యాలయ సిబ్బంది, కాలేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన ఎమ్మెల్యే

హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన ఎమ్మెల్యే జహీరాబాద్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అసెంబ్లీ సభ్యుడు మాణిక్ రావు నేతృత్వంలో, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కోహిర్ మండల్ నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం జహీరాబాద్ నగరం నుండి బయలుదేరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సందర్శించి, మాజీ రాష్ట్ర మంత్రి మరియు సిద్దిపేట అసెంబ్లీ సభ్యుడు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావును వారి హైదరాబాద్ నివాసాలలో కలిశారు.

ఈ సందర్భంగా, హరీష్ రావు మరియు కేటీ. రామారావు జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంతో, ముఖ్యంగా సమీపంలో జరుగుతున్న సంస్థలతో వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీపీసీలు, సార్-ఎ-ఇంచాస్ కౌన్సిల్‌లు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థుల విజయానికి వ్యూహాలను రూపొందించడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు అల్హాజీ షేక్ ఫరీద్, మాజీ సయ్యద్ మొహియుద్దీన్,
నాదన్‌ అధ్యక్షుడు బీఆర్‌ఎస్‌ పార్టీ జహీరాబాద్‌ నర్సింలు యాదవ్‌, అధ్యక్షుడు బీఆర్‌ అరైన్‌, కోహిర్ మండలం ముహమ్మద్‌ కలీముద్దీన్‌, మాజీ ప్రతినిధి సర్‌, మీర్‌ మహమ్మద్‌ ఫిర్‌దౌస్‌, ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌, బీర్‌నౌ మహమ్మద్‌ వాజిద్‌ జబీహ్‌, మాజీ సభ్యుడు వారిద్‌, కోహిర్ గ్రామ పంచాయతీ సయ్యద్‌ అజ్మత్‌ హత్‌, అధ్యక్షుడు బీఆర్‌ఎస్‌, కోహిర్ మహ్మద్‌ అర్బాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T144546.723.wav?_=3

 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ చేసిన అనేక అభివృద్ధి పనులకు గాను.ప్రభుత్వ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఏడాది 100 కోట్లు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న గత సీఎం కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రజా ప్రభుత్వంలో వేముల వాడ. ఆలయం అభివృద్ధి. అవుతుంటే బిజెపి నేతలు ఓర్వలేదు అని. ఆలయం అభివృద్ధి అవుతుంటే బీజేపీ బీ ఆర్ఎస్ లీడర్లు కండ్లు మండుతున్నాయని. గత పది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం ఆయాంలోఅభివృద్ధికి నోచుకోని రాజన్న ఆలయం అని. ప్రతి సంవత్సరం ఆలయం డెవలప్మెంట్ గురించి 100 కోట్లు ఖర్చు చేస్తానన్న. నాటి సీఎం కేసీఆర్ మాట తప్పాడని. ఆగమ. శాస్త్రం. ప్రకారమే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవరిస్తూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బిజెపి దహనం చేయడంపై దురుష్టకరమని. దహనంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న ఆలయం పై రాజకీయం చేయొద్దని. రాజన్న ఆలయ అభివృద్ధి అడ్డుకోవద్దని అడ్డుకుంటే చరిత్రలో మిగిలిపోతారని బిజెపి నాయకులకు కాంగ్రెస్ నాయకులకు. ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని. అలాగే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు బిజెపి నాయకులు తట్టుకుంటలేరని. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందని ఎవరు అడ్డుపడిన ఆలయ అభివృద్ధి మాత్రం నిలిపే ప్రసక్తే లేదని. హిందూ ధర్మం అనే గొప్పగా చెప్పుకునే వారు హిందూ దేవాలయాల అభివృద్ధి చెందితే వారికి బాధ అయింది అని. ఒక బీసీ నాయకుడు రాజన్న ఆలయమును అభివృద్ధి చేస్తే మీకు నచ్చడం లేదా. పదిహేళ్లుగా బిజెపి బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు రాజన్న గుడి ని. ఎందుకు అభివృద్ధి చేయలేదని. అలాంటిది. మా ప్రభుత్వ ఆయాంలో వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ . ఓరవడం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు నేరెళ్ల డైరెక్టర్స్ మండల కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ సీనియర్.పార్టీ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T142325.297.wav?_=4

 

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ,శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో రాజన్నల కుల సంఘం మేకల మండి వద్ద వర్షంలో సైతం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా,స్పీకర్ గా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని,రానున్న రోజుల్లో మళ్ళీ భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ మధుసూదనా చారిని గెలిపించుకుంటామని రాజన్నల కులస్తులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి,మొగిలి శీను,రాయగట్టయ్య,కొమురయ్య,రాజయ్య,మల్లయ్య,అంజయ్య,జన్నే సుమన్,ఎడ్ల విద్వత్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T140659.375.wav?_=5

     బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన:

కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

కాప్రా నేటిధాత్రి

 

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ నోమా కళ్యాణ మండపం నుండి రైల్వే ట్రాక్ వరకు ఇటీవల చేపట్టిన బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఈ యొక్క బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణంతో వర్షం నీరు నిలవకుండా, స్థానికంగా నివాసం ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటారని, ఈ నిర్మాణం పూర్తయితే డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా ప్రధాన సమస్య తీరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ లింగారావు, వర్క్ ఇనస్పెక్టర్ చారి, శ్రీనివాస్ స్థానిక నాయకులు సాయి కుమార్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డోలా రోహన కార్యక్రమంలో ఆశీర్వదించారు

డోలా రోహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు,
గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు

మహాదేవపూర్ అక్టోబర్ 6 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సోమవారం రోజున రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణపెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెషినేని మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బ్రాహ్మణ పెళ్లి గ్రామానికి సర్పంచిగా ఎనలేని సేవలు అందించారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్, మండల నాయకులు ఐలయ్యయాదవ్ రవీందర్, వెంకటేష్, కొక్కు రాకేష్, హరీష్, పలువురు నాయకులు, ప్రజల పాల్గొన్నారు.

న్యామతాబాద్ లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం…

న్యామతాబాద్ లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలోని న్యామతాబాద్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు cశుక్రవారం 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ శ్రేణులు శరణప్ప, సంగమేష్ లో ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా శ్రేణులు రామ్ చందర్, అబ్రహం సంస్థ ఏర్పాటు, లక్ష్యం, విధివిధానాలపై యువతకు మార్గదర్శనం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ సేవలను గుర్తు చేస్తూ.. వారి మార్గంలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఉల్లాస్, నిర్మల్ కుమార్, శాంత కుమార్ నరసింహారెడ్డి గొల్ల షాంపూ, సుక్కప్ప, రూబెన్, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇచ్చే బాకీల పట్ల నిలదీయాలి…

ప్రజలకు ఇచ్చే బాకీల పట్ల నిలదీయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాకీల కోసం నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ అన్నారు.
నర్సంపేట మండంలోని చిన్న గురిజాల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షుడు నాగిషెట్టి కొమురయ్య అద్యక్షతన జరిగింది. నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.మండల ఎన్నికల కన్వీనర్ కొమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డుల ద్వారా ప్రచారం చేసి బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం ప్రతీ కార్యకర్త కృషీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కడారీ రవి,మోటూరి రవి,బండారి రమేష్,భూక్యా వీరన్న,గురిజాల గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ గడ్డం రాజు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,పుప్పాల బిమయ్య,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,పోతు శంకర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,బొల్లం భక్కయ్య,మాజీ ఉప సర్పంచ్ కంకణాల రాజు,మండల యూత్ సహాయ కార్యదర్శి పుట్ట అఖిల్,సొసైటి డైరెక్టర్ ఎడ్ల రవీందర్,గ్రామ పార్టి కన్వీనర్ చిప్ప ప్రశాంత్, కొమ్ము రవి,మినుముల దేవేందర్,దూడల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద మందడి మండలం లో అమ్మవారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే…

పెద్ద మందడి మండలం లో అమ్మవారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం సందర్భంగా పెద్దమందడి మండలంలో మణిగిల్ల అల్వవాల
గ్రామలలో దసర శరన్నవరాత్రి సందర్భంగా అమ్మ వారి విగ్రహలను ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు పూజ

కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాజీ జెడ్పీ టిసి వెంకటస్వామి, మణిగిల్ల గ్రామ నాయకులు తిరుపతిరెడ్డి, మద్దిలేటి, సురేష్ , నరసింహ రెడ్డి, వెంకయ్య, చావ్వ రాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మొగలయ్యకు ఎమ్మెల్యే మెరుగైన చికిత్స అందించమని సూచించారు…

పొట్ పల్లి గ్రామానికి మొగలయ్య మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పొట్ పల్లి గ్రామానికి చెందిన
మొగలయ్య పాముగా కాటుకు గురై చికిత్స కొరకు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి లో చేరారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆసుపత్రి కి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, అండగా ఉంటాం అని కుటుంబసభ్యులకు మనోధైర్యన్ని కలుగజెసారు ఎమ్మెల్యే గారితో పాటుగా ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,కోహీర్ మండల మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గ్రామ నాయకులు సిద్దన్న పటేల్, శాంత్ కుమార్, బసప్ప,మాణిక్యప్ప,రామన్న తదితరులు ఉన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ…

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలితరం ఉద్యమనాయకుడిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. బహుజన నేతగా పద్మశాలీలను సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ తో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిర పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి అప్పం కిషన్ అంబాల శీను ముంజల రవీందర్ పద్మశాలి కుల సంఘ నాయకులు ప్రసాద్ శ్రీధర్ శ్రీనివాస్ సతీష్ భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం…

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన
టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు
మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటిదాత్రి

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొగిలిపేట గ్రామం లో మల్లాపూర్ మండలం కి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన 9 లక్షల 25 వేల విలువగల 17 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు….

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలి ఐలమ్మ ఓ సామాన్య స్త్రీ దొరలకు ఎదురు తిరిగింది. తనపై దాడి చేస్తే ప్రతిఘటించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన దొరలకు సవాల్‌ విసిరి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుకు స్ఫూర్తి ఐలమ్మ, బానిసత్వ సంకెళ్ల నుంచి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించిన వీరవనిత. దొరగడీలో గడ్డి మొలుస్తదని సవాలు విసిరి అచరణలో నిరూపించిన వీరనారి ఐలమ్మ నేటి ఆధిపత్య కుల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ఉద్యమించాలి.
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తన ఉద్యమ నేపథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
చంద్రగిరిశంకర్ ఓరుగంటి ఐలయ్య,బొడ్డుపెల్లి మల్లేష్ , గడ్డం సమ్మయ్య
నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version