కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం…

కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం

ఎమ్మెల్యే దొంతికి కలిసిన పట్టణ గౌడ సంఘం.*

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆ సంఘ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఆహ్వానం పలికారు.
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌడ
సంఘ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ నుండి 7 వరకు నిర్వహించే శ్రీ కంఠమహేశ్వరస్వామి, సూరమాంబ, రేణుకఎల్లమ్మ తల్లి, వనంమైసమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణం పనులను
చేయించాలని కోరడంతో తక్షణమే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ,మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఉపాధ్యక్షులు గాధగోని సాంబయ్య గౌడ్,ఆర్ధిక కార్యదర్శలు నాతి సదానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్ డైరెక్టర్లు. తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మొదలుగాని సురేష్ గౌడ్, వేముల క్రీష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేల్లి ప్రసాద్ గౌడ్, చుక్క రవి గౌడ్,గౌడ గీత కార్మికులు తాళ్ల చంద్రమౌళి గౌడ్, పుల్లూరు రవి గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గిరిగాని మొగిలి,కోయ్యడి కిరణ్ కుమార్ గౌడ్, వేముల సారంగం గౌడ్,కుల పెద్దలు
చుక్క కనకయ్య గౌడ్,వేముల ఐలుసమ్మయ్య గౌడ్,గండు స్వామి, దొమ్మటి కుమారస్వామి గౌడ్,
తదితరు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version