దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు..

దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు.

మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో పత్తి సాగు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విక్రయాలు చేసేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆవరణలో పత్తి విక్రయాలపై సూచనలతో కూడిన వాలు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులు ముందస్తు కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ చేసుకొని సమీపంలో మిల్లుల వద్ద విక్రయించుకోవాలని పంట నమోదు తో పాటు బ్యాంకుకు తమ ఆధార్ కార్డును లింకు చేసుకోవాలని సూచించారు దళారులకు పత్తి అమ్మి రైతులు మోసపోవద్దని ఆమె తెలిపినారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి షరీఫ్ సూపర్వైజర్ రాజేందర్ రైతు సోదరులు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పడిదెల దేవేందర్ అల్లం సమ్మయ్య పాల్గొన్నారు.

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి….

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి

సిపిఐఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

మరిపెడ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, పత్తికి కనీస మద్దతు ధర 10075 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, ప్రభుత్వాలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అది మాటల్లోనే ఉందని, ప్రతి సంవత్సరానికి పెట్టు పడే రెండింతలు అవుతుందని దానికి తగిన ప్రతిఫలం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, పత్తి దిగుమతి పై ఉన్న 11% సుంకాన్ని కొనసాగించాలి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, పత్తి కొనుగోలు కేంద్రాల బాధ్యతనుండి తట్టుకోవాలనుకుంటున్న ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలి, అనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ విధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే,పక్షంలో రైతుల్ని అందర్నీ కలుపుకొని ఉద్యమం చేపట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఆర్గనైజర్ బాణాల రాజన్న, దొంతు మమత, కందాల రమేష్, కొండ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రైవేట్ కాంట్రాక్టర్లతో విధ్యుత్ అధికారుల దోస్తీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T130906.550.wav?_=1

 

ప్రైవేట్ కాంట్రాక్టర్లతో విధ్యుత్ అధికారుల దోస్తీ!

◆ – సంవత్సరాలు గడిసిన డివిజన్ లోనే బదిలీలకు కారణం..?

◆ – ఇతర డివిజన్ లకు ఏఈలు ఎందుకు బదిలీ కావడం లేదు

◆ – మన్నాపూర్, న్యాల్కల్, కోహిర్ సబస్టేషన్ పరిధిలోని దారుణం

◆ – రైతులకు నూతన విధ్యుత్ కనెక్షన్, ట్రాన్ఫర్మర్ కావాలన్న డిమాండ్

◆ – డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం అంటున్న రైతులు

◆ – జహీరాబాద్ డివిజన్ విధ్యుత్ అధికారుల పై చర్యలెందుకు లేవు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి:జహీరాబాద్ డివిజన్ విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొంత మంది అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో జతకట్టి అందినకాడికి దండుకుంటున్నారు.

 

కొత్త విద్యుత్ కనె క్షన్ల జారీ మొదలు, ప్యానల్బోర్డులకు ఎస్టిమేషన్, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్, విద్యుతీగల షిఫ్టింగ్ ఇలా ఏ పని చేయాలన్నా ప్రైవేట్ కాంట్రాక్టర్లను కలవా ల్సిందే. కస్టమర్ సర్వీస్ సెంటర్లులో ఎవరైనా నేరుగా వెళ్లి దరఖాస్తు చేస్తే పత్రాలు సరిగా లేవంటూ కొర్రీలు పెడుతుంటారు. దీంతో వినియో గదారులు ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రైవేట్ కన్ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కాంట్రా క్టర్లు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ అధికారులు, సిబ్బందికి వాటాలుగా పంచి తమ పబ్బం గడుపు తున్నారు.

 

 

జహీరాబాద్ డివిజన్ లో ఉన్న సెక్షన్లలో రెండు, మూడేళ్లకు ఒకసారి అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు, సబ్డివిజన్ స్థాయిలో అసి స్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏడీఈ)లు మారడం లేదు అంతే కాదు కాంట్రాక్టర్లు మారడం లేదు. సెక్షన్లలో కొందరు కాంట్రాక్టర్లు పాతుకుపోయి బదిలీపై వస్తున్న ఏఈలను తమకు అనుకూలంగా మార్చు కుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్ని సెక్ష న్లలో అధికారులు తమ బంధువుల పేర్లతో ప్రైవేట్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారు.రాష్ట్ర విధ్యుత్ అధికారులకు ఏమి తెలియదన్నట్లు స్థానిక విధ్యుత్ అధికారులు వ్యవహారిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్ లో జరుగుతున్న బాగోతాల వివరాలు సేకరిస్తుంది విజిలెన్స్ అధికారులు, జహీరాబాద్ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్న జిల్లా విధ్యుత్ అధికారులు కాని జిల్లా కలెక్టర్ కాని రాష్ట్ర విధ్యుత్ అధికారులు ఎందుకు చూస్తూ ఉరుకుంటున్నారో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు…

పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు
* నెలరోజుల పాటు ఉచిత టీకాలు
* పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు

మహాదేవపూర్ అక్టోబర్ 15 (నేటి ధాత్రి)

 

జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికొంటువ్యాధి టీకా కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 రోజుల వరకు అనగా నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలవుతుందని దీనిని మండలంలోని పాడి రైతులు అందరూ సద్వినియోగ పరచుకోవాలని కోరారు. మండలం మొత్తం మీద మూడు టీంలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ టీకాలు గ్రామాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గాలికుంటు వ్యాధి చాలా వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి అని ఈ వ్యాధి సోకిన పశువులకు పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుందని అంతేకాక రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుందని తెలుపుతూ మండలంలోని ప్రతి పాడే రైతు ఆరు నెలలకు టీకా వేయించడం ద్వారా తిని నివారించవచ్చని అన్నారు. ప్రతి పాడి రైతు తన పశువులకు టీకా వేయించి పషా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇది ఎఫ్ఎండి టీకా ఉచితం సురక్షితం మరియు శాశ్వత నివారణ మార్గం అని డాక్టర్ రాజబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా లైబ్రరీ చైర్మన్ కోట రాజబాబు, సింగల్ విండో చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, పశు వైద్య కేంద్ర సిబ్బంది, పాడి రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం…

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు బుధవారం ఉచిత పోషక టీ కల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వ్యాధి వల్లరైతులకుఆర్థికభారమవు
తుందన్నారు. పోషక టీలతో పశువుల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.జెంట్ డైరెక్టర్ వసంతకుమారిమాట్లాడుతూ.. మూడు నెలల పైబడిన పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటేల్,ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ సంగ్రామ్ పాటేల్, మాజీ ఎంపిటిసి మారుతీ రావు పాటేల్, ఏడి అధికారులు ఆదిత్య వర్మ, ప్రభాకర్,

ఈ డి డి ఎల్ పవన్, వైద్యాధికారులు సునీల్ దత్తు, హర్షవర్ధన్ రెడ్డి అంజికే, గోపాలమిత్ర సూపర్వైజర్ అర్జున్ అయ్యా, తుక్కారెడ్డి, గోపాల మిత్రులు శ్రీకాంత్ అలియాస్ జాన్, అశోక్ రమేష్, శివకుమార్, అశోక్ రావు పాటిల్, విజయ్ కుమార్ పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరప్ప పటేల్, గ్రామస్తులు మల్లేష్,సంజీవులు, మోహన్,మహేందర్,నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోళ్లు సాఫీగా జరగాలన్న మంత్రుల ఆదేశం

రైతులకు ఇబ్బదులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి
వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు
మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారిగా కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని గన్ని సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు, త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం తరలించుటకు లారీలను సమకూర్చుకోవాలని కోరారు
రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదేశించారు వడ్ల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున వడ్ల రైతులకు నష్టం జేరుగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు కలెక్టర్లు స్వయంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ వనపర్తి జిల్లా అక్టోబర్ చివరి వారం నుండి వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు
గతంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిన కేంద్రాల్లో మళ్ళీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా తూకము కాంటాలు తేమ యంత్రాలు సరిగ్గా చూసుకోవాలని అన్నారు. టార్పలిన్ లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని . లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, డి సి ఓ రాణి, డిటిఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రామడుగు బస్సుల సమస్యపై బీజేపీ నేతల ఆందోళన

బస్సు రాని పక్షంలో ఎల్లుండి ఆర్టీసి ఆఫీస్ ముట్టడి- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ పెగడపెల్లి నుండి గోపాలరావుపేట్ మీదుగా మోతె, గోలిరామయ్యపల్లి, కొక్కెరకుంట నుండి కరీంనగర్ వేళ్ళు బస్సు వచ్చే బస్సు ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని వారు అన్నారు. విద్యార్థులు, రైతులు, ఇతర ప్రాంతలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిందని అయిన కానీ స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పాట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకొని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ఎల్లుండి ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆర్టీసీ ఆర్ఎమ్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దూరుశెట్టి రమేష్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెళ్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, చేనేత సెల్ కన్వీనర్ రమేష్, సీనియర్ నాయకులు కలిగేటి ఎల్లయ్య, షేవెళ్ళ అక్షయ్, బూత్ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, రాగం కునకయ్య, అంబటి శ్రీనివాస్, ఉప్పు తిరుపతి, నాగి లచ్చయ్య, ఆకరపు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్…

వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కంబాలపల్లి లో పశువుల గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న ఝరాసంగం మండల పెద్దలు, నాయకులు ఇట్టి కార్యక్రమనికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిధి గా హాజరయ్యరు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్,సీనియర్ నాయకులు సంగ్రామ్ పాటిల్, మారుతీరావు పాటిల్, వేణుగోపాల్ రెడ్డి,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, వనంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, వినయ్ చిన్న,పాండు ముధిరాజ్,తెలంగాణ వాణి రిపోర్టర్ నాగన్న,బ్యాంక్ మిత్ర సంజీవ్,పశువులు వైద్యులు జెడి , మరియు మండల సిబ్బంది,డాక్టర్ జాన్ శ్రీకాంత్,మరియు గ్రామప్రజలు రైతులు పాలుగొన్నారు.

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు.. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో అది కనిపించడం లేదు. అరు గాలం వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంటలు పండించిన రైతులు ప్రభుత్వాలు సకాలంలో నాఫడ్ లేదా మార్క్ ఫడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటను కొనుగోలు చేయక పరేషాన్లో ఉన్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట చేతికి వచ్చింది. మండలంలో ఈ సీజ న్లో 4721 ఎకరాలలో రైతులు సోయాబీన్ పంట వేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో సోయాపంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. చివరకు ఉన్న పంటను రాసులు పట్టినా ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఒక ఎకరంలో సోయాబీన్ పంట పండించడానికి సుమారు 25వేయిల రూపాయల పెట్టుబడి అయితుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఎకరానికి 6 లేదా ఏడు క్వింటాళ్ళ దిగు బడి మాత్రమే వస్తుందని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు అమ్మితే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు సోయా బీన్ పంటను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంటను అమ్మకుని పెట్టుబ డులకు తెచ్చిన అప్పులు చెల్లిద్దామంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించా ల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దిగుబడి తగ్గి మార్కెట్ లో ధర లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధరకు అమ్ముకుని కొంతలో కొంతైనా ఉపశమనం పొందవచ్చని రైతులు భావిస్తున్నారు. సోయా బీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ కు 5328 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారలు క్వింటాల్ కు3800 నుండి 4000 రూపాయల వరకు ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ వద్ద సుమారు 1500 రూయాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతు
న్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు. ప్రాంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రాంభించాలి

జీర్లపల్లి సోయాబీన్ పంట చేతికి వచ్చిందని మార్కెట్లలో గిట్టుబాధర లభించ డంలేదు. 14 ఎకరాలు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సోయాబీన్ పంటను పండించాను. ఈ సీజన్ లో అధిక వర్షాలు పడి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొను గోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించి గిట్టుబాటు ధరకల్పించాలి.

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి….

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి

 

సోమవారం నాడు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సూపర్డెంట్ కి సోమవారంనాడు వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఈ కార్యక్రమంలో వీరి వెంట (ఏఐటియుసీ)కార్మిక సంఘం నాయకులు లంక దాసరి అశోక్,రైతునాయకులు సురావు బాబురావు,సురావు కిషన్ రావు,కోడం రవీందర్, రఘుపతి పలువురు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T141548.162.wav?_=2

 

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల పాక్స్. ఆధ్వర్యంలో. నేరెళ్ల. చిన్న లింగాపూర్ గ్రామాలలో.వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరెళ్ల పాక్స్. చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని. అలాగే రైతులు తమ పండించిన ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని. రైతులకు ఏమైనా ఇబ్బందులు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని . తగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించి సంబంధిత రైతులకు అన్ని రకాలుగా. ఏ ఇబ్బందులు. రైతుల సంక్షేమమే ధ్యేయంగాచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే.రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం . నిర్ణయించిన ధర చెల్లిస్తుందని దయచేసి రైతులు. దళారులను నమ్మి మోసపోవద్దని వారు పండించిన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. పాక్స్. డైరెక్టర్స్ అనిల్ రెడ్డి. రాజిరెడ్డి. గణేష్ గౌడ్. రవీందర్. రావు. నారాయణ గౌడ్. పొన్నాల కిషన్. ఏం సి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. నాయకులు లింగారెడ్డి. రవి. శ్రీనివాస్ గౌడ్. శోభ. పాక్స్. సిబ్బంది. రైతులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను దోచుకున్నోళ్ళు దోకా. కార్డు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని. సిరిసిల్ల వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆద్యం పోసింది కేటీఆర్ కాదా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి . గత మీ పాలన లో.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చి కొడుతారని.తప్పుడు ప్రచారానికి తెర లేపుతున్నారని. గత పది సంవత్సరాలు. అమలుకునోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా. ప్రజలను అరిగోశపెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయని హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేసిన o. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం ఆపడం లేదు అని. సిరిసిల్ల వేములవాడ గులాబీ నాయకులు ఇంత దోపిడీ చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు అని బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బి ఆర్ఎస్ నేతల . కండ్లు మండుతున్నాయని మీ ప్రభుత్వ హయాంలో మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. ఫామ్ హౌస్ లో.పడుకోవడానికి తప్ప పరిపాలన చేతగాని మీరా మమ్మల్ని విమర్శించేది గుట్టలకు గుట్టలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనం కోట్లు కొల్లగొట్టారని మూడు వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి మీ నాయకులు కోట్లు
సంపాదించిన మీరు ధోక కార్డు రిలీజ్ చేయడం సిగ్గుచేటని కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ లీడర్ల అవినీతి కార్డులు రిలీజ్ చేసి ఎన్నికలకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్ …

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తహసిల్దార్

నిజాంపేట, నేటి ధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకువచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్ ధాన్యానికి 2369 గా ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందన్నారు. కార్యదర్శి శ్యామల, ఏపిఎం అశోక్, సీసీ రవీందర్, గుర్రాల మమత, బెల్లం లావణ్య తదితరులు ఉన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు.
317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే.
మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది.
రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది.
అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం.
మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్
తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం.
గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..

#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..

#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…

#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ

హన్మకొండ, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.

పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.

కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం.
బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది.
వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది.
టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు.
పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది.
టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.”
పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది.
టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది.
ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది.
మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి…

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి

సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి
ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది
కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్,
చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

ఆయుధ పూజ మంత్రం ఇదే…

ఆయుధ పూజ మంత్రం ఇదే!

జహీరాబాద్ నేటి ధాత్రి;

దసరా పండుగకు ముందు వచ్చే ఆయుధ పూజను ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో మహర్నవమి రోజున జరిగే ఈ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులు, వాహనదారులు, టైలర్లు, కార్మికులు తమ పనిముట్లను, వాహనాలను దుర్గామాత ముందుంచి పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు యుద్ధానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచి పూజించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదమని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అని, కేరళలో పోటీలు, తమిళనాడులో సరస్వతీ దేవి పూజ (గోలు) చేస్తారు.

 వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు…

 వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు

అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.40 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దాదాపు 12.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ప్రవాహంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రోడ్లు నీటమునిగిపోవడంతో నాటుపడవలపైనే ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు.

అటు అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో వేలాది ఎకరాల్లో మిర్చి, ఉద్యాన, కాయగూరలు పంటలు నీట మునిగారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version