గంగమ్మ దేవస్థానం కొత్త కమిటీకి ఘన సత్కారం…

గంగమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన – సుమన్ బాబు..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్

 

తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా ఏర్పాటైన చైర్మన్ మహేష్ యాదవ్, కమిటీ సభ్యులు రుద్ర కిషోర్, విమల, వరలక్ష్మి, మధులత, గుణ, భాగ్య వల్లి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, శ్యామల, లక్ష్మనరావు లను.. గురువారం గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు ఘనంగా సత్కరించారు. చైర్మన్, కమిటీ సభ్యులందరికీ జనసేన నాయకులు సుధాకర్, పవన్ కుమార్, సుమంత్ లలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారుకూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ కమిటీ సభ్యుల ద్వారా గంగమ్మ తల్లిని భక్తులకు మరింత చేరువయ్యేలా చేయాలని, ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని సుమన్ బాబు కోరారు. ఈ క్రమంలో ఆముదాల వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పవన్ ముకేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోడీ జన్మదినం..

మోడీ జన్మదినం..
రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం బిజెపి నాయకులు రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిజాంపేట మండలం లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిజెపి మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా సేవ చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, సిద్దు రెడ్డి, భాజా అంజయ్య, శ్రీనివాస్, అభిషేక్ రెడ్డి తదితర బిజెపి నాయకులు ఉన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలంలోని ఫోటో & వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు,ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,గౌరవ అధ్యక్షులు సబ్బని సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పల శోభన్,కోశాధికారి రమేష్, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎస్.కె మహిన్,పుప్పాల సురేష్,రంజిత్,దుర్గాప్రసాద్, షారుక్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్ .

నిజాంపేట మండల అధ్యక్షునికిగా చంద్రశేఖర్

నిజాంపేట: నేటి ధాత్రి 

 

 

భారతీయ జనత పార్టీ మండల మండల అధ్యక్షునిగా చిన్మనమైన చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కి, జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version