సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్…

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్

◆:- శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.

◆:- డీసీఎంహెచ్ చైర్మన్. మల్కాపురం శివకుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నాఫెడ్ వారిచే మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోయబీన్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు. మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్. ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు 5328/ రూపాయలు. కావున రైతులు దళారుల వద్దకు తీసుకోనిపోయి మోసపోకుండా రైతులు సోయబీన్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇట్టి అవకశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ది పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ , ఏడాకులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ రైతు బంధు ఆధ్యక్షులు ప్రభు పటేల్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభుపటేల్. సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్. అగ్రికల్చరల్ ఏవో వెంకటేశం ఏఈఓ వేద రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు,

వర్షాల కాటుకు రైతులు అల్లాడుతున్నారు…

వర్షాల కాటుకు రైతులు అల్లాడుతున్నారు

◆:- ప్రభుత్వం రైతుల నాదుకోవాలి

◆:- యాసంగి పెట్టుబడికి రైతు భరోసా త్వరగా ఇవ్వాలి

◆:- మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్,మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సోయాబీన్, పత్తి, మొక్కజొన్న పంటలు
నీటమునిగి పాడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఝరాసంగం మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ తెలిపారు. వర్షం ఆగకపోవడంతో పంటల తేమ తగ్గక, కోతకు వచ్చిన పంట కూడా చెడిపోతోందని, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యం కూడా
తడిసి నాణ్యత కోల్పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ అధికారులు పంటల నష్టం వివరాలు సేకరిస్తున్నప్పటికీ, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాసంగి పంటల పెట్టుబడికి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, పంటల నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం అందించాలని, విత్తనాలు
మరియు ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు.. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో అది కనిపించడం లేదు. అరు గాలం వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంటలు పండించిన రైతులు ప్రభుత్వాలు సకాలంలో నాఫడ్ లేదా మార్క్ ఫడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటను కొనుగోలు చేయక పరేషాన్లో ఉన్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట చేతికి వచ్చింది. మండలంలో ఈ సీజ న్లో 4721 ఎకరాలలో రైతులు సోయాబీన్ పంట వేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో సోయాపంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. చివరకు ఉన్న పంటను రాసులు పట్టినా ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఒక ఎకరంలో సోయాబీన్ పంట పండించడానికి సుమారు 25వేయిల రూపాయల పెట్టుబడి అయితుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఎకరానికి 6 లేదా ఏడు క్వింటాళ్ళ దిగు బడి మాత్రమే వస్తుందని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు అమ్మితే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు సోయా బీన్ పంటను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంటను అమ్మకుని పెట్టుబ డులకు తెచ్చిన అప్పులు చెల్లిద్దామంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించా ల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దిగుబడి తగ్గి మార్కెట్ లో ధర లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధరకు అమ్ముకుని కొంతలో కొంతైనా ఉపశమనం పొందవచ్చని రైతులు భావిస్తున్నారు. సోయా బీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ కు 5328 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారలు క్వింటాల్ కు3800 నుండి 4000 రూపాయల వరకు ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ వద్ద సుమారు 1500 రూయాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతు
న్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు. ప్రాంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రాంభించాలి

జీర్లపల్లి సోయాబీన్ పంట చేతికి వచ్చిందని మార్కెట్లలో గిట్టుబాధర లభించ డంలేదు. 14 ఎకరాలు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సోయాబీన్ పంటను పండించాను. ఈ సీజన్ లో అధిక వర్షాలు పడి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొను గోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించి గిట్టుబాటు ధరకల్పించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version