వైద్య ఖర్చులకోసం నిరుపేద ఎదురుచూపు,
నేటి ధాత్రిమొగుళ్లపల్లి:
విద్యుత్ షాక్ తో ఒళ్లంతా కాలి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఒక యువకుడు వైద్య ఖర్చులకోసం అప్పన్న హస్తం అందించే మహానుభావుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నే అనిల్ అలియాస్ అంజి. ముట్లపల్లి సబ్ స్టేషన్ లో అన్ మ్యాన్డ్ కార్మికుడిగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు గత రెండు రోజుల క్రితం విద్యుత్తు పోలుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు తొలుతగా వరంగల్లోని గార్డెన్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుండి ఎంజీఎం కు పంపించారు మళ్లీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. రికార్డ్ అయితే డొక్కాడని అంజి కుటుంబం వైద్య ఖర్చులకోసం తెలిసిన బంధువుల వద్ద అప్పులు తెచ్చి చికిత్స అందిస్తున్నారు అయితే అవి సరిపోక మరిన్ని డబ్బులు కావాలని హాస్పటల్ సిబ్బంది తెలుపగా వైద్య డబ్బుల కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు గాయపడిన అంజికి భార్య తల్లి తండ్రి ఉన్నారు తండ్రి అనారోగ్యంతో మంచంలో పడి గత కొన్ని సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉండగా ప్రస్తుతం గాయపడిన అంజి కన్న తండ్రికి సేవలు అందించేవాడు ప్రస్తుతం అంజి వెన్నుముక దెబ్బతిని లేవనెల స్థితిలో దావకానలో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు భార్య కూలి పని చేసుకుంటూ ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న దిన స్థితిలో అంజి కుటుంబం తల్లడిల్లుతుంది యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడి ప్రజల నుండి ఆర్థిక సహాయం అర్జిస్తున్నాడు మనసున్న మహారాజులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జన్నే అంజి వైద్యం కోసం సహాయం అందించాలని అంజి కుటుంబ సభ్యులు ప్రజలను వేడుకుంటున్నారు, అంజికి ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా పంపించగలరు 8790519548.
Author: NETIDHATHRI
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*
అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ చిలకల రాయ కొమురు జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, టేకుమట్ల చిట్యాల పలువురు మండల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేయాలి.
దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేయాలి*
ఆర్టీసీ బీసీ సంఘం నర్సంపేట డిపో అద్యక్షులు కందికొండ మోహన్
నర్సంపేట,నేటిధాత్రి:
కార్మిక హక్కులను కాపాడుకోవడానికి ఈ నెల 9 న దేశవ్యాప్తంగా తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సాధించుకోవాలని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ పిలుపునిచ్చారు.అందుకుగాను సమ్మె వాల్ పోస్టర్లను డిపో ఆవరణలో శనివారం పలువురు ఆర్టీసీ నాయకులతో కలిసి మోహన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ దేశంలో బడా పెట్టుబడిదారుల కోసం కార్మికులను బలిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇప్పటికైనా కేంద్రంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా ఈ దేశవ్యాప్త సమ్మెలో నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికులు పాల్గొంటున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి ఓరుగంటి కొమ్మాలు, బాస్కర్, కే.ఎన్ గౌడ్, బాలరాజు కాసీం బీగం, సునిత తదితరురు పాల్గొన్నారు.
అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..
ఎమ్మెల్యే పై అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు..
సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం బిఆర్ఎస్ పాపం..
శిలాఫలకాలు వేయడమే తప్ప పనులు ప్రారంభించని బిఆర్ఎస్..
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..
రామాయంపేట జూలై 5 నేటి ధాత్రి (మెదక్)
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మాట్లాడి అర్హత బి.ఆర్.ఎస్ నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి ఎంత మాత్రం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం లేకపోవడంతో పాటు తక్కువ సమయంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు పట్ల ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలు వేయడం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన ఘటనలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలలు కాలం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో వేగంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లో 250 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను సైతం వారం రోజుల్లోకి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రావుకు దక్కింది అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కుంటూపడిందని కనీసం తన స్వగ్రామం కోనాపూర్ కూడా అభివృద్ధి నోచుకోని దుస్థితి దాపురించింది అన్నారు. రామయంపేట రెవిన్యూ డివిజన్ ప్రకటించి ఆర్డిఓ కార్యాలయం, సిబ్బంది నియమించకపోవడం కనీసం ఆర్డిఓ ఎవరు తెలియని పరిస్థితి అప్పటి బి ఆర్ ఎస్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. తూతు మంత్రంగా రెవిన్యూ డివిజన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, దేమే యాదగిరి చిలుక స్వామి, బైరం శంకర్ కంచర్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల.నిర్మాణానికి సంబంధించి రెండవ దశలో ప్రభుత్వ పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కు సంబంధించి అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు.
సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన విశ్రాంత సంగీత ఉపాద్యాయులు శంకర్ జోషి గారి మనమరాలు జన్మదిన వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు సతీ సమేతంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో టి. రవికుమార్,చెంగల్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా.
హుగ్గేల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా దత్తు రెడ్డి నియామకం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గారి ఆదేశాలు మేరకు హుగ్గెల్లి గ్రామం నూతన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పార్టీ అధ్యక్షులు దత్తురెడ్డి,వైస్ ప్రెసిడెంట్ గా ఎండీ అహ్మద్ ,జనరల్ సెక్రటరీ గా బొడ తుకారాం లకు మరియు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, గ్రామ పార్టీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు సన్మానించి ,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ మోసపూరిత 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దేనెక్కిందని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ తరపున తమ పోరాటం తప్పదన్నారు సమీష్టగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు
ఈ కార్యక్రమంలో పీజీ శంకర్, కిష్టా రెడ్డి,రాథోడ్ భీమ్ రావు నాయక్,మధు, అహ్మద్,కసిం,షకీల్,అడ్డు,బాబ్బు తదితరులు పాల్గొన్నారు.
మొహరం సందర్భంగా పీర్లను దర్శించుకున్న.
మొహరం సందర్భంగా పీర్లను దర్శించుకున్న బీ. ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో పీర్ల గుట్ట లో పీర్ల పండుగ మొహారం సందర్భంగా బి ఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు గట్టు మీద ఇమామ్ హుస్సేన్ గట్టు మీనయ్యను బీ ఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ 15 అవార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆర్ ఎం పీ డాక్టర్ డానియల్ సాయికుమార్ మాజీ వక్సు బోర్డు సభ్యులు షేక్ జహంగీర్ తోట శ్రీను త దితరులు పాల్గొన్నారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు
టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం..
టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు… ప్రసాద్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,
ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ కూడా టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని సంతాపం తెలియజేశారు. మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగినది.
5వ మహాసభలను జయప్రదం చేయండి.
సిపిఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయండి
పలిమల మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్ కుమార్ పలిమల మండల కేంద్రంలో సిపిఐ నాయకులతో కలిసి వాల్ పోస్టర్లను(గోడ పత్రికలు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జులై 13 14వ తేదీన రేగొండ ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిలు గా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా పలిమల మండలం అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది అన్నారు. పలిమల మండల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. పలిమల మండలంలోని పోడు చేసుకున్న రైతులకు పట్టాలి ఇవ్వాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి ఆందోళన పోరాటాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సిపిఐ 5వ జిల్లా మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, మండల నాయకులు మట్టి సర్వేష్, మట్టి కృష్ణ, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ అమీలే శ్రీనాధ్, శ్రీకాంత్, అంజి బాబు, మారవేణి వెంకట్, పోడెం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్.
బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్
మహాదేవపూర్ జూన్5( నేటిధాత్రి )
మంథని నియోజకవర్గంలో అణగారిన వర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత నాయకుడు మెరుగు లక్ష్మణ్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది
ముఖ్యంగా పార్టీకి రాజీనామా చేయడంలో పార్టీలో జరుగుతున్న అనగారిన వర్గాల కార్యకర్తల విషయంపై మంథని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల నాయకులు
పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్యకర్తల పట్ల వివక్ష చూపుతున్నారు కావున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది
ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
కాబట్టి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!
వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా
లక్ష తులసి పుష్పార్చన
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మహమ్మద్ జుబేర్ (హౌసింగ్ బోర్డ్) గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా శనివారము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,విజిలెన్స్ మెంబర్ రామకృష్ బంటు,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకట్ ,నాయకులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు ముర్తుజా,జాకీర్,సలీం,అవేజ్,విజయ్ రాథోడ్ ,ఫహీం,తదితరులు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…
నేటి ధాత్రి -గార్ల :-
వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు..
పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు
నీరుకుళ్ళ బస్టాప్ లలో దర్జాగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్
నిలవడానికి నీడ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు
నేటిధాత్రి, ఆత్మకూరు.
హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద.., వరంగల్ నుండి ములుగు కు వెళ్లే ప్రధాన రహదారి నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద రహదారికి ఇరువైపుల ఉన్న బస్ స్టాపుల్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్న తీరు. ప్రయాణికుల కోసం ప్రజలు నిల్చోవడానికి ఏర్పాటు చేసిన బస్ స్టాపుల్లో దర్జాగా ద్వి చక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తున్న వాహనాదాలు. దీంతో ప్రజలు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే వర్షాకాలం ప్రయాణం చేస్తున్న ప్రజలు నీడ కోసం నిలబడే బస్ షెల్టర్ లలో వాహనాలు పార్కింగ్ చేయడం సమంజసం కాదు అని ప్రయాణికుల ఆవేదన. స్థానిక పోలీసు అధికారులు స్పందించి బస్ స్టాప్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాల్సిందిగా ప్రయాణికుల విజ్ఞప్తి.
సదరు బస్ స్టాప్ దగ్గర వాహనాలు పార్కింగ్ చేయొద్దు అని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా!
సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్తో లోన్ పొందడం చాలా ఈజీ
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే చాలా మంది లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాన్ని తిరస్కరిస్తున్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ గురించి రుణం తిరస్కరణకు గురవుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.సిబిల్ స్కోరు అంటే మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ యోగ్యతకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ను మంచి క్రెడిట్ స్కోర్గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ దరఖాస్తులను ఆమోదించడానికి పరిగణించే అంశాల్లో ఒకటిగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు పేర్కొన్న నగరాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ నగరాల్లో నివసించే పౌరులకు మాత్రమే అవి క్రెడిట్ ఉత్పత్తులను ఆమోదించవచ్చు. ఉదాహరణకు హెచ్ఎస్బీసీ వెబ్సైట్ ప్రకారం హెచ్ఎస్బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలలో ఒకటి దరఖాస్తుదారు నివసించే నగరం. చెన్నై, గుర్గావ్, ఢిల్లీ, పూణే, నోయిడా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్ లేదా కోల్కతా వంటి నగరాల్లో ఉంటేనే రుణాన్ని మంజూరే చేస్తాయి.
మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే మీ కెరీర్లో అస్థిరంగా ఉన్నందున బ్యాంక్ దానిని పరిగణిస్తుంది. బ్యాంకులు తమ రుణగ్రహీతలు స్థిరమైన కెరీర్ను కలిగి ఉండాలని ఇష్టపడతారు. కెరీర్ స్థిరత్వం నెలవారీ ఆదాయం క్రమం తప్పకుండా రావడానికి హామీ ఇస్తుంది. దీనిని వ్యక్తిగత రుణ ఈఎంఐ ఇతర బాధ్యతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.
ఎడ్జ్బాస్టన్లో కీలక ఇన్నింగ్స్…
ఎడ్జ్బాస్టన్లో కీలక ఇన్నింగ్స్.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులతో చెడుగుడు ఆడేసిన పానీపూరీ వాలా
India vs England 2nd Test: బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.
మీ కిచెన్లోనే గోంగూర చికెన్ బిర్యానీ..
మీ కిచెన్లోనే గోంగూర చికెన్ బిర్యానీ.. ఎలా తయారుచేసుకోవాలి అంటే?
భారతదేశంలో చాలామంది ఇష్టపడే వాటిలో బిర్యానీ ఒకటి. బిర్యానీలో చాల రకాలు ఉన్నాయి. వాటిలో గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి. గోంగూరతో పచ్చడి, కూరలు మాత్రమే కాదు. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేయవచ్చు. పుల్ల పుల్లగా నోరూరించే టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీలలో ఒకటి. ఈ రోజు ఆంధ్రాస్టైల్ లో నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ కేజీ, ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి, అల్లం వెల్లుల్లిపేస్ట్,టొమాటో – ప్యూరీ, గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు), కారం – 2 టీస్పూన్,పసుపుచిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – తయారీకి సరిపడా, నీరు – ఒక కప్పు, మసాలా పొడి
