తుల్జా భవానీ ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T132840.233.wav?_=1

 

 

తుల్జా భవానీ ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అర్బన్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఖాన్జమాల్పూర్ (భవనమ్మ పల్లె)లోని తుల్జాభవానీ మాత ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారం, వెండి నగలు సహా హుండీ ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును అపహరించి ఆలయ పరిసరాల్లో పడేసి వెళ్లిపోయారు. ఇటీవల దసరా వేడుకల అనంతరం అమ్మవారి నగలు, హుండీ కానుకలు లెక్కించకుండా ఉంచడంతో దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

హుండీ ఆదాయం రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు భావిస్తున్నారు.చోరీ ఘటన తెలుసుకున్న చిరాగ్పల్లి పోలీసులు ఆలయానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115912.178.wav?_=2

 

రిజర్వేషన్ల పేరుతో బేసి లను మోసం చేసిన ప్రభుత్వం….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం పట్ల రెడ్డి జాగృతి నాయకులు కేసు వేసి అడ్డుకోవడం పట్ల స్పందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది అని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు . 5 శాతం లేని అగ్రవర్ణాలకు 10 శాతం EWS రిజర్వేషన్ ఇస్తే ఏ బీసీ నాయకులు అడ్డుకోలేదని అగ్ర వర్గాలలో ఉన్న పేదలకు న్యాయం చేయాలని కోరుకున్న బీసీ సమాజానికి నేడు రెడ్డి జాగృతి నాయకులు బీసీలకు వచ్చిన 42% రిజర్వేషన్లు పట్టు పట్టి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో బీసీలు అగ్ర వర్గాలతో రాజకీయ యుధం చేయడానికి సిద్ధమే అని హెచ్చరించారు.ఈ సమావేశంలో లో జహీరాబాద్ తాలూకా బీసీ నాయకులు కొండాపురం నర్సిములు, డా.పెద్దగొల్ల నారాయణ,పెద్దతోట రాచన్న ,కోహిర్ మండల్ నాయకులు,విశ్వనాథ్ యాదవ్,రమేష్ ముదిరాజ్,గొల్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీకాంత్,అంబదాస్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115143.728.wav?_=3

 

 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ…

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ

ఏరియా జియం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

వోల్వో డంప్ ట్రక్కు ఆపరేటర్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై, కనీసం మూఢు సంవత్స రాల,అనుభవం కలిగివున్న హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నిరుద్యోగ యువకులైన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు . దీనికి ముడునెలలకు ఒక బ్యాచ్ కు 60 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం, మెరిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు . ఎస్సీ, ఎస్టీ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, వయస్సు మినహాయింపు ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఎటువంటి స్టెఫండ్ కానీ భృతి కానీ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తిగా వారి సొంత పూచికత్తు మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.ఈ దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సంబంధిత భూపాలపల్లి సింగరేణి ఎంవీటీసీ (మైన్ వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్) లో అందజేయాలని తెలియజేశారు .

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం….

ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అలాగే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు,తాజా ఆకుకూరలు, కూరగాయలు,పండ్లు తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలని అప్పుడే పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలు, మహిళలతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఆయమ్మ,గర్భిణీ స్త్రీలు,పిల్ల తల్లులు మహిళలు పాల్గొన్నారు.

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి….

చే గెవారా ఆశయాలను కొనసాగించాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని చే గువేరా వర్ధంతి సందర్భంగా ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ చే గెవారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.

అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.

1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం
నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు చేగువేరా భావించాడు ఎన్నో పోరాటాలు చేసిన అతడు 39 సంవత్సరాలు అనేక ప్రజా పోరాటాలు చేసినారు
1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను..
1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. కావున చేగువేరా ఆశయాలను కొనసాగించాలి

న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే…

న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగిన దాడి అంటే రాజ్యాంగం పై దాడి అని ప్రజాస్వామ్యం పై దాడి అని దేశ దళిత బహుజనుల పై దాడి రాజ్యాంగాన్ని అవమానించడమేనని మతోన్మాద విష సంస్కృతితో నే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మనువాద కోణంలో పరిపాలించాలనే దురుద్దేశంతో కొంతమంది మనువాదులు దళితుల పట్ల చూపే రాజకీయవాదులు చేసే కుట్రలను మేము ఖండిస్తున్నాం,ఈ సంఘటనను దళిత గిరిజన బహుజనులు వెనుకబడిన వర్గం మేధావులు ప్రజలు వ్యతిరేకించాలని వారు తెలిపారు.

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను దోచుకున్నోళ్ళు దోకా. కార్డు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని. సిరిసిల్ల వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆద్యం పోసింది కేటీఆర్ కాదా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి . గత మీ పాలన లో.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చి కొడుతారని.తప్పుడు ప్రచారానికి తెర లేపుతున్నారని. గత పది సంవత్సరాలు. అమలుకునోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా. ప్రజలను అరిగోశపెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయని హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేసిన o. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం ఆపడం లేదు అని. సిరిసిల్ల వేములవాడ గులాబీ నాయకులు ఇంత దోపిడీ చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు అని బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బి ఆర్ఎస్ నేతల . కండ్లు మండుతున్నాయని మీ ప్రభుత్వ హయాంలో మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. ఫామ్ హౌస్ లో.పడుకోవడానికి తప్ప పరిపాలన చేతగాని మీరా మమ్మల్ని విమర్శించేది గుట్టలకు గుట్టలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనం కోట్లు కొల్లగొట్టారని మూడు వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి మీ నాయకులు కోట్లు
సంపాదించిన మీరు ధోక కార్డు రిలీజ్ చేయడం సిగ్గుచేటని కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ లీడర్ల అవినీతి కార్డులు రిలీజ్ చేసి ఎన్నికలకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

తంగళ్ళపల్లినేటి ధాత్రి….

 

బి జె ఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో.08.10.2025.న. వ్యవసాయ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా. శ్రీ మెండు శ్రీనివాసులు. సహాయ వ్యవస్థాపకుడు సమృద్ధి ego అగ్ర ఫ్లెక్సీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు హాజరై. విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఉన్న వివిధ అవకాశాలు వ్యవసాయ పారిశ్రామికత. నైపుణ్య అభివృద్ధి అంశాలపై విలువైన సూచనలు చేశారు కళాశాల అసోసియేట్ డాక్టర్ సునీత దేవి మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అర్జించాలని నూతన వ్యవస్థాపక తలు. చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్లేస్మెంట్ ఇన్చార్జి డాక్టర్ ఆర్ సతీష్. డాక్టర్ భవ్య శ్రీ. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు అవగాహన సదస్సుకు విచ్చేసిన. వారు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత…

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఎడుల్ల బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు అతనికి ముగ్గురు ఆడపిల్లలే వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న మహిళా అధికారిని ఏడుల బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది, ఆడపిల్లలు ఎప్పుడు కూడాను తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది కనుక కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది.
, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు
గ్రామ పెద్ద మనుషులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

*సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*కమిషనర్ ఎన్. మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:

 

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

తాండూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ…

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్.

 

తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్‌ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.

ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి…

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి , చేనేత జౌళి శాఖ ఏడి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో వివిధ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేదలాదిమంది కార్మికులకు చాలా సంవత్సరాలుగా సిరిసిల్ల బి.వై. నగర్ లో అందుబాటులో ఉండి సేవలందించిన జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం వలన కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు , సమాచారం కోసం లేదా ఏదైనా పని నిమిత్తం కలెక్టరేట్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే కార్మికులకు దూర భారంతో పాటు ఆర్థిక భారం మరియు కొంత సమయం పని కూడా కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాను పోను ప్రయాణంలో

 

 

ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లో చేనేత జౌళి శాఖ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అప్పటి కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో ఆఫీసును కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం జరిగిందని ఆఫీసును మార్చడం ద్వారా కార్మికుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృశ్య యధావిధిగా సిరిసిల్లలోకి ఆఫీసును మార్చాలని పలు దాఫాలుగా కలెక్టర్ గారికి విన్నవించినప్పటికీ కూడా కలెక్టర్ పట్టించుకోలేదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ కలెక్టర్ అయినా వేలాదిమంది కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఆఫీసును యధావిధిగా సిరిసిల్లలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , గుండు రమేష్ , ఎక్కల్ దేవి జగదీష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

పెట్రోల్ బంకులలో తనిఖీలు చేపట్టిన తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

జైపూర్ మండలంలోని ఇందారం, నర్వ, జైపూర్ గ్రామాలలోని పెట్రోల్ బంకులను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ వనజా రెడ్డి గురువారం తనిఖీలు చేపట్టారు. పెట్రోల్ బంకులలో యజమాన్యం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత గాలి, త్రాగునీరు టాయిలెట్స్, ఫైర్ ఫైటింగ్ ఎంక్విమెంట్లను తనిఖీలు చేసిన అనంతరం పెట్రోల్ బంకుకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులను నిర్వహించాలని అన్నారు.వినియోగదారులతో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిని కించపరచడం లాంటిది చేస్తే తగు చర్యలు తీసుకుంటామని యజమానులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తిరుపతి, జిపిఓ నవీన్, రాజు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తనిఖీలు చేపట్టిన అధికారులు

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా స్వేచ్ఛాయితంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం తహసిల్దార్ వనజా రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,సిఐ వేణు చందర్,శ్రీధర్ ఇందారం గ్రామంలో గురువారం తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టారు

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.

“ముత్యంపేట్‌లో వరల్డ్ పోస్టల్ డే అవగాహన కార్యక్రమం”..

మల్లాపూర్ అక్టోబర్ 9 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల్ ముత్యంపేట గ్రామంలో వరల్డ్ పోస్టల్ డే సందర్భంగా తపాల శాఖ వారు పోస్టాఫీస్ ముత్యంపేట్ సిబ్బంది సబ్ పోస్టుమాస్టర్ ఎన్ ఎం శ్రీనివాస్.డక్ సేవకులు ప్రశాంత్ భూమయ్య చంద్రమౌళి ప్రజలకు పోస్టాఫీస్ స్కీముల పైన గురువారం అవగాహన కల్పించడం జరిగింది ఇందుకోసం స్కూల్స్ గ్రామపంచాయతీ ముత్యంపేట్ లో కొన్ని వీధులను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version