పోలింగ్ బూత్లను పరిశీలించిన మాజీ మంత్రి..

పోలింగ్ బూత్లను పరిశీలించిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ బుధవారం ఉదయం 19వ వార్డులోని 60, 61 పోలింగ్ బూత్లను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల పోలింగ్ సరళిని ఆయన పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి, ఓటర్లు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా కొనసాగాలని సూచించారు.

బారాస కౌన్సిలర్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపు

బారాస కౌన్సిలర్ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపు…

బారాస నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గండమాల కృపానందం (గ్యాస్ నాని) ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి,బలవంతంగా విత్ డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా సమయం అయిపోయిన గంట తర్వాత తీసుకుని రావడంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులు సమయం దాటి పోయిందని అనుమతించలేదు. ఆ అభ్యర్థి కంట నీరు పెడుతూ గజగజ వనికి పోతుండగా గమనించిన బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇరు పార్టీల నాయకులు అభ్యర్థిని ఏం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ను మా పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని బెదిరించి ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా చేసుకోవాలని తీసుకురావడం ఏంటని నిలదీశారు. అప్పటికే అభ్యర్థిని దబాయిస్తూ నిన్ను మేము బెదిరించామా అంటూ అభ్యర్థిని గద్దించాడు.అభ్యర్థి గ్యాస్ నాని వనికిపోతూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. బారాస నాయకులు, అధికార పార్టీ నాయకులను అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై జె శ్రీధర్ గొడవ జరిగేలా ఉందని గమనించి అందర్ని కార్యాలయం బయటికి పంపించి వేశారు.

క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిశీలన

క్రిటికల్ పోలింగ్ బూత్ లను పరిశీలించిన రాష్ట్ర జనరల్
మెట్ పల్లి ఫిబ్రవరి 3 నేటి దాత్రి

 

మెట్పల్లి లోని క్రిటికల్ పోలింగ్ బూత్ లను రాష్ట్ర జనరల్ అబ్సర్వర్ పుర ఎన్నికల పరిశీలకుడు కాళీ చరణ్ ఐఏఎస్ పరిశీలించారు కాళీ చరణ్ ఐఏఎస్ మాట్లాడుతూ పుర ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు తగు సూచనలు చేసినారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ శ్రీనివాస్ ఎమ్మార్వో నీతా మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ డి ఈ నాగేశ్వరరావు సిఐ అనిల్ కుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి…

మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు,ఈ. ఆర్. ఓ. లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు ముందు గా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని,ఇందుకుగాను గ్రామ పాలన అధికారులు,ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని,బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు,ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.40 సంవత్సరాల లోపల ఉన్న మహిళల మ్యాపింగ్ ను వారి తల్లిదండ్రుల వివరాల ఆధారంగా చేయాలని,బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని,బ్లర్డ్ ఫొటోస్,డబుల్ ఎంట్రీలపై దృష్టి సాధించాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందని,బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ,ఎన్నికల అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు నేడు ముగింపు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడుపు నేటితో ముగింపు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల కు నేటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. తొలిరోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ రెండో రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. మూడవ రోజు అభ్యర్థులు నామినేషన్లు భారీగా వేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు, మందమర్రి సిఐ పి రమేష్ ,ఆర్కెపి ఎస్సై జే శ్రీధర్ లు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రం వద్దకు ఆర్డిఓ శ్రీనివాసులు వచ్చి పర్యవేక్షణ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధన మేరకు అనుమతులు ఇచ్చారు.

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ..

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిగ్రామంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో. లక్ష్మి రాజo.ఈ సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి.ఎంపీడీవో మండలంలో పలు గ్రామాల్లో రెండో విడత జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఏమైనా అడపా దడపసంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పరిశీలిస్తున్నార.అని తెలుసుకుంటూ నామినేషన్ల పక్రియలోఎటువంటిచెదురు మధురుసంఘటనలు జరగకుండా పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కొనసాగించాలని నామినేషన్ల ప్రక్రియ పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేస్తూ ఏదైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామినేషన్.పక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని సంబంధిత.అధికారులను ఆదేశించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version