ప్రజాకవి కాళోజీకి కలెక్టర్ ఘన నివాళులు…

ప్రజాకవి కాళోజీకి కలెక్టర్ ఘన నివాళులు

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ప్రజాకవి పద్మవిభూషన్
కాళోజీకి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఘన నివాళులు అర్పించారు.పద్మవిభూషన్
కాళోజీ నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చేసిన సేవలను,దమన నీతికి, నిరంకుశత్వానికి,అరాచక పాలనకు వ్యతిరేకంగా కాళోజీ తన కలం ఎత్తాడు. స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు.అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టిన ప్రభుత్వం.. హన్మకొండ నగరంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాళోజీ జంక్షన్ లో..

ప్రజాకవి కాళోజీ 111వ జయంతి ఉత్సవాన్ని (తెలంగాణ తెలుగు భాష దినోత్సవం) పురస్కరించుకుని మంగళవారం హనుమకొండ కాళోజీ జంక్షన్ లో గల ఆ మహనీయుని నిలువెత్తు విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూలమాల వేసి నివాళులు అర్పించారు

కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు…

కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్న మహానుభావుడు ప్రజా కవి కాళోజి నారాయణరావు అన్నారు అని ఎంపీడీవో గజ్జెల విమల మాట్లాడారు.
నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవ కు సంతృప్తి అని అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అని, అన్యాయాన్ని ఎదురించినవాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించినవారు కాళోజీ అని తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతి ధ్వనిగా ఉంటారని,అన్నారు.
పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణ కి ఇచ్చిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని అతని జన్మదినాన్ని పురష్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవం గా ప్రకటించారు.
కాళోజీ రచనలు, కాళోజీ కథలు,నా గొడవ,జీవన గీత, తెలంగాణ ఉద్యమ కథలు ఎన్నో పుస్తకాలు రాసారు.
1968 సంవత్సరములో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే పురస్కారం ప్రజాకవి గా బిరుదు పొందారు.
1992 సంవత్సరము లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు కొనసాగారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో విద్యావతి,టి ఏ స్వప్న, కార్యాలయ సిబ్బంది గోవిందు నవీన్ కుమార్, దర్శన్,రాజేందర్,నడికూడ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు అంగన్వాడీ టీచర్ కళావతి, ఆయా నర్సక్క,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం…

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఎస్పీ తెలిపారు. కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే నివాళులర్పించరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

 

 

 

తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని,తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని,తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు.భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింపబడిన ప్రజాకవి కాళోజీ గారి స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, సి.ఐ మధుకర్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అన్యాయాన్ని ఎదిరించిన కాళోజీ ఆదర్శం..

అన్యాయాన్ని ఎదిరించిన కాళోజీ ఆదర్శం
వనపర్తి నేటిదాత్రి.

 

 

 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి సందర్భంగా నివాళులు అర్పిoచారు ఈకార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష.శంకర్ గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version