భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే, రాంచంద్రునాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

మొంథ తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ సంబంధిత జిల్లా కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోతున్న ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు,ప్రజల ప్రాణాలు అత్యంత విలువైనవి. అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు,” అని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ప్రజలను హెచ్చరించారు,అలాగే రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, వర్షాల ప్రభావంతో చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. నేను స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నాను.ఎక్కడైనా అత్యవసర సహాయం అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు లేదా అధికారులను తక్షణమే సంప్రదించండి, అని ఎమ్మెల్యే తెలిపారు,మొత్తం మీద, వర్షాల సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ స్పష్టంగా సూచించారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు..

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు

మందమర్రి నీటి ధాత్రి

 

ఈరోజు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది
*
పరామర్శించిన వారిలో వి హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ఎం ఆర్ పి ఎస్ అసిఫాబాద్ జిల్లా కో ఇన్చార్జి మంత్రి మల్లేష్ మాదిగ
బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు గాలి పెళ్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవమానం పై బీసీ, దళిత సంఘాల నిరసన

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను అవమానపరిచిన జిల్లా కలెక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

బీసీ, దళిత సంఘాల డిమాండ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అవమానపరిచి అగౌరపరచినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలుమరియు దళిత సంఘాలు గురువారం రోజున డిమాండ్ చేశాయి, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం నరసయ్య, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్పా దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, పద్మశాల సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాసు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రాగుల రాములు, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం ,

 

 

 

బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ లు గురువారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేసి మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఫోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని మరియు ప్రజా పాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు, ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీనివాసును ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు , చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన అనంతరం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు, ఆది శ్రీనివాస్ పై జరిగిన అవమానం యావత్తు బీసీ ,దళితులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నామన్నారు, చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు,గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు , బొప్ప దేవయ్య , చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాములు ,రాగుల జగన్ ,బట్టు ప్రవీణ్ ,తడక కమలాకర్, కంచర్ల రాజు , రవీందర్, మల్లేశం ,ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం…

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే

పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.

 

 

ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.

 

 

2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను.
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది.
సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది.
మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు.
గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్
(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది.
మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది.
పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరియు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,తదితరులు నివాళులు అర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version