ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరిసిల్లలో లో”NSS- ఆధ్వర్యంలో ” జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ఘనంగా నిర్వహిస్తూ, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్ భారత మాజీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలను విద్యార్థులకు హిస్టరీ ఉపన్యాసకులు తెలిపారు.ఏక్తా శపథ్’ (ఐక్యతా ప్రతిజ్ఞ) చేశారు. “దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఈ ప్రమాణం స్వీకరిస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద,కేదారేశ్వర్,శ్రీధర్,కనకయ్య,ఆంజనేయులు ,రాజయ్య, అరుంధతి ,విజయ, సరోజ, సురేష్ ,శశిధర్, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత,అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version