వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమైక్యంగా ఆలాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద పలువురు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తినిచ్చిందని అదేవిధంగా భారత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వందేమాతరం గీతం నిలవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించాడం జరిగినది. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

 

 

, ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ సమగ్రతను, శౌర్య పరక్రమానికి సాహిత్యనికి, వందేమాతరం ఒక అద్భుత రచన గేయం అలాంటి గేయం మన దేశంలో బకించంద్ర చటర్జీ రాసి మనందరికీ అందించడం వందేమాతర గేయం ఇప్పటికీ 150 సంవత్సరాలు ఆయన సందర్భంగా మనమందరం గేయ ఆలాపన చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇన్స్పెక్టర్ లు రవి, నాగేశ్వరరావు , మధుకర్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, రాజు,సాయి కిరణ్,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గేయా లాపన చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version