రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి….

రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి

– బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

– సదరం శిబిరం పరిశీలన

– సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

వైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. రోగులకు మెరుగైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించడం వైద్యుల ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.

శిబిరానికి ఎందరు వచ్చారు?

దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరం నిర్వహిస్తుండగా, ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. సదరం రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, వివరాల నమోదు, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సౌకర్యాల తీరును ఆరా తీశారు. మొత్తం 50 మందికి ఆర్థోకి సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు.

సదరం శిబిరానికి రావడానికి మీరు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నారు? ఈ రోజు శిబిరానికి రావాలని మా సిబ్బంది మీకు ఫోన్ చేశారా లేదా అని ఆరా తీశారు.

శిబిరం నిర్వహణకు సంబంధించిన వివరాలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు

శిబిరానికి వచ్చే వారి కోసం గదిలో మౌలిక వసతులు కల్పించాలని, ఫర్నిచర్ ఇతర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీఓ శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి…

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి
– బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కోటిలింగాలను అక్కడి నుండి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నవి వాటిని జరపకుండా కోటిలింగాలను మాత్రమే జరపాలని ప్రయత్నం చేస్తున్నారని దీనివలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ (విటిఏ.డి.ఏ) వైస్ చైర్మన్ కి మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుక ముందుగా దర్గాను తొలగించిన తర్వాత ఏ కార్యక్రమమైన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజు రెడ్డి, జిల్లా కార్యదర్శి గొప్పడి సురేందర్రావు, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు వేణుగోపాలరావు, కోడె రమేష్, మిర్యాల్కార్ బాలాజీ, రాపెల్లి శ్రీధర్, బురుగుపల్లి పరమేష్, సౌల క్రాంతి, బిజెపి సీనియర్ నాయకులు గజ బింకర్ చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. కేజీబీవీ. ను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మేడం. విద్యాలయంలో ఆరుబయట విద్యార్థులతో కూర్చొని పలు అంశాలపై చర్చించారు. ముందుగా స్టోర్ రూమ్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని. కోడిగుడ్లు. కూరగాయలు పరిశీలించారు . ఈ సందర్భంగా విద్యార్థుల్లో పాటు కింద కూర్చొని మెనూ ప్రకారం చికెన్ మటన్ కోడిగుడ్డు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరిస్తూ పర్యావరణ భవిష్యత్తు ప్రణాళికల అంశాలపై చర్చించారు. తద్వారా పాఠశాల విద్యాలయం ఆవరణలో 9వ తరగతి విద్యార్థులకు బయో సైన్స్ లోని. ఫోటో సింథసిస్. పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పిలుపునిచ్చారు ఆర్థికంగా కూడా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని. విద్యాలయం ఆవరణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తద్వారా డి ఈ ఓ.ను. ఇన్చార్జి కలెక్టర్. గరీమాఅగ్రవాల్. ఆదేశించారు ఇట్టి కార్యక్రమంలో. కేజీబీవీ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version