పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం.

పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం.

మంగపేట నేటిధాత్రి

 

 

భారత్ తొలి ప్రధాని హోం శాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం మంగపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగపేట ఎస్ ఐ టి వి ఆర్ సూరి మాట్లాడుతూ.

భారత స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత కూడా సుమారు 565 రాజ్యాలు హైదరాబాద్ సంస్థనంతో కలిపి భారత్ లో విలీనం కాలేదు. దేశానికి మొదటి ఉప ప్రధాని, హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వున్నారు. వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఆటక్ నుండి కటక్ వరకు వున్న చిన్న చిన్న రాజ్యలను భారతదేశం దేశంలో కలపడానికి విశేషమైన కృషి చేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్యం రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే భారత యూనియన్ లో చిన్న చిన్న రాజ్యలన్నీ కలపగాలిగారు. భారత్ ను ఒక సర్వబౌమ దేశంగా ఏకికరించే మహాత్తర కార్యానికి పునుకునుని సఫలికృతమయ్యారు. దేశాన్ని ఒకటిగా చేసారు. అందుకే పటేల్ 150 వ జయంతిని దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటుంది అని అన్నారు.

రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం లో పోలీసులు, యువజన సంఘాల

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T114141.957.wav?_=1

 

భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్
: ఎస్పీ మహేష్ బి. గితే

– “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం

– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ

– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ కమాండెంట్ సురేష్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ లు రాందాస్, ఎస్. సురేష్, ఇన్స్పెక్టర్ లు కృష్ణ, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు,కిరణ్ కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ యాదవ్, సాయి, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, బెటాలియన్ సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, యువత క్రీడాకారులు పాల్గొన్నారు.

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది…

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

 

అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ…

క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ

 

మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.

విజయవాడ, అక్టోబర్ 31: ఇన్నర్ వీల్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు (MLA Bonda Uma Maheshwar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ని జయించటం కోసం పోరాడుతోందన్నారు. క్యాన్సర్‌ని జయించాలంటే, మొట్టమొదటి పరిస్థితుల్లోనే దాన్ని డయాగ్నెస్ చేస్తే చాలా వరకు క్యూరైపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్‌మెంట్‌తో అనేక క్యాన్సర్లకి మందులు, వ్యాక్సిన్ కూడా వచ్చాయని.. దీన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బెస్ట్ క్యాన్సర్‌తో పాటు సర్వైవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే సీఎం చంద్రబాబు (CM Chandrababu) కల అని స్పష్టం చేశారు. మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు. ఇన్నర్‌విల్ క్లబ్ వంటి సంస్థలు ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. వారు కేవలం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉచిత స్క్రీనింగ్ టెస్ట్‌లను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
ఇది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఆడపిల్లలు, యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటివి చాలా ముఖ్యమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు.

జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T111310.376.wav?_=2

 

జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….

ఆర్కేపి ఎస్సై జి రాజశేఖర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా ర్యాలీ….

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

కుల, మత ,వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు లు పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు హాజరయ్యారు. పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పట్టణ పోలీసులు, విద్యార్థులు, యువతతో పాటు పలు రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐక్యత స్ఫూర్తితో సమాజంలో శాంతి సహకారం నెలకొల్పేలా ప్రజలు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది…

‘అఖండ 2’ మ్యూజిక్‌ కొంత పూర్తయింది

 

నందమూరి బాలకృష్ణ ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

తిరుమల: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ2’ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొంతమేరకు పూర్తయిందని డ్రమ్స్‌ కళాకారుడు శివమణి(Shivamani) తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు తమన్‌(Taman)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల(Tirumala)లో మంచి దర్శనాలు చేయిస్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ధన్యవాదాలన్నారు.

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి…

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

 

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్‌పై (DeepFake) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు (Hyderabad CP Sajjanar) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజల్లో ఎంతో అవగాహన తీసుకువస్తున్నామని.. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు 5 వేలు, 10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని.. దీని వల్ల పెద్దలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ వెల్లడించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెండ్‌పై…

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

హై కమాండ్‌..రేవంత్‌కు ఫ్రీ హాండ్‌!

`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!

`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి

`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికలలో గెలిచి తీరాలి

`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే

`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్‌ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే

`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్‌ కు సూచించిన హై కమాండ్‌

`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు

`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి

`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్‌ రెడ్డి పవర్‌ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్‌ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్‌ రెడ్డికి ఫ్రీ హాండ్‌ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్‌ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్‌ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్‌ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్‌ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్‌ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్‌ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్‌ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్‌ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్‌ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్‌ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్‌ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్‌ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్‌ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్‌ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్‌ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని రేవంత్‌ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్‌ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్‌ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్‌ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్‌ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో కేసిఆర్‌ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్‌ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్‌ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్‌ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్‌ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్‌ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్‌ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

పలు కాలనీలను సందర్శించిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల..

పలు కాలనీలను సందర్శించిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల

 

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని పలు ప్రాంతాలలో నిన్నటి రోజు నుండి మంథా తుఫాన్ ప్రభావం వలన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్,జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పలు కాలనీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.కాలనీవాసుల సమస్యలు తెలుసుకొని అనంతరం ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల-జెమిని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సాంబయ్య,బొచ్చు కిరణ్, ఒంటేరు రాజు,ఒంటేరు అజయ్,ఒంటేరు రాహుల్, సంగి జస్వంత్,చెరుపల్లి సదయ్య,సరోజన,ఈశ్వర తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల లో ఏబీవీపీ వినూత్న నిరసన…

చిట్యాల లో ఏబీవీపీ వినూత్న నిరసన.

చిట్యాల నేటిదాత్రి :

చిట్యాల మండలం కేంద్రంలో ఏబీవిపి ఆధ్వర్యంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు
విద్యార్థులు ఛాయ,కూరగాయలు,జీప్ నడుపుతూ,మెకానిక్ పని చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా
ఏబీవీపీ తెలంగానా ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్ గ మాట్లాడుతూ
విద్యార్థులు స్కాలర్షిప్ లు రాక ఫీజు కట్టలేక యామాన్యాల ఒత్తిడి తో ఆత్మహత్య లు కు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం విద్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వెంటనే పెండింగ్ లో ఉన్న 8300 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆందోళన ఉదృతం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో. నగర కార్యదర్శి అజయ్,కృష్ణ,శశి వర్ధన్,అనూప్,జిశ్వంత్,అజయ్,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ షేక్పేట లోని 35, 36, 37, 38 పోలింగ్ బూత్(హజీజ్ బాగ్, అరవింద్ నగర్ కాలనీ)లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని తదితరులతో కలిసి గల్లీ గల్లీ కలియ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్

ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గానికి చెందిన సోదరుడు నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, సీఎం రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా చేస్తాడని ఎమ్మెల్యే

వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

సివిల్ సప్లైస్ అధికారులు…భారీ ఎత్తున రభీ సీజన్ బకాయిలు ఉన్నాయి..గమనిస్తున్నారా?

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

2024-2025 సంవతరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్ లో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే 2025-2026 సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు 2లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇటీవలే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,రైస్ మిల్లర్ల సమావేశంలో ప్రకటించారు.ఈ నేపథ్యంలో గత రబీ సీజన్లో కేటాయించిన 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో కేవలం 50 శాతం మాత్రమే రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం రూపంలో అప్పజెప్పారు.సగం మేరకు వరి ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉండడం పట్ల మిగిలిన ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉన్నదా? అనే పలు అనుమానాలకు తావిస్తుంది.రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయించన సమయంలో మాత్రమే మిల్లుల పర్యటనలు చేసిన అధికారులు ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు సైతం విభిపిస్తున్నాయి.

2024-2025 సంవతరం రబీ సీజన్ గాను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో 83 రైస్ మిల్లులకు పర్మిషన్లు ఇచ్చింది.అందులో 21 బాయిల్డ్ రైస్ మిల్లులకు 1 లక్షా 12
వేల 310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.అలాగే 62 రా..రైస్ మిల్లులకు 94 వేల 392 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.మొత్తం 83 రైస్ మిల్లులకు వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే అందులో నుండి
బాయిల్డ్ రైస్ మిల్లర్లు 76 వేల 371 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 33 వేల 928 మెట్రిక్ టన్నుల బియ్యం 45 శాతం రూపంలో మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారని సివిల్ సప్లైస్ అధికారులు తెలుపుతున్నారు.అలాగే

62 రా రైస్ మిల్లుల నుండి 63 వేల 242 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 35 వేల 181మెట్రిక్ టన్నుల బియ్యం 55 శాతం రూపంలో మాత్రమే ఇచ్చారని అధికారులు తెలుపుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 83 రైస్ మిల్లుల నుండి 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు బాకీ ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

ఇప్పటి వరకు వరంగల్ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల గాను 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి కావడం ఒక బాగమైతే ఖరీఫ్ సీజన్ వరిధాన్యం
సమయం వచ్చింది గనుక అసలు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం సంబంధించిన వరిధాన్యం ఆయా రైస్ మిల్లులల్లో ఉన్నదా అనే అనుమానాలకు తావిస్తున్నది.

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్,రబీ సీజన్లలో సివిల్ సప్లైస్ ద్వారా కేటాయించింది.ఆయా సందర్భాలలో కొన్ని రైస్ మిల్లుల నుండి ధాన్యం పక్కదోవ పట్టాయని ఆరోపణలు గట్టిగానే వినబడ్డాయి.ఐతే ప్రస్తుతం 2024-2025 సంవత్సరానికి గాను కేటాయించిన ధాన్యం నుండి ప్రభుత్వానికి ఇచ్చిన 50 శాతం పోను మిగతా వరిధాన్యం ఆయా రైస్ మిల్లులలో భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

2025-2026 సంవత్సరానికి గాను వరంగల్ జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో సమీక్షించి ప్రకటించారు.ఐతే ఇప్పటికే 50 శాతం బకాయి ఉన్న రైస్ మిల్లర్లు కొత్తగా కేటాయిస్తున్న ధ్యానం పరిస్థితి ఏమిటని సంబంధిత సివిల్ సప్లైస్ అధికారులకు పలు ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

విధుల్లో ఉన్నట్టా..ఉన్నా లేనట్టే నా…

విధుల్లో ఉన్నట్టా..ఉన్నా లేనట్టే నా

ఓ పంచాయతీ కార్యదర్శి వైఖరి

పరకాల నేటిధాత్రి

నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి బదిలీపైన వచ్చి నెలలు గడుస్తున్నా కనీసం గ్రామంలో కనపడిన పాపన పోలేదని గ్రామంలో ప్రజల మధ్య చర్చ నడుస్తుంది.మరికొందరైతే అసలు కార్యదర్శి ఎవరో కూడా తెలియదు అని మాట్లాడుకోవడం గమనార్షం.వారు తమ విధులకు సమయపాలన లేకుండా వస్తుంటారని కొందరు,వచ్చిన కూడా గ్రామంలోని కాలనీలను ఎన్నడూ సందర్శించలేదని ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదని మరికొందరు,ఆ గ్రామ కార్యదర్శి పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకీ ఆ కార్యదర్శి ఎవరు ఆ గ్రామమేదో మరో సంచికలో మీ నేటిధాత్రి లో…..

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి….

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న మార్కెట్కు వచ్చే ప్రజలు…

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న మార్కెట్కు వచ్చే ప్రజలు

పట్టించుకోని సానిటేషన్ ఇన్స్పెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పరిధిలోని కూరగాయల మార్కెట్ పక్కన పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు
కూరగాయల మార్కెట్ పరిసరాల్లో మురికి కాలువలో చెత్త తొలగించకపోవడం, డ్రెయినేజీల నిర్వహణ లోపించడం వంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సానిటేషన్ ఇన్స్పెక్టర్ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత పరిస్థితి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్, ప్రాంతాల్లో రోజువారీ పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు డంపింగ్, చెత్త సేకరణ మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో సరిగా జరగకపోవడం కారణంగా జనం అసౌకర్యానికి గురవుతున్నారు ప్రజల ఇబ్బందులు సకాలంలో చెత్త సేకరించకపోవడంతో దుర్గంధం వ్యాపించి దుర్వాసన పరిసర ప్రాంతంలో ఏర్పడుతోంది
దోమలు, వృథా నీరు వల్ల అనారోగ్యం సంబంధిత ప్రభావాలు పెరిగే ప్రమాదం ఉంది పరిష్కారానికి శానిటేషన్ ఇన్స్పెక్టర్ పారిశుధ్య సిబ్బంది తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే బాధ్యత మున్సిపల్ అధికారులదే సాంకేతికంగా, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చెత్త సమస్య సుదీర్ఘంగా కొనసాగుతోంది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించాలి అంటున్న భూపాలపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలు పేర్కొన్నారు

అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ. ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అకాల వర్షానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాతలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 20 రోజుల నుంచి కోతలు కోసి వడ్లను ఆరబోస్తే. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులు ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయం అంటూ. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఇప్పటివరకు కూడా. ధాన్యం కొనగోలుచేయకపోవడం .వల్ల నిన్న కురిసిన అకాల వర్షానికి వందలాది క్వింటాళ్ల ధాన్యం . నీళ్ల పాలు అయిందంటూ. అలాగే చాలా దాన్యం నాని మొలికెత్తే పరిస్థితి ఏర్పడిందని. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని. బి.ఆర్. ఎస్. పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి.ఆర్.ఎస్. తంగళ్ళపల్లి మండల పార్టీ అధ్యక్షులు. గజ బింకర్ రాజన్న. మాజీ ఎంపిటిసి కర్నే బాలయ్య. మాజీ సర్పంచ్ గుడిసెల ఎల్లం. కందుకూరి రామా గౌడ్. లక్ష్మారెడ్డి. తిరుపతి. బాబు తదితరులు పాల్గొన్నారు.

*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*మొంథా తుఫాన్ను సీఎం ఎదుర్కొన్న తీరు అద్భుతం..

*ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..

*చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు.

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి)అక్టోబర్

 

ఆంధ్ర ప్రదేశ్ ను వణికించిన మొంథా తుఫాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో ఎదుర్కొన్న తీరు మహా అద్భుతమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
మొంథా తుఫాన్ బలహీన పడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పిందని ఆయన అన్నారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందస్తు చర్యలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారుమా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షత వల్లే మొంథా తుఫాన్ ప్రమాదం నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోగలిగామన్నారు. ఏపీ ప్రజల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్ధికి ఇదో తార్కాణమన్నారు.

మొంథా తుఫాన్ బలహీన పడిన తర్వాత సీయం ఏరియల్ సర్వే నిర్వహించడం.

తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను స్వయంగా పరామర్శించడంతోపాటు బాధితులకు ముఖ్యమంత్రి సహాయం అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం స్ఫూర్తిదాయకమన్నారు.
తుఫాను వల్ల పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ చెప్పారాయన. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి, మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల బియ్యంతో పాటు,పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారనీ..ఆపదలో ఉన్న ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మించిన సియంను తాను చూడలేదన్నారు.
అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
దాదాపు 87 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనాలను అధికారుల ద్వారా తక్షణం సమాచారాన్ని సేకరించడం సీఎం పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు.
తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం కర్తవ్య నిర్వహణలో ఆయనకున్న చిత్తశుద్ధిని, సమయస్ఫూర్తిని తెలియజేసిందన్నారు.
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో అప్రమత్తతో వ్యవహరించి, ప్రజలకు బాసటగా నిలిచిన
ఎమ్మెల్యేలు, అధికారులను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఈ సందర్భంగా అభినందించారు.

సర్దార్ పటేల్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఓదెలలో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం…

సర్దార్ పటేల్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఓదెలలో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం…
ఎస్సై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ – 2025’ ను పురస్కరించుకొని పోత్కపల్లి పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా 2 కిలోమీటర్ల రన్ ఉదయం 6:00 గంటలకు ఓదెల జగదాంబ సెంటర్ నుండి ఒర్రెగడ్డ వరకు నిర్వహించబడుతుంది.
దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలందరూ, యువత, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, అన్ని సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై రమేష్ పిలుపునిచ్చారు.
దేశ నిర్మాణంలో ఏకత అత్యవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేత స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రన్ ఫర్ యూనిటీ లో భాగస్వామ్యం అవ్వాలి అని ఆయన పేర్కొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని అక్షయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజి మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాస్ మనువారాలి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ సీనియర్ నాయకులు కలీం,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,మొగుడంపల్లి జనరల్ సెక్రటరీ గోపాల్ దయా వాజీద్ అస్లామ్ రయిస్ తదితరులు.

error: Content is protected !!
Exit mobile version