పోలీసుల ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం.
మంగపేట నేటిధాత్రి
భారత్ తొలి ప్రధాని హోం శాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా శుక్రవారం మంగపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2 కె రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగపేట ఎస్ ఐ టి వి ఆర్ సూరి మాట్లాడుతూ.
భారత స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత కూడా సుమారు 565 రాజ్యాలు హైదరాబాద్ సంస్థనంతో కలిపి భారత్ లో విలీనం కాలేదు. దేశానికి మొదటి ఉప ప్రధాని, హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వున్నారు. వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఆటక్ నుండి కటక్ వరకు వున్న చిన్న చిన్న రాజ్యలను భారతదేశం దేశంలో కలపడానికి విశేషమైన కృషి చేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్యం రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే భారత యూనియన్ లో చిన్న చిన్న రాజ్యలన్నీ కలపగాలిగారు. భారత్ ను ఒక సర్వబౌమ దేశంగా ఏకికరించే మహాత్తర కార్యానికి పునుకునుని సఫలికృతమయ్యారు. దేశాన్ని ఒకటిగా చేసారు. అందుకే పటేల్ 150 వ జయంతిని దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటుంది అని అన్నారు.
రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం లో పోలీసులు, యువజన సంఘాల
