చిట్యాల లో ఏబీవీపీ వినూత్న నిరసన.
చిట్యాల నేటిదాత్రి :
చిట్యాల మండలం కేంద్రంలో ఏబీవిపి ఆధ్వర్యంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు
విద్యార్థులు ఛాయ,కూరగాయలు,జీప్ నడుపుతూ,మెకానిక్ పని చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా
ఏబీవీపీ తెలంగానా ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్ గ మాట్లాడుతూ
విద్యార్థులు స్కాలర్షిప్ లు రాక ఫీజు కట్టలేక యామాన్యాల ఒత్తిడి తో ఆత్మహత్య లు కు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం విద్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వెంటనే పెండింగ్ లో ఉన్న 8300 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆందోళన ఉదృతం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో. నగర కార్యదర్శి అజయ్,కృష్ణ,శశి వర్ధన్,అనూప్,జిశ్వంత్,అజయ్,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
