దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ…

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ

#మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు.

#తడుక అశోక్ గౌడ్ సీనియర్ నాయకుడు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని,అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిందన్నారు.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసంల భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు , మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,బత్తిని కుమారస్వామి, మండల కార్యదర్శి ఓదెల అశోక్ ,కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి…

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

#పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలం అయిందని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వినయ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు కావస్తున్న ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని. పంట పెట్టుబడుల కోసం అప్పులపై ఆధార పడవలసిన పరిస్థితి రైతుకు నెలకొందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, నాయకులు సింగిరెడ్డి యాదగిరి, ఓదెల అశోక్, మురికి మనోహర్, వల్లే పర్వతాలు, బోట్ల ప్రతాప్, కొండ్లె రమేష్, క్రాంతి కుమార్, నరేష్, అనిల్, మధు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుడు బీజేపీలో చేరిక

బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి….

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version