పలు కాలనీలను సందర్శించిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని పలు ప్రాంతాలలో నిన్నటి రోజు నుండి మంథా తుఫాన్ ప్రభావం వలన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్,జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని పలు కాలనీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.కాలనీవాసుల సమస్యలు తెలుసుకొని అనంతరం ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల-జెమిని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సాంబయ్య,బొచ్చు కిరణ్, ఒంటేరు రాజు,ఒంటేరు అజయ్,ఒంటేరు రాహుల్, సంగి జస్వంత్,చెరుపల్లి సదయ్య,సరోజన,ఈశ్వర తదితరులు పాల్గొన్నారు.
