రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శిగా రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మరిపెడ నేటిధాత్రి:

ఒంటె కొమ్ము లక్ష్మారెడ్డి గార్డెన్ లో మరిపెడ మండలం ఐదవ మహాసభ జరగగా మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణ గౌడ్ ఉన్నంత విద్యావంతుడైన మొదటి నుండి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి బాలకృష్ణ నూ గుర్తించి సిపిఐ పార్టీ మరిపెడ మండలం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బాలకృష్ణని తిరిగి 5వ మండల మహాసభలో రెండవసారి సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది
భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిపెడ మండలంలో పార్టీ సూచించిన విధంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధికి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ

కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

గోపి కుటుంబాన్ని పరామర్శించిన.!

గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ

ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ చనిపోవడం చాలా బాధాకరమని గోపి కుటుంబానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version