వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

వరంగల్ జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

సివిల్ సప్లైస్ అధికారులు…భారీ ఎత్తున రభీ సీజన్ బకాయిలు ఉన్నాయి..గమనిస్తున్నారా?

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

2024-2025 సంవతరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్ లో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే 2025-2026 సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు 2లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇటీవలే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,రైస్ మిల్లర్ల సమావేశంలో ప్రకటించారు.ఈ నేపథ్యంలో గత రబీ సీజన్లో కేటాయించిన 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో కేవలం 50 శాతం మాత్రమే రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం రూపంలో అప్పజెప్పారు.సగం మేరకు వరి ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉండడం పట్ల మిగిలిన ధాన్యం రైస్ మిల్లర్ల వద్దనే ఉన్నదా? అనే పలు అనుమానాలకు తావిస్తుంది.రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయించన సమయంలో మాత్రమే మిల్లుల పర్యటనలు చేసిన అధికారులు ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు సైతం విభిపిస్తున్నాయి.

2024-2025 సంవతరం రబీ సీజన్ గాను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో 83 రైస్ మిల్లులకు పర్మిషన్లు ఇచ్చింది.అందులో 21 బాయిల్డ్ రైస్ మిల్లులకు 1 లక్షా 12
వేల 310 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.అలాగే 62 రా..రైస్ మిల్లులకు 94 వేల 392 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది.మొత్తం 83 రైస్ మిల్లులకు వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లకు 2 లక్షల 6 వేల 702 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేటాయించింది.ఐతే అందులో నుండి
బాయిల్డ్ రైస్ మిల్లర్లు 76 వేల 371 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 33 వేల 928 మెట్రిక్ టన్నుల బియ్యం 45 శాతం రూపంలో మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారని సివిల్ సప్లైస్ అధికారులు తెలుపుతున్నారు.అలాగే

62 రా రైస్ మిల్లుల నుండి 63 వేల 242 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 35 వేల 181మెట్రిక్ టన్నుల బియ్యం 55 శాతం రూపంలో మాత్రమే ఇచ్చారని అధికారులు తెలుపుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 83 రైస్ మిల్లుల నుండి 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు బాకీ ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.

ప్రభుత్వానికి చెల్లించింది 50 శాతమే..మిగతా 50 శాతం ధాన్యం మిల్లుల్లో ఉన్నాయా?

ఇప్పటి వరకు వరంగల్ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం 1 లక్షా 39 వేల 613 మెట్రిక్ టన్నుల గాను 69 వేల 109 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి ముట్టజెప్పారు.కాగా మరో 70 వేల 431 మెట్రిక్ టన్నుల బియ్యం సుమారు 50 శాతం పైబడి కావడం ఒక బాగమైతే ఖరీఫ్ సీజన్ వరిధాన్యం
సమయం వచ్చింది గనుక అసలు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం సంబంధించిన వరిధాన్యం ఆయా రైస్ మిల్లులల్లో ఉన్నదా అనే అనుమానాలకు తావిస్తున్నది.

గడువు ముగిస్తున్నది….మిల్లుల్లో మిగిలిన ధాన్యం భద్రంగా ఉన్నదా?

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్,రబీ సీజన్లలో సివిల్ సప్లైస్ ద్వారా కేటాయించింది.ఆయా సందర్భాలలో కొన్ని రైస్ మిల్లుల నుండి ధాన్యం పక్కదోవ పట్టాయని ఆరోపణలు గట్టిగానే వినబడ్డాయి.ఐతే ప్రస్తుతం 2024-2025 సంవత్సరానికి గాను కేటాయించిన ధాన్యం నుండి ప్రభుత్వానికి ఇచ్చిన 50 శాతం పోను మిగతా వరిధాన్యం ఆయా రైస్ మిల్లులలో భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్ సీజన్ ధాన్యం మిల్లులకు కేటాయించబోతున్న ప్రభుత్వం?

2025-2026 సంవత్సరానికి గాను వరంగల్ జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లతో సమీక్షించి ప్రకటించారు.ఐతే ఇప్పటికే 50 శాతం బకాయి ఉన్న రైస్ మిల్లర్లు కొత్తగా కేటాయిస్తున్న ధ్యానం పరిస్థితి ఏమిటని సంబంధిత సివిల్ సప్లైస్ అధికారులకు పలు ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

రైతు నేస్తం’ కార్యక్రమం…

రైతు నేస్తం’ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.

ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.

పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:

జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version