అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ. ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అకాల వర్షానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాతలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 20 రోజుల నుంచి కోతలు కోసి వడ్లను ఆరబోస్తే. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులు ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయం అంటూ. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఇప్పటివరకు కూడా. ధాన్యం కొనగోలుచేయకపోవడం .వల్ల నిన్న కురిసిన అకాల వర్షానికి వందలాది క్వింటాళ్ల ధాన్యం . నీళ్ల పాలు అయిందంటూ. అలాగే చాలా దాన్యం నాని మొలికెత్తే పరిస్థితి ఏర్పడిందని. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని. బి.ఆర్. ఎస్. పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి.ఆర్.ఎస్. తంగళ్ళపల్లి మండల పార్టీ అధ్యక్షులు. గజ బింకర్ రాజన్న. మాజీ ఎంపిటిసి కర్నే బాలయ్య. మాజీ సర్పంచ్ గుడిసెల ఎల్లం. కందుకూరి రామా గౌడ్. లక్ష్మారెడ్డి. తిరుపతి. బాబు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షానికి తడిసిన వడ్లు..

అకాల వర్షానికి తడిసిన వడ్లు

ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాక పోవడంతో రోడ్లపైనే ఆరబోత-బోయిని తిరుపతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్ల పైన ఆరబోసిన వడ్లు రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇంతవరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకెపి, డిసిఎంఎస్, పిఎస్సిఎస్, ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు మొదలు కాకపోవడంతో రైతులు వడ్లను రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఇదే అదునుగా భావించి దళారులు ప్రభుత్వ రేటు కన్నా క్వింటాలకు మూడువందల నుండి నాలుగు వందల తక్కువ రేటుకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షాల నుండి కాపాడుకోలేక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగం పైన దృష్టి సారించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి మిల్లర్ల మాయాజాలం నుండి రైతాంగాన్ని కాపాడవలసిందిగా సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి పక్షాన ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండలం కార్యదర్శి బోయిని తిరుపతి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version