తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం.!

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం టీటీడీ బోర్డుమెంబర్ కు కృతజ్ఞతలు

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణానికి చెందిన జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ న్యాయవాది దార వెంకటేష్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని ఎం వెంకటరమణ లగిశెట్టి శ్రీకాంత్ బసవరాజ్ రాకేష్ తిరుమలలో శ్రీవారిని గురువారం ఉదయం దర్శనము చేసుకున్నారు వీ ఐ పీ బ్రేక్ దర్శనం కల్పించినందుకు టీ టీ డీ బోర్డు మెంబర్ తెలుగుదేశం నన్నారి నర్సిరెడ్డికి టీ టీ డీ అధికారులకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత మాదే..

*తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే..

కోలా లక్ష్మీపతి

*పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా..

*తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు…

*రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం…

తిరుపతి(నేటి ధాత్రి) 

తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని. ఇక్కడ పుట్టి, పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతతో మొదటగా మేము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యం గా ఏర్పడ్డామనీ తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు.‌ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి కోసం దశాబ్దాల తరబడి కొండపై నివసిస్తున్న స్థానికులైన మేము మా స్థలాలు ఇతరత్రా వాటిని టిటిడి అభివృద్ధి కోసం అప్పగించి, ప్రత్యామ్నాయంగా జీవనోపాధి క్రింద షాపులు, హాకర్ లైసెన్స్ లు బాలాజినగర్ లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుండి కూడా టిటిడి ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా తిరుమల స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొండపై అన్నింటిలోనూ అవకాశాన్ని స్థానికులకే ఉండేలా చేశారు. అటు తర్వాత గత 6 ఏళ్లుగా ఈవిధానానికి స్వస్తి పలికి స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా స్థానికేతరులందరికీ రాజకీయ ఒత్తిడిలతో కొండపై పలు విధాలుగా స్థానం కల్పించడంతో స్థానికులైన మేము జీవనోపాధి కోల్పోయి మా ఉనికి ప్రమాదంలో పడింది. పైగా ప్రస్తుత టిటిడి యాజమాన్యం తిరుమల కొండపై స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా టిటిడి రెవెన్యూ, పంచాయితీ విభాగం పూర్తిగా అవినీతిమయమై ఇష్టారాజ్యంగా వందలాది తట్టలు, హాకర్ లైసెన్స్ లు విచ్చలవిడిగా కొండపై వెలిశాయి.
ప్రతినిత్యం ఏదోఒకచోట లైసెన్స్ లు లేకుండానే పంచాయితీ, రెవెన్యూ, విజిలెన్స్, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు అనధికారికంగా తట్టలు పెట్టిస్తూనే వున్నారు. ఈవిధంగా వ్యవహరించుకుంటూ పోతే తిరుమలలో స్థానికేతరులు ప్రాబల్యం పెరిగిపోయి అసాంఘిక శక్తుల ప్రమేయంతో ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు పూర్తిగా తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి మావంతుగా స్థానికుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది.ఇకపై అనధికారికంగా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా తిరుమల పరిరక్షణ సైన్యంగా మా ముఖ్య సైనికులు అడ్డుకుంటామని. చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటామని కోలా లక్ష్మీపతి వివరించారు.
మరో ముఖ్య సైనికుడు వి కృష్ణ, కే హరిప్రసాద్, వాసుదేవన్ లు మాట్లాడుతూ పాలకమండలి ఉన్నతాధికారులు తిరుమలలో టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగం అవినీతి కారణంగా సంస్థ ఉనికి ప్రమాదకరంలో పడిందని అన్నారు.
దయచేసి ప్రక్షాళన మీరు మొదలు పెడితే మావంతు సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తిరుమలలో ఆక్రమణలు అనధికారిక తట్టలపై ఫిర్యాదు చేసినప్పుడల్లా దుకాణాలపై కక్ష తీర్చుకునేలా దాడులు నిర్వహించడం ఇబ్బందులకు గురి చేయడం పంచాయతీ రెవిన్యూ విభాగానికి పరిపాటిగా మారిందన్నారు. ఇకపై కొండపై రాజకీయ ఒత్తిడితో పంచాయతీ రెవిన్యూ విజిలెన్స్ ఆరోగ్య శాఖ ఎవరైనా సరే అనధికారికంగా తట్టలు పెట్టాలని చూస్తే తిరుమల పరిరక్షణ సైన్యం మూకుమ్మడిగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. తిరుమల పరిరక్షణ కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించేందుకు 250 మంది సభ్యులతో ఏర్పడిన తిరుమల పరిరక్షణ సైన్యం 15 మంది ముఖ్య సైనికులతో కార్యాచరణ కు దిగుతుందని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న
ముఖ్య సైనికులు ఎమ్.వేలు,కె. ప్రహ్లాద, పి.భాస్కర్, జి.వరప్రసాద్, కె.వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు పి.త్రిలోక్ కుమార్, ఎం.మణి, ముని నాయుడు,చెంజి సురేష్, ఎం.ఆర్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని చల్మెడ తిరుమల స్వామి ఎండోమెంటు భూములలో నిర్మించాలి

ఆలయ భూములు దాదాపు 300 ఎకరాల వరకు ఉంటుంది

ఐదు ఎకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం- చైర్మన్ రామ్ రెడ్డి

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరి అయినందున రాష్ట్ర ప్రభుత్వము మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులోని తిరుమల స్వామి ఆలయ సన్నిధిలో నీ ఎండోమెంట్ భూములలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని తిరుమల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అక్క పల్లి రాంరెడ్డి కోరారు .ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజల కోరిక మేరకు. తిరుమల స్వామి ఆలయ ఎండోమెంట్ భూములు దాదాపు 282 ఎకరాల స్థలం ఉన్నందున ఇట్టి స్థలంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు . విద్యాపరంగా మెదక్ జిల్లా వెనుకబడిందని అందులో నిజాంపేట మండలం ఇంకా చాలా వెనుకబడి ఉన్నందున ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినట్లయితే నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని అభిప్రాయ పడుతున్నామన్నారు. బాసరలో త్రిబుల్ ఐటీ నిర్మించడం వలన అక్కడ విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నారని, అదే మాదిరిగా తిరుమల స్వామి ఆలయ సన్నిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినట్లయితే ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుందన్నారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించి చల్మెడ తిరుమల స్వామి ఆలయం సన్నిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, పాలకమండలి వర్గం కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తప్పకుండా ఇక్కడ కట్టించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version