పాదయాత్రలో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల…

పాదయాత్రలో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల

పరకాల,నేటిధాత్రి

జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ కాంగ్రేస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎర్రగడ్డ డివిజన్ లోని లక్ష్మీ కాంప్లెక్స్ నుండి ఆనంద్ నగర్,బంజారా నగర్,ప్రేమ నగర్,ఓల్డ్ సుల్తాన్ నగర్,జామియా మస్జిద్,నూర్ మస్జిద్,న్యూ సుల్తాన్ నగర్,నేతాజీ నగర్ మరియు రాజీవ్ నగర్ పార్క్ మీదుగా నిర్వహించిన పాదయాత్రలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ,జూపల్లి కృష్ణా రావు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యేలు గణేష్,భూపతి రెడ్డి,మధుసూదన్ రెడ్డి,తుడి మేఘ రెడ్డి,రాజేష్ రెడ్డి,ఎమ్మెల్సీ దండె విటల్,టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం మరియు ఛైర్మన్ గుత్తా అమిత రెడ్డి,తాహిర్ బిన్ హాందన్ తదితరులు పాల్గొన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి….

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి

#పత్తిపల్లి గ్రామంలో వీధి కుక్కలకు వింతరోగాలు.
#పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ లక్షణాలు
#ఎస్సీ (మాల) కాలనీలో రేబిస్ వ్యాధి లక్షణాలు గల కుక్కలు.
#పట్టింపు లేని అధికారులు.

గ్రామ యువకుడు మధుకర్ బండారి

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో వింత రోగలతో కుక్కలు సంచరిస్తున్నాయి.కుక్కల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని వైనం.. పగలు,రాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై కోళ్లపై ,పశువుల పైన దాడులు చేస్తుండడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీ నివాసులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తిపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) కాలనీలో పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ వ్యాధి లక్షణాలు ఉండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు, పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో సంచరించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో వింత రోగానికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు, పిల్లలు వృద్దులు, పాదాచారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు. మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచాయితీ అధికారులు, కార్యదర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు. కావున వీధి కుక్కలకు వింత రోగాలు నియంత్రించేందుకు తక్షణమే తగుచర్యలు చేపట్టాలనీ గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

పెంపుడు కుక్కలకు వింత రోగాలు చర్యలు తీసుకోండి.. గ్రామ యువకుడు మధుకర్ బండారి

గ్రామంలో విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుతు ఈగలు వాలుతు వాటినీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచాయితీ అధికారులకు పలుమార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని గ్రామ యువకుడు మధుకర్ బండారి డిమాండ్ చేశారు.

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు…

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు

విస్తరణ పనులు పూర్తి చేయాలి

జనసమితి జిల్లా అధ్యక్షులు

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి చేయలేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి లో అంబేద్కర్ చౌక్ నుండి పాత బజారు వరకు రోడ్ల విస్తరణ జరిగిందని అన్నారు . ప్రస్తుతం కర్నూల్ రోడ్ వివేకానంద చౌరస్తా నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు కొత్త బస్టాండ్ వరకు రోడ్డు చిన్నగా ఉన్నదని బాలాజీ క్లాస్ స్టోర్ బస్ డిపో టర్నింగ్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటం టూ వీలర్స్ వాహనాలు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఖాదర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మున్సిపల్ కమిషనర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆస్తులు కోల్పోయే వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పానగల్ రోడ్డు నిరుపేదలు ఉన్నారని వారికి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు

మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే…

మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఒకే కుటుంబానికి చెందిన బార్య భర్తలు మృతి చెందిన సంఘటన పట్టణంలో కలిచివేసింది. రామకృష్ణాపూర్ పట్టణం సర్దార్ వల్లభాయ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎలగందుల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం తొమ్మిదవ రోజు తిథి కర్మ ఉండగా అతని భార్య ఎలగందుల పద్మ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడంతో కాలనీవాసులు ద్రిగ్బాంధీ చెందారు. లింగయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో మృతురాలు పద్మా అక్క కుమారులు బాధ్యతను చేపట్టి దహన సంస్కారాలు చేశారు. పట్టణ ఆటో యూనియన్, ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న లింగయ్య, ఎస్ఆర్కే పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరణమని పాఠశాల యాజమాన్యం, ఆటో యూనియన్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి…

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

“రన్ ఫర్ యూనిటీ”లో భాగమవ్వండి…

“రన్ ఫర్ యూనిటీ”లో భాగమవ్వండి…

ఆర్కే పి ఎస్ఐ జి రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రన్ ఫర్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31న నిర్వహించే ఒక మారథాన్ అని, ఇది దేశ ఐక్యతను చాటడానికి ఉద్దేశించబడింది అని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా 2 కే రన్ నిర్వహిస్తుందని పట్టణంలోని విద్యార్థులు, యువకులు, నాయకులు, ప్రతీ ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని 2కే రన్ ను విజయవంతం చేయాలని ఎస్సై తెలిపారు. ఉదయం సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి రామాలయం చౌరస్తాలోని హనుమాన్ విగ్రహం వరకు 2 కే రన్ ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ ఏక్తా దివాస్ వేడుకలను రామకృష్ణాపూర్ లో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రజలందరూ 2కే రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు.

ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-30T125705.930-1.wav?_=1

 

ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అక్టోబర్ 30 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గురువారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,ప్రజలకు పండ్లు, బ్రెడ్ పాకెట్ లు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు జాఫర్,మోతిరాం నాయక్,జహంగీర్,రాములు నేత,యూనూస్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సునీల్,సుభాష్ యాదవ్,రాఘవేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లా.ప్రతాప్ రెడ్డి,రాజు నాయక్,మల్లికార్జున్,జహీర్ అరబ్బీ,అక్రమ్,అయ్యూబ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి…

పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

అకాల వర్షాలకు చేతికి వచ్చిన పత్తి పంట తీవ్రంగా దెబ్బతిని రైతులకు విపరీత మైన నష్టం వాటిల్లిందని ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామ బి. ఆర్.. ఎస్. సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి అన్నారు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ముప్పై వేల నష్ట పరిహారం అందించాలని అలాగే యాసంగి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఋణ మాఫీ కాక మిగిలిన రైతులకు వెంటనే ఋణ మాఫీ చేయాలని కోరారు లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని హెచ్చరించారు,

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై…

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం…

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు పట్టణంలో విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్,పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్,చంటి పాల్గొన్నారు.

 ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు…

 ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

 

ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి డెయిరీఫామ్‌ రోడ్‌ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ కారిడర్‌ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ కమిషనర్‌ డి. జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.

బాలనగర్‌ వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్‌ బండ్‌ వైపు వెళ్లేవారు తాడ్‌బంద్‌ మస్తాన్‌ కేఫ్‌, డైమండ్‌ పాయింట్‌ కుడివైపు మలుపు తిరిగి మడ్‌ఫోర్ట్‌, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వారు సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, మడ్‌ఫోర్ట్‌, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ రాణిగంజ్‌, పంజాగుట్ట, రసూల్‌పురా,

 

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

 

బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర ఇవాళ(గురువారం) కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్‌లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన….

ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

 

కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.

అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాను(Cyclone Montha) కారణంగా ఎగువన కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల వల్ల కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శాఖాపరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిహహక ప్రాంతంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది.

కాగా… మొంథా తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తుపాను ఎఫెక్ట్‌తో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు….

 తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు

 

సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వట్టిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిస్తున్నాయి. హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవపట్నం వాగు ఉప్పొంగడంతో ఐకేపీ కేంద్రం గోడ కూలి నిల్వ ఉంచిన వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. వాగు ఉప్పొంగడంతో.. సైదాపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజురాబాద్‌లో కూడా చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. జూపాక రోడ్డు తెగి పోయింది. భారీ వర్షం కారణంగా రోడ్డుపై ఆరబెట్టిన వడ్లు కూడా కొట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

 గృహ రుణాలు తీసుకుంటున్నారా? ఇవి పాటిస్తే మీకు లక్షలు ఆదా..

 

ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికి ఎన్నో కలలకు ఉంటాయి. అలాంటి వాటిల్లో సొంత ఇల్లు ఉండాలనే కల ఒకటి. అందుకే కొందరు రేయింబవళ్లు కష్టపడి ఈ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. మరోవైపు ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్(Home Loans) పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్‌డ్), ఫ్లోటింగ్ (Fixed vs Floating Interest Rate)అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఫిక్స్‌డ్ వడ్డీ రేటు:

ఇందులో మనం తీసుకున్న హోం లోన్(Home Loans) కు ఈఎంఐ(EMI Plans) ప్రతి నెలా ఒకే విధంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనం కట్టే ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. ఇది సామాన్యుల బడ్జెట్‌ను సులభతరం చేస్తుంది. దీని వలన నెలవారీ బడ్జెట్ ప్రణాళిక ఈజీ అవుతుంది. ఫిక్స్‌డ్ (Fixed Interest Rate)వడ్డీరేటు ఫ్లోటింగ్ రేటు కంటే 1 నుంచి 1.5 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. ఫిక్స్‌డ్ వడ్డీ రేటు వల్ల ఆ బెనిఫిట్స్ దక్కవు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు

– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్

– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు

– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం

– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు

– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్

సిరిసిల్ల, నేటిధాత్రి:

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు.
పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.

Karimnagar Collectorate

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి..

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన జిన్నారం సీఐ రమణ రెడ్డి

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

 

జిన్నారం సీఐగా ఇటీవల బదిలీపై వచ్చిన రమణారెడ్డి బుధవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిన్నారం సర్కిల్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని సూచించారు.

ముదిగుంట లో ఉపాధి హామీ గ్రామసభ.

ముదిగుంట లో ఉపాధి హామీ గ్రామసభ

జైపూర్, నేటిధాత్రి:

 

ముదిగుంట గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ గ్రామసభ ఎంపీవో శ్రీపతి బాబురావు బుధవారం నిర్వహించారు. అలాగే గ్రామపంచాయతీ లో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే ఉపాధి హామీ పనుల వివరాలు తెలిపారు.ఈజీఎస్ లో చేపట్టవలసిన పనులు పశువుల పాక,కోళ్ల షెడ్డు, అజోల్లా,నాడెపు కంపోస్ట్ పిట్, మట్టి రోడ్డు నిర్మాణం,చిన్న ఊట కుంటలు,ఫారం ఫండ్, మామిడి తోటల పెంపకం, ఫారెస్ట్ కందకాలు,కొబ్బరి తోటల పెంపకం చేపట్టాలని సూచించారు.అనంతరం మొబైల్ యాప్ తనిఖీ నిర్వహించి సానిటేషన్ పనులు చేపట్టి,100% ఇంటి పన్నులు త్వరగా పూర్తి చేయాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు..

అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

సామాజిక సామరస్యంలో యువత భాగ్య స్వాములు కావాలి

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ ఇందారం లోని మహి ఫంక్షన్ హల్ లో అమరవీరుల త్యాగాలకు నివాళిగా బుధవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం,ఓపెన్ హౌస్ కార్యక్రమం కు అంబర్ కిషోర్ ఝా,ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్ తో కలిసి ఓపెన్ హౌస్,రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులకు ప్రజా రక్షణ,భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై,షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్,డాగ్ స్క్వాడ్,ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,షీటీమ్,భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్,తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.పలు ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ…విధి నిర్వర్తనలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని,వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ చేసేటువంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు, యువత సహకరించినప్పుడు పోలీస్ వారి ఉత్సాహం, విశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మారుమూల ప్రాంతంలను పోలీస్ వారు సందర్శించడం,ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం ఒక పోలీస్ శాఖ తోనే సాధ్యం అవుతుంది తెలిపారు. ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సామరస్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,సంఘవిద్రోక శక్తులు దేశంపై గాని రాష్ట్రం పై దాడీలకు పాల్పడినప్పుడు ఐక్యమత్యంగా ఉండి రక్షించుకోవచ్చు అన్నారు. రాష్ట్ర,దేశ రక్షణ కోసం పోలీస్, ఇతర సెంట్రల్ అర్ముడ్ ఫోర్స్ లలో ఉద్యోగాలను సాధించి రాష్ట్ర దేశ రక్షణ కొరకు దోహదపడటం, సహకరించడం చేయాలనీ కోరారు.రక్తదానం ప్రాణధానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా ప్రజల అత్యవసర పరిస్థితి ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి,తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త దాన శిబిరం లు ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇలాంటి సమయంలో మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా,విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు,పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఎంతగానో ఉత్సాహపరిచిందని అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,చెన్నూర్ ఇన్స్పెక్టర్ దేవేందర్,చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేష్, జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, భీమారం ఎస్సై లక్ష్మి ప్రసన్న,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version