కుర్చివేడు టీడీపీ నేత శోభన్ బాబును పరామర్శించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

*కుర్చివేడు టీడీపీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబును పరామర్శించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్..

*త్వరగా కోలుకుని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించిన చిత్తూరు శాసనసభ్యులు…

*ఎమ్మెల్యే గురజాలకు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ నీలకంఠం నాయుడు ,పార్టీ కార్యకర్త శోభన్ బాబు…

చిత్తూరు (నేటి ధాత్రి:

 

చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు మండలం, కుర్చివేడు పంచాయతీ, కుర్చీ వేడు గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబు అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కుర్చివేడు పంచాయతీ పర్యటనలో భాగంగా మాజీ వైస్ ఎంపిపి, మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నీలకంఠం నాయుడు ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా నీలకంఠం నాయుడు కుమారుడు, టిడిపి కార్యకర్త శోభన్ బాబును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు.అలాగే వృద్దాప్యంలో ఉన్న పార్టీ కురువృద్ధుడు నీలకంఠం నాయుడు, ఆయన కోడలు, శోభన్ బాబు సతీమణి బిందు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు తెలుగు దేశం పార్టీకి ఎనలేని సేవలందించారనీ గుర్తు చేసిన ఎమ్మెల్యే,, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం ఇదే వరవడితో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఈ క్రమంలో నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు, సతీమణి బిందు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కు ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తెలిపారు.
చిత్తూరు నియోజకవర్గ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గురిజాల జగన్ మోహన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మణా దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నీలకంఠం నాయుడు, శోభన్ బాబు, ఆయన సతీమణి బిందు తెలియజేశారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి….

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి

#పత్తిపల్లి గ్రామంలో వీధి కుక్కలకు వింతరోగాలు.
#పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ లక్షణాలు
#ఎస్సీ (మాల) కాలనీలో రేబిస్ వ్యాధి లక్షణాలు గల కుక్కలు.
#పట్టింపు లేని అధికారులు.

గ్రామ యువకుడు మధుకర్ బండారి

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో వింత రోగలతో కుక్కలు సంచరిస్తున్నాయి.కుక్కల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని వైనం.. పగలు,రాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై కోళ్లపై ,పశువుల పైన దాడులు చేస్తుండడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని కాలనీ నివాసులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తిపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) కాలనీలో పెంపుడు కుక్కలకు సైతం రేబిస్ వ్యాధి లక్షణాలు ఉండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు, పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో సంచరించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో వింత రోగానికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు, పిల్లలు వృద్దులు, పాదాచారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు. మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచాయితీ అధికారులు, కార్యదర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు. కావున వీధి కుక్కలకు వింత రోగాలు నియంత్రించేందుకు తక్షణమే తగుచర్యలు చేపట్టాలనీ గ్రామ ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

పెంపుడు కుక్కలకు వింత రోగాలు చర్యలు తీసుకోండి.. గ్రామ యువకుడు మధుకర్ బండారి

గ్రామంలో విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుతు ఈగలు వాలుతు వాటినీ చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచాయితీ అధికారులకు పలుమార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని గ్రామ యువకుడు మధుకర్ బండారి డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version