పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది.

బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).
ఈ రోజు (జనవరి 28న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 మేర పెరిగి రూ. 1,51,400కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,65,300కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,51,550కి చేరుకుంది.మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పది వేల రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.4,00,00కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది.

వెండికీ… ఒక రోజు రానే వచ్చింది…

వెండికీ… ఒక రోజు రానే వచ్చింది…

 

బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.

ప్రతి మనిషికీ ఒక రోజు వస్తుంది అన్నట్లే వెండికీ ఒక రోజు రానే వచ్చింది. ఏళ్ల తరబడి జంటగా ప్రయాణించిన పసిడి, వెండి పరుగులో పుత్తడి ముందుకెళ్లింది. వెండిని వెనకేశానని మురిసిపోయింది. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సిల్వర్‌.. సిక్స్‌ప్యాక్‌ మెటల్‌లా శక్తిమంతమై.. గోల్డును సైతం బోల్డ్‌ చేసింది. పద్నాలుగేళ్లలో ఏకంగా 188 శాతం పెరిగి… సంచలనం సృష్టించింది. ఇప్పుడు వెండి.. శ్వేత బంగారం!! నేలమాలిగల్లో దాగున్న ఆ లోహపు అపురూప చరిత్రను తవ్వి తీస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు. అవే.. ఈ వారం కవర్‌స్టోరీ.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

 

బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర ఇవాళ(గురువారం) కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్‌లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version