పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం….

పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం

నర్సంపేట,నేటిధాత్రి:

పీడీఎస్యు ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రబోస్, ఉషా కిరణ్, సందీప్, శ్రీకాంత్, అనిల్ షఫీనా, పూజ, అభినయ, అఖిల తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం…

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు పట్టణంలో విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్,పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్,చంటి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version