రైతులకు సన్నవడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి…

రైతులకు సన్నవడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి

బోనస్ పడక ఇబ్బందులు పడుతున్నారు రైతులు

జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో రైతులకు చెల్లించవలసిన 6.56 కోట్ల సన్న వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజ పెళ్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో జిల్లాలో రైతులకు సన్న వడ్ల బోనస్ చెల్లించాలని కోరుతూ సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ధర్నా నిర్వహించారని,అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మహాదేవపూర్, కాటారం, పలిమల, మహా ముత్తారం, మల్హర్ మండలాలకు సంబంధించిన రైతులకు తమ బ్యాంకుల్లో రైతులకు సన్నవడ్ల బోనస్ చెల్లించడం లేదని రైతులు నిరసన తెలపడం జరిగిందని, వెంటనే జిల్లా కలెక్టర్ యంత్రాంగం పరిశీలించి వెంటనే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసి సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని ఆయన కోరారు. జిల్లాలో 2700 మంది రైతులు సుమారు మూడు నెలలు తిరిగిన సమస్య పరిష్కారం కాలేదని, ఎక్కడ అయితే బ్యాంకులో అంతరాయం ఉందొ ముందు దాన్ని వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి కోరారు. రైతుల పక్షాన అండగా ఉంటామని, లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా సమితి నాయకులు క్యాథరాజు సతీష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన…

ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ చట్టాలను తీసుకువచ్చి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి ఉపసంహరించుకోవాలని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న బ్లాక్ డే గా పాటించి నల్ల బ్యాడ్జీలు ధరించాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపుకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ భూపాలపల్లి డిపోలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపడం జరిగింది
ఈ కార్యక్రమంలో
బండి శ్రీనివాస్,సంతోష్, రంజిత్,రమేష్,మోతిలాల్,కొలిపాక ప్రసాద్. డి రాజయ్య అశోక్.ఎమ్ఐ కుమార్. నాయక్ కోమల అనిత తదితరులు పాల్గొన్నారు

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ. విచారణ .పేరీట వేధిస్తున్నందుకు.నిరసన వ్యక్తం చేయగా మాపై కేసులు నమోదా. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ఫిబ్రవరి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలోభాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం .కక్ష.పూరిత వైఖరితో .వేధిస్తున్నందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మ దహనం నిరసనలు.చేయడం జరిగిందని. అందులో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో. కేసులు నమోదు చేశారని. తంగళ్ళపల్లి మండలం నుండి 18 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఎటువంటి కేసులకు భయపడేది లేదని బిఆర్ఎస్. పార్టీ నాయకులు వేధిస్తే .ఊరుకునేది .లేదని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ నాయకత్వాన్ని .వేధించడం మానుకొని ప్రజలకు ఇచ్చిన ఆరు .గ్యారెంటీలనుఅమలు చేయాలని. బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అణిచివేత ధోరణి ప్రజా వ్యతిరేకత విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కేటీఆర్ నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఎండ.గడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మద్దతుగా. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లిరామ్మోహన్ సంఘీభావం ప్రకటించారు అరెస్టు కేసులు నమోదైన వారిలో. బిఆర్ఎస్.పార్టీనాయకులు. మాట్లమధు.కర్నేబాలయ్య. పూర్మాని.రాజశేఖర్.రెడ్డి.శ్యాగ దేవేందర్. బండి జగన్. తిరుపతిరెడ్డి. మీసాల కృష్ణ. దొంతినేని.చందర్రావు.గుండి మహేష్.గుగ్గిళ్ళ ఆంజనేయులు. అల్వాల సాయి.సుంచులజీవన్.ఇమ్మ నేనిఅమర్రావు. పోచంపల్లి రంగయ్య. తిరుపతి రెడ్డి. తదితరులు ఉన్నారు

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం…

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు పట్టణంలో విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్,పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్,చంటి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version