ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులు…

ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులను పూర్తి చేశారు.వర్షాకాలం దృశ్య గ్రామంలోని డ్రైనేజీలు పూడికలని తీసి మురికి కాలువలో,నాళాలలో,బావిలలో క్లోరినేషన్ స్ప్రే చేసి,బ్లీచింగ్ పౌడర్ చల్లారు.ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,నీరు నిలువ లేకుండా చూసుకోవాలని,దోమల నివారణ చర్యలను పాటించాలని కార్యదర్శి సురేష్ సూచించారు.అలాగే శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని,పురాతన భవనాలకు,గోడలకు దూరంగా ఉండాలని,విద్యుత్ స్తంభాలను తాకరాదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్,పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామి 11వ గిరి ప్రదక్షణ శ్రావణమాసం సందర్భంగా మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, ముఖ్య నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి,రవీందర్రావు, మేడి తిరుపతి,ఆర్నే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version