ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ…

ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు ఆధ్వర్యంలో షాపుల యజమానులకు,గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు.అదేవిధంగా ఎంపీయుపిఎస్ (ఉర్దూ) పిల్లలకు కూడా అవగాహన కల్పించారు.ఉర్దూ పాఠశాలలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ మరియు కిచెన్ షెడ్లను పరిశీలించారు.ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కార్యక్రమంలో భాగంగా 75% రాయితీతో మొదటి విడతగా 14 మంది అర్హులైన రైతులకు 32 యాంత్రిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై పంపిణీ చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము,ఆవాస్ ప్లస్ సర్వేను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు…

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని వీర హనుమాన్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి మహిళలు గణేశునికి పూలతో అలంకరించి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించి మహిళలు గణపతి దేవుని ఆశీర్వాదం పొందారు.పూజ అనంతరం మహిళలు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు..

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు

మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,ఎస్టి కాలనీ, అంబేద్కర్ కాలనీలో బోర్వెల్ కు సంబంధించిన విద్యుత్ మోటర్లు చెడిపోయి నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను11 బోర్లు బిగించి నీటి కొరతను తీర్చారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న నేటి సమస్యలను తీర్చడంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముందుంటారని అన్నారు.ప్రభుత్వ నిధులతోనే కాకుండా తమ విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక బోర్ బావులు వేపించి ప్రజల కష్టాలు తీర్చారని తెలిపారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేరువ చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.అదేవిధంగా సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసిన మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డికి కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబల్ల రవి,మాజీ వార్డు సభ్యులు అరిగేల శ్రీనివాస్,ఇరిగిరాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులు…

ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులను పూర్తి చేశారు.వర్షాకాలం దృశ్య గ్రామంలోని డ్రైనేజీలు పూడికలని తీసి మురికి కాలువలో,నాళాలలో,బావిలలో క్లోరినేషన్ స్ప్రే చేసి,బ్లీచింగ్ పౌడర్ చల్లారు.ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,నీరు నిలువ లేకుండా చూసుకోవాలని,దోమల నివారణ చర్యలను పాటించాలని కార్యదర్శి సురేష్ సూచించారు.అలాగే శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని,పురాతన భవనాలకు,గోడలకు దూరంగా ఉండాలని,విద్యుత్ స్తంభాలను తాకరాదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్,పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామి 11వ గిరి ప్రదక్షణ శ్రావణమాసం సందర్భంగా మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, ముఖ్య నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి,రవీందర్రావు, మేడి తిరుపతి,ఆర్నే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version