తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన పంట పొలాలు
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలల్లో వరి పంటకు అపార నష్టం వట్టిల్లింది. చేర్యాల మండలంలో.. భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిస్తున్నాయి. హుజురాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశవపట్నం వాగు ఉప్పొంగడంతో ఐకేపీ కేంద్రం గోడ కూలి నిల్వ ఉంచిన వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. వాగు ఉప్పొంగడంతో.. సైదాపూర్కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజురాబాద్లో కూడా చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. జూపాక రోడ్డు తెగి పోయింది. భారీ వర్షం కారణంగా రోడ్డుపై ఆరబెట్టిన వడ్లు కూడా కొట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
