ఝరాసంగం మండలంలో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రాత్రి నుండి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, బ్రిడ్జిలు, చెక్ డ్యామ్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ప్రజలు, వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
