ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్…

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్

గంగాధర నేటిధాత్రి :

 

అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ. 22,56,500/- విలువైన ఆర్థిక సహాయం మంజూరు అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపదలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న,సాగి అజయ్ రావు,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్,ముచ్చ శంకరయ్య,దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్,మ్యాక వినోద్,ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ…

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ

కొత్తగూడ, నేటిధాత్రి:

 

సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరిక బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి ఆధ్వర్యంలో… పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ..ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ కి స్థానిక ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ & క్లస్టర్ ఇంచార్జి వారి ఆధ్వర్యంలో నేడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిక ..

వీరికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు

పార్టీలో చేరిన వారు
గట్టి బాబు ( నర్సయ్య ) మాజీ సర్పంచ్ తిమ్మాపూర్.
దానం నారాయణ వార్డ్ మెంబర్ గుండంపల్లి
రమేష్ సీనియర్ కార్యకర్త.
జాటోత్ తేజ గుండంపల్లి
భూక్య నాగులు గుండంపల్లి వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే నిస్వార్ధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత రేవంత్ సర్కార్ ది మాత్రమే ..
ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని
మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి భవిష్యత్ కార్యాచరణ కోసం మహిళా సంఘాలను బలోపేతం చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగంకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్ల కు 500 బోనస్ వరి మద్దతు ధర నిరుపేదలకు రేషన్ నూతన కార్డులను అందించి అర్హులందరికీ సన్న బియ్యం.. అందించిన ఘనత రేవంత్ సర్కార్ ..!
ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.. ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడ లో దూసుకుపోతున్న పలు అభివృద్ధి పనులు
కెసిఆర్ ఇవ్వలేనిది ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా నిరుపేదలకు గూడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సంగతి విదితమే.. వ్యవసాయ రంగంతో పాటు నిరుపేద గృహాల వెలుగులను నింపుతున్న ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు ములుగు నియోజకవర్గానికి సీతక్క ఎమ్మెల్యేగా .. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు గా ఉంటూ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న మంత్రి సీతక్క ఉండడం మన అదృష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా చేరుతున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ములుగు (అసెంబ్లీ ) జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి.
జిల్లా సీనియర్ నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు
జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్.
( గుండంపల్లి క్లస్టర్ & కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ )
వల్లపు రంజిత్, వద్ది సోమయ్య, లక్కాకుల రాజు, గట్టి రమేష్ తోట మాధవలు బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు

సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్‌లో…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-99-1.wav?_=1

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సంస్మరణ సభ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ 2025 ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లోని, రవీంద్రభారతి యందు ఉదయం 11.00 గంటలకు జరగనున్నది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ‘. డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, కామ్రేడ్ సయ్యద్ అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.ఈ సంస్మరణ సభకు ప్రతి జిల్లా నుంచి 50 మందికి తక్కువ కాకుండా కోట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన సంగారెడ్డి జిల్లాకు 50 మంది కోట ఇవ్వడం జరిగింది ఆగస్టు 30వ తేదీన ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతికి సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంస్మరణ సభలో పాల్గొనే వారందరూ పురుషులు ఎర్ర చొక్కాలు, స్త్రీలు ఎర్ర చీరలను ధరించి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు,

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=2

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70-2.wav?_=3

 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల సన్నాహక సదస్సు కార్యక్రమం

◆:- పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము రాత్రి ఎన్ కన్వెన్షన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దలు, గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి వికలాంగుల సన్నాహక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడానికి ఎమ్మార్పీఎస్ ఏ కారణం అని చెప్పడం జరిగింది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు పెంచాలని పోరాటం చేసింది కూడా ఎమ్మార్పీఎస్ ఏ అని కూడా వారు సభలో చెప్పడం జరిగింది, అలాగే చిన్నపిల్లల గుండె సమస్యలకి ఉచిత వైద్యం చేయించాలని కూడా ఎమ్మార్పీఎస్ ఏ పోరాటం చేసిందని మరియు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 200 నాటి నుండి 2000 వరకు పెరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేసింది అని మరియు 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 4000 నుండి 6000 వరకు పెంచడం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 9 వ తేదీన మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత జ్యోతి పండాల్ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ ద్వారా వివిధ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులైన గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ అబ్రహం మాదిగ మరియు మండల అధ్యక్షులకి, వారి టీమ్ అందరికీ మరియు రాయికోటి నరసింహులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంఆర్పిఎస్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు,

మోసం చేసిన సర్కారు – మందకృష్ణ మాదిగ హెచ్చరిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69-2.wav?_=4

మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్…

వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

 

 

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

 సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T160734.964-1.wav?_=5

 

అంగన్వాడీ భవనం,పీహెచ్ సి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు
పనుల జాతర 2025 (పనుల ప్రారంభోత్సవం కొత్తగా ప్రారంభించే పనులకు భూమిపూజ కార్యక్రమం) లో బాగంగా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో అంగన్ వాడి భవనమునకు శంకుస్థాపన,పిఎచ్ సి భవనము ప్రారంభోత్సవం,జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు సైన్స్ ల్యాబ్ కు భూమి పూజ కార్యక్రమం, క్యాటింన్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన,అలాగే రాయపర్తి గ్రామంలో అంగన్వాడి భవనం ప్రారంభోత్సవంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని,ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన ధ్యేయం అని అన్నారు.గత ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమయ్యారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతిన్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

పేదలకందిన సీఎంఆర్ఎఫ్ చెక్కు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-58-3.wav?_=6

పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

*-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి *

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాసంలో గురువారం కోహీర్ మండలం మనియార్ పల్లీ గ్రామానికి చెందిన బి.బుజ్జమ్మ 60,000 /- (ఆరవై వేలరూపాయల) ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారు భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షద్ పటేల్,శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,జుబెర్,అశ్విన్ పాటిల్,అరుణ్,నరేష్ బబ్లూ,బి.మల్లికార్జున్,ఇమామ్ పటేల్,మహ్మద్.గౌసోద్దీన్,నర్సింహా యాదవ్,మానియార్ పల్లీ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్,మోహీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. .

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. . *రాజీవ్ గాంధీ 81వజన్మదిన వేడుకలు
జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు
మొగులపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కేంద్రం లోని చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆయన 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు భారతదేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధాన మంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీ వయసు కేవలం మూడు సంవత్సరాలు అలాంటి వ్యక్తి భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి అతను 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు ఆయన ప్రధానమంత్రి గా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.అలాగే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమ్మదు రఫీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆపద వస్తే నేనున్నానని 108 లాగా ముందుండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ గాంధీ కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఎంతో మేలు చేసిందని అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని వారి పేర్ల మీద నిరుపేదలైనటువంటి వారికి పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత సన్న బియ్యం కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లు ఇస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు . కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-5.wav?_=7

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల,నడికూడ,దామెర,ఆత్మకూరు మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని,గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని, మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నారు.స్థానిక సంస్థలు ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందిఅని,సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు.విలేజ్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి ప్రజా సమస్యలకు ప్రియార్టీ ఇస్తామని,వచ్చే ఆదివారం సమావేశాల్లో ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని 60 ఓట్లకు ఒక బాధ్యున్ని నియమించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలోని సమస్యలను చర్చించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు.గ్రామాల వారిగా జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపట్ల ప్రజలలో నమ్మకం కలిగిందని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

తొర్రూరులో పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-6.wav?_=8

తొర్రూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

తొర్రూరుడివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన యుద్ధ వీరుడు, విప్లవకారుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోకు దెబ్బ జిల్లా కార్యదర్శి మేరుగు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, “బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి” అని పిలుపునిచ్చారు.

Sardar Sarvai Papannagoud’s

వేడుకల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిర్వహించిన భూమిపూజ సందర్భంగా వారి చిత్రపటాలకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్ట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జీఎస్పీఎస్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్ కె ఎస్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు చామకూరి ఐలయ్య గౌడ్ అధ్యక్షులు నాగపురి అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్పిజి అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్ కంట మహేశ్వర సంఘంలో గౌరవాధ్యక్షులు చీకటి రమేష్ గౌడ్ అధ్యక్షులు నిమ్మల శేఖర్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మెర వినోద్ గౌడ్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, టౌన్ యువజన అధ్యక్షుడు బొమ్మ గాని మనోజ్ గౌడ్, చీకటి వీరన్న గౌడ్ తొర్రూరు పట్టణంలోని నాలుగు సంఘాల గౌరవ సభ్యులు ప్రజా
ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, మహిళలు, మరియు పెద్ద సంఖ్యలో బహుజన ప్రజలు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55.wav?_=9

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో BRS నాయకుల ఆగడాలకు చట్టపరమైన చర్యలు కోరారు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T131641.925.wav?_=10

 

చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేటలోని రామకృష్ణ జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్ మరదలు రాజుపేట గ్రామం కీ.శే.కోతి స్వామి-అరుణ గౌడ్ దంపతుల కూతురు రచన -అబిలాష్ గౌడ్ ల వివాహం సత్యం ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగింది.ఈ వివాహ వేడుకకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వాదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు, మల్లంపల్లి గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్, రాజుపేట గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,నర్సంపేట గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ కక్కెర్ల అశోక్ గౌడ్, మల్లంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కేర్ల రాజు గౌడ్,కక్కేర్ల రాజు గౌడ్, మాజీ కోశాధికారి కక్కేర్ల కుమారస్వామి గౌడ్, కక్కేర్ల రాములు గౌడ్ తదితరులు హాజరైనారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-4.wav?_=11

బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా.
సవతి తల్లి తన సవతి పిల్లలపైన సవతి ప్రేమా ఎలా చూపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అడ్డగోలుగా, ఇష్టానుసారంగా తలా తోక లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు, అలాగే కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందని తెలుసుకోకుండా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు బిజెపి పైన ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ నీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ తెలిసి చేశారా తెలియక చేశారా అన్న అంశం కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. జనవరి 1, 1979 నాడు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ని బీ.పీ మండల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరైతే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిటీ వాళ్లు సర్వే చేసి డిసెంబర్ 31, 1984 సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1979లో ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉండెనో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 1989 వరకు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఈ పదేళ్ల కాలంలో రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఈ రిపోర్టు పైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 1990లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 1990లో అప్పటి ప్రధానమంత్రి అయిన వీ.పీ సింగ్ గారు ఈ మండల్ కమిటీ వారు ఏదైతే రిపోర్టు ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్టు ప్రకారము 27% రిజర్వేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఇంద్రా సావ్నే అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, సుప్రీంకోర్టు ఇంద్రా సావ్నే vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో మూడు గవర్నమెంటల్ మిషనరీస్ ని అమలులోకి తీసుకురావడం జరిగింది (లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ). అయితే పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేయడం జరుగుతుందో ఆ బిల్లు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ లిమిట్ ని విధించడం జరిగింది. ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ బిసి రిజర్వేషన్ ని ఆమోదించిన కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది.
ఒకవేళ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా స్పష్టమైన మరియు న్యాయపరమైన అలాగే స్టాటిస్టికల్ డేటాని చూపిస్తూ మన రాష్ట్రంలో బీసీలు ఎలా అణిచివేయబడుతున్నారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతున్నది అని ఇలాంటి అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు మాత్రమే బిసి రిజర్వేషన్నీ ఆమోదించడం జరుగుతుంది.మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాస్ట్ సర్వే చేశామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టడం లేదని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రశ్నించడం జరిగింది. ఆ రిపోర్టు బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు ఎంత బాగా సర్వే చేశారని తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సర్వే కరెక్ట్ గా జరగలేదు బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ వారు తీన్మార్ మల్లన్న నీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బీసీ సర్వే అవ్వకముందే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎలా ప్రవేశపెడతారు? ఈ అడ్డిమారి గుడ్డి బిసి సర్వే ని ఆధారం చేసుకొని బిజెపి ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గాని ఎలా ఆమోదిస్తుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు.
బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు తగిన బుద్ధి చెబుతారనే భయంతో బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తూ ఢిల్లీలో నిరసన తెలియజేయడం చూస్తుంటే, బట్ట కాల్చి బిజెపి పైన వేయాలన్న ఉద్దేశం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల వరకు భారతదేశంలో రూలింగ్ లో ఉండే మరి అప్పుడు బీసీల పైన ఈ ప్రేమ ఎక్కడ పోయింది, కొత్తగా ఈ ప్రేమ ఇప్పుడు ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో తెలియజేయాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
మీ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇది సుప్రీంకోర్టు ఆమోదించదు మరియు 9th షెడ్యూల్లో కూడా చేర్చడం చాలా కష్టమైన విషయం అని తెలిసి కూడా బీసీల సింపతి కోసం మరియు బీసీల ఓట్ల కోసం ఈ సవతి ప్రేమ చూపించడం జరిగిందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాగే మద్దతు తెలిపితే మిమ్మల్ని ఇలానే మోసం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేలా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కావున కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని తెలుసుకోవాలని మరియు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని జ్యోతి పండాల్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version