గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

మహాదేవపూర్ సెప్టెంబర్ 27 నేటి దాత్రి *

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూర్ గ్రామానికి చెందిన కొయ్యల రమ కు 24000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ అందించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి శివరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T143753.341.wav?_=1

 

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ యన్.గిరిధర్ రెడ్డి నివాసంలో బుధవారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సి ఎం ఆర్ ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
-:లబ్ధిదారులు:- రాజు మైకలి-47,500/- ఎండీ సోహైల్ షా-25,000/- అబ్దుల్ నబీ-27,000/- కళ్యాణ్ ఉమాదేవి-60,000/- దామావతి-60,000/- వోతి శ్రీనివాస్-29,500/- ఎస్ మహేష్ కుమార్-60,000/- దోమల రమేష్-60,000/- పర్వీన్ బేగం-35,000/- చౌహాన్ రవీందర్-50,000/- బేగరి దశరథ్-50,000/- బి.నవాబ్ మియా-24,000/- ఎండీ షాబుద్దీన్-60,000/- ఎదిగి దత్త గౌడ్-30,000/- ఎన్ అశ్వని-30,500/- ఎన్ అశ్వని-30,500/- పవార్ రేణుకా బాయి-20,000/- మంగలి సురేష్-60,000/- తలారి బిక్షపతి-55,000/- మొత్తం = 1,053,500/- ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి వి.రాములు,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య నర్సింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి మల్లికార్జున్ నర్సింహులు ఇమామ్ పటేల్,హన్మంత్ రెడ్డి బర్కత్ మరియు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లబ్దిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి…

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి

◆:- టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయనిధి చాలా అండగా నిలుస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో కోట్లల్లో డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా కొంతవరకైనా లబ్ధి పొందవచ్చు అని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు.
మొన్న వరంగల్లో టిఆర్పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగిన టిఆర్పి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద ప్రజలకి మా పార్టీ అధికారంలోకి వస్తే, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో మా పార్టీ అధ్యక్షులు వివిధ వర్గాల పేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము.కావున జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.

పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయ నిధి. ‌

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T122657.334.wav?_=2

 

పేదల వైద్య సేవలకు అండగా సీఎం సహాయ నిధి.

‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్. ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. ‌

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయ నిధి ( సిఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తుందని భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్ అన్నారు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్న ఖరీదైన చికిత్సకు వెనకాడకుండా ప్రజలకు ఈ సాయాన్ని వినియోగించుకోవాలని సీఎం సహాయ నిధి రాజకీయాలకు అతీతంగా అందరూ అందుబాటులో ఉంటుందని అవసరమైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్…

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్

గంగాధర నేటిధాత్రి :

 

అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ. 22,56,500/- విలువైన ఆర్థిక సహాయం మంజూరు అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపదలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న,సాగి అజయ్ రావు,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్,ముచ్చ శంకరయ్య,దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్,మ్యాక వినోద్,ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

పేదలకందిన సీఎంఆర్ఎఫ్ చెక్కు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-58-3.wav?_=3

పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

*-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి *

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాసంలో గురువారం కోహీర్ మండలం మనియార్ పల్లీ గ్రామానికి చెందిన బి.బుజ్జమ్మ 60,000 /- (ఆరవై వేలరూపాయల) ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారు భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షద్ పటేల్,శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,జుబెర్,అశ్విన్ పాటిల్,అరుణ్,నరేష్ బబ్లూ,బి.మల్లికార్జున్,ఇమామ్ పటేల్,మహ్మద్.గౌసోద్దీన్,నర్సింహా యాదవ్,మానియార్ పల్లీ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్,మోహీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో నిరుపేదలకు సీఎం సహాయనిధి పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T131500.204.wav?_=4

నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

పేదలకు గోపవరం సీఎం సహాయనిధి.

పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి:
-ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట( నేటిదాత్రి )

వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55.wav?_=5

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్…

– లబ్ధిదారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..
– 5 మండలాలు,2పట్టణాల పరిధిల చెక్కుల పంపిణీ.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T153947.060.wav?_=6

– జమ్మికుంట (నేటిధాత్రి)
పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలై ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.నియోజకవర్గపరిధిలోని 5 మండలాలు,2 పట్టణాలు కలిపి 147 మంది లబ్ధిదారులకు 51,14,000/- విలువ చేసే చెక్కులను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు అందుకున్న వారు త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని,చెక్కుల పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన విధానం మార్చుకోవాలని సూచించారు.ప్రోటోకాల్ అని రెచ్చిపోయే కౌశిక్ రెడ్డి,చెక్కులు ఇచ్చే క్రమంలో సీఎం ఫోటో కట్ చేసి ఇవ్వడం ప్రోటోకాల్ ఆ అని ప్రశ్నించారు?.

ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు..

ప్రజా సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల రూప కల్పన చేస్తుందని,ప్రజా ఆమోదయోగ్య సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో మొదటి స్థాయిలో నిలుస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పథకాలే రాబోయే స్థానిక పోరులో మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు,మార్కెట్ చైర్మెన్ లు,డైరెక్టర్లు,దేవస్థాన చైర్మెన్ లు సీనియర్ నాయకులు,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు

◆:- శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు

◆:- డీసీఎంస్ చైర్మన్ శివకుమార్

◆:- మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹5,11,000 విలువ గల చెక్కులను *క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం .గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-ఝరాసంగం గ్రామానికి చెందిన సాయంలా లక్షికాంత్ గారికి ₹.60,000, బేగరి లక్ష్మయ్య గారికి ₹.33,000 వనంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహాదేవ్ గారికి ₹.22,500, & ₹.37,500 మచ్నూర్ గ్రామానికి చెందిన టంటం దశ్రత్ గారికి ₹.17,000 నర్సాపూర్ గ్రామానికి చెందిన భూత్నపిల్లి సిద్దన్న గారికి ₹.33,000 & ₹.12,500
ఈదులపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల వీరేంద్ర గారికి ₹.60,000 కృష్ణ పూర్ గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ గారికి ₹.60,000 ప్యారవం గ్రామానికి చెందిన బి వెంకటేశం గారికి ₹.60,000 కుప్పనగర్ గ్రామానికి చెందిన గడ్డబాది మైబూబ్ అలీ గారికి ₹.60,000
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, మాజీ సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కిషన్,అమిత్ కుమార్, ప్రభు పటేల్, నాయకులు శశి వర్ధన్ రెడ్డి, సంతు పటేల్, నాగన్న, మూసాపటెల్, అసిఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు *ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ గారికి,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు

◆:-మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹4,30,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు _జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మరియు ప్యాక్స్ చైర్మన్ మచ్చేందర్ గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-అనేగుంట గ్రామానికి చెందిన కడిమంచి రేణుక గారికి ₹.60,000 సత్వార్ గ్రామానికి చెందిన ఎర్పుల పద్మావతి గారికి ₹.5,500/-, ₹.60,000 , & ₹.49,500/-బుచ్చినెల్లి గ్రామానికి చెందిన బరూర్ జయ్యప్ప గారికి ₹25,500/-,మల్లగారి రూబెన్ గారికి ₹6,000/-,₹56,000/-,రాయిపల్లి డి గ్రామానికి చెందిన బేగరి భాగమ్మ గారికి ₹42,000/-,అల్గొల్ గ్రామానికి చెందిన సయ్యేద్ ముబీన్ గారికి ₹45,000/-,చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన హఫీజ్ మియా గారికి ₹40,500/-,బుర్దిపాడ్ గ్రామానికి చెందిన ఉరడి కృష్ణ గారికి ₹17,000/-,డిడిగి గ్రామానికి చెందిన గవిని రాజు గారికి ₹23,000/-,ఈ కార్యక్రమంలో ఝారసంఘం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్,మాజీ ముగడంపల్లి సర్పంచ్ ఫోరమ్ మాజీ అధ్యక్షులు సురేష్,మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిథ్ కుమార్ , ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాతోడ్,మాజీ సర్పంచ్ లు విజయ్, చిన్న రెడ్డి, జగదీష్, అబ్రహం,వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు సహీద్, పెంట రెడ్డి, చెంద్రకాంత్ రెడ్డి, పర్వేజ్ పటేల్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయకులు ,బస్వారాజ్, కె కిష్టయ్య, ప్రభాకర్, వీర్ శెట్టి, శ్రీనివాస్, రాజు, అభిషేక్ రెడ్డి, రాతోడ్ భీమ్ రావు నాయక్, లక్ష్మయ్య, అశోక్,ఇనాయత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ చిలకల రాయ కొమురు జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, టేకుమట్ల చిట్యాల పలువురు మండల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు గాను ₹1,46,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ , పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ జగదీష్ గ్రామ పార్టీ అధ్యక్షులు సత్వర్ సయీద్ ,అల్గోల్ చంద్రకాంత్ రెడ్డి, అనెగుంట జగ్గనాథం,నాయకులుస్వామీదాస్,రాజు,వేంకటి,మల్లేష్ ప్రశాంత్ తదితర ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు.సత్వార్ గ్రామానికి చెందిన మోగులప్ప గారికి ₹.15,000/- అనెగుంట గ్రామానికి చెందిన నిర్మలమ్మ గారికి ₹.55,500/- అల్గొల్ గ్రామానికి చెందిన మీనా గారికి ₹.20,500/- చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జంగలి శ్రీకాంత్ గారికి ₹.29,000/- , బస్వరాజు గారికి ₹.26,000/- ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని 37 వార్డులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ మే 22 (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37 వ వార్డులో ని ఈ రోజున ఉదయం 10-30 సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహాయ నిధి (CMRF)నుండి స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సహాయ సహకారంతో 37.వ పరిధిలో గల లబ్దిదారులైన బూర్ల ప్రతాప్ 24000/- రూపాయలు దాసరి కళావతి విఠల్ 6500/-
రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ లను వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగినది.ఈ సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కి తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు మరియు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు..

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యం చేయించుకుని పరిస్థితులు ఉన్నవారికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేస్తూ. పేద ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఇందులో లబ్ధిదారులైన. అంబటి లక్ష్మమ్మకు 60000 రూపాయలు. మునిగే మహేందర్ కు 55 వేల రూపాయలు. బి మల్లయ్యకు. 11,500 రూపాయలు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మాకు చెక్కులు రావడానికి కృషి చేసినందుకు లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారి సునీల్ రెడ్డి. సీనియర్ నాయకులు కూతురి రాజు. కుండ వేణి కిషన్. రవి. మీరాల శ్రీనివాస్ యాదవ్. ఎడ్ల ప్రేమ్ కుమార్. జంగం సత్తయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన.

సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన

రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

గోపాల్ పేట్ మండల్ జయన్న తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కి అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిదికి దరఖాస్తు చేసుకోగా 60,000 వేల రూపాయల విలువ గల చెక్కును రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి బాధితురాలుకు అందజేశారు
ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలుస్తుంది అని చిన్నారెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీజనరల్ సెక్రెటరీ జిల్లెలప్రవీణ్ కుమార్, రెడ్డి,బాలేశ్వర్, పర్వతాలు పాల్గొన్నారు.*

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగే రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సారంపల్లి గ్రామానికి చెందిన కోల అనిత లక్ష్మణ్ కి 14,500 రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచుకొని ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి చెక్కులు.రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు కోల అనిత లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ సుంచుల కిషన్ గడ్డమీద శ్రీనివాస్ సిరిసిల్ల దేవదాస్ కున వేణి వినోద్ కోల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version