రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

రాజీవ్ గాంధీ భారతదేశ సమాచార విప్లవ పితామహుడు

చేవెళ్ల, నేటిధాత్రి:

చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమనిచేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకునిమొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలొ మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి అయ్యి దేశంలో తరం మార్పుకు సంకేతంగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో అతిపెద్ద మెజారిటీ సాధించా రన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశట్టిన రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని అన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్,టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని కొనియాడారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ , టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , మాజీ జడ్పీటీసీ కె భాస్కర్ , వెంకటాపూర్ మహేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి , దారెడ్డి కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గణేష్ గౌడ్, ఎంపీటీసీ కేబుల్ రాజు, అప్పారెడ్డిగూడ కిరణ్ కుమార్, రాములు,డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, ఫిషార్మెన్ మండల ప్రసిడెంట్ బిక్షపతి, గన్నెపాగ నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , శ్రీ పాల్ , ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీమెంబర్స్,మాజీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. .

దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. . *రాజీవ్ గాంధీ 81వజన్మదిన వేడుకలు
జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు
మొగులపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కేంద్రం లోని చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆయన 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు భారతదేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధాన మంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీ వయసు కేవలం మూడు సంవత్సరాలు అలాంటి వ్యక్తి భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి అతను 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు ఆయన ప్రధానమంత్రి గా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.అలాగే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమ్మదు రఫీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆపద వస్తే నేనున్నానని 108 లాగా ముందుండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ గాంధీ కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఎంతో మేలు చేసిందని అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని వారి పేర్ల మీద నిరుపేదలైనటువంటి వారికి పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత సన్న బియ్యం కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లు ఇస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు . కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T160242.095.wav?_=1

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ)
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈసందర్భంగా రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఆధునికరణ, ఐటీ సంస్థలు నిలపడంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అహర్నిశలు కష్టపడిన నేత రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈవేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల మాజీ సర్పంచ్ కోల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శీను జెట్టిపల్లి వీరయ్య తడగొండ నర్సిమ్ బాబు ,హనుమంతు, నరసయ్య, అంజయ్య, బాపురాజు, ఆంజనేయులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T155632.925.wav?_=2

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించుకోవడం మొదటగా కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలంకరణ చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది, అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారని అలాగే భారత రాజ్యాంగం కల్పించినటువంటి 18 సంవత్సరాల యువతి యువకులకు మొదటగా ఓటు హక్కును కల్పించిన మహా వ్యక్తి రాజీవ్ గాంధీ గారని తెలియజేశారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ అనేక సేవలందించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని తన యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య చిట్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ చిట్యాల మండల యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పిట్టల సాంబయ్య మండల కోఆప్షన్ సభ్యులు ఎండి రాజ్ మహమ్మద్ నాయకులు బుర్ర మల్లేష్ ఏరుగొండ గణపతి నర్ర శివరామకృష్ణ పుల్ల సమ్మయ్య సరికొమ్ముల సదయ్య శనిగరం మొగిలి అందుకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ జగద్గురు రేవణసిద్దేశ్వరాయ దేవస్థానాన్ని దర్శించుకున్న కేతకి చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T153634.919.wav?_=3

 

శ్రీ జగద్గురు రేవణసిద్దేశ్వరాయ దేవస్థానాన్ని దర్శించుకున్న కేతకి చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఈదుల్ పల్లి గ్రామంలో
శ్రీ జగద్గురు రేవణసిద్దేశ్వరాయ నమః శ్రావణమాసం బుధవారం పురస్కరించుకొని శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకము బిల్వపత్రి పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ .అప్నగారి చంద్రశేఖర్ పాటిల్ కుటుంబ సభ్యులు వారికి ఆలయ పీఠాధిపతి శివ లీలమ్మ అర్చకులు రేవన సిద్దయ్య స్వామి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

“రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు”

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T153007.201.wav?_=4

 

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కొడిమ్యాల (నేటి ధాత్రి ):

 

 

కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అద్వ్యర్యం లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్,సీనియర్ నాయకులు గుడి మల్లికార్జునరెడ్డి, గోగూరి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ చిలువరి ప్రసాద్, నాయకులు కిషన్ రెడ్డి, గంగయ్య, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.. 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T152429.801-1.wav?_=5

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్,
మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున గౌడ్,
గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ,
మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, గుర్రం సదానందం యువజన నాయకులు దూడపాక పున్నం, సీనియర్ నాయకులు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, రామగిరి సంపత్, సుధాకర్ రెడ్డి, ఆలూరి మొగిలయ్య, ఎస్ కే జానీ. మోషే. గణేష్. తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T145411.748.wav?_=6

 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

*తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T141810.056-1.wav?_=7

 

సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేనిది..

ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరమని గుర్తించి వాటిని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి, సేవలు మరువలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (బుధవారం) భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… దేశానికి సమాచార, సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు శక్తి ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారన్నారు. రాజీవ్ గాంధీ టెలీకమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. యువత ప్రయోజనాలే లక్ష్యంగా ఐటీ, విద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ రాజకీయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసు 21 నుండి 18 ఏళ్లకు తగ్గించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే అన్నారు. 91 పార్లమెంట్ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకు కేటాయించి తాను మాటలకారి కాదని, చేతల్లో చూపిస్తానని రాజీవ్ గాంధీ నిరూపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-3.wav?_=8

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి లో ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు చీర్ల చందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో కలిసి నిర్వహించారు
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవల ను కొనియాడారు కార్యకర్తలు దివంగత మాజీ ప్రధాని కి నివాళులర్పిం చి పూలమాలలు వేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సబ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఐ ఎన్ టి యు సి వర్క్స్ బోర్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మహానాయకుడు రాజీవ్ గాంధీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/congress-party-1.wav?_=9

మహానాయకుడు రాజీవ్ గాంధీ

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్

జయంతి సందర్బంగా మొక్కలు నాటిన కాంగ్రెస్ శ్రేణులు

పరకాల నేటిధాత్రి

పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో వారి పేరు మీద మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుడు దేశం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం విషయంలో యువకుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీఅని ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవత్మకంగా మార్పులను తీసుకొచ్చారు తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.

టెలి కమ్యూనికేషన్స్ రక్షణ వాణిజ్య విమానా సంస్కరణాల ప్రవేశపెట్టారని విద్యా అవకాశాలు సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని అదేవిధంగా భారత దేశ యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతీ యువకులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ రాజకీయాలలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార వాణిజ్య రంగాలలో యువకులు ముందుండాలని వారి ఆలోచన విధానంతో ఈరోజు దేశ ప్రజలందరూ సెల్ఫోన్ ల్యాప్టాప్ ఐటీ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారంటే యువత మొత్తం ఐటి రంగంలో ముందున్నారంటే అది రాజీవ్ గాంధీ యొక్క ఘనత అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అన్నారు.అదేవిధంగా దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజలే నా ప్రాణం అంటూ ప్రజాసేవలో ముందుకు సాగి ప్రాణాలర్పించిన మహా నాయకుడు రాజీవ్ గాంధని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,సమన్వ కమిటీ సభ్యులు చిన్నల గోనాథ్,ఎండి రంజాన్ అలీ, పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,సదానందం గౌడ్, మడికొండ శీను,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రవణ్ కుమార్,లక్కం వసంత,ఎండి కాయముదిన్,బొచ్చు భాస్కర్,దొమ్మటి బాబురావు,చిలువేరు రాఘవ,మహేందర్,బొచ్చు జెమిని,ఒంటేరు వరుణ్,వక్కేల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

1వ వార్డులో ఘనంగా రాజీవ్ గాంధి జయంతి

పరకాల మున్సిపాలిటిలోని ఒకటవ వార్డు సీఎస్ఐ కాలనిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ
దేశంలో ఐటీ రంగానికి పునాదులువేసి,భారీ విదేశీ 
పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి,దివంగత ప్రధాని, 
భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ సమాన్వయ కమిటీ సభ్యులు నాయకులు డాక్టర్ మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాఘవ,సదయ్య,మడికొండ రాజు,వినయ్,మహేష్
సిద్దు,కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T135815.447-1.wav?_=10

 

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలో బుధవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో బృంగి ఆనంద్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి జగన్,మాజీ కౌన్సిలర్లు చిన్న రాంరెడ్డి, ఎజాస్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్,నాయకులు వర్కాల భాస్కర్ రెడ్డి,ముత్యాలు,పాండురంగారెడ్డి, ఆంజనేయులు,మాజీ సర్పంచ్ బాలరాజు,జమ్ముల శ్రీకాంత్,సంతు యాదవ్,నాని యాదవ్,రేష్మ బేగం, రెహానా బేగం,దున్న సురేష్, సుభాని,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T131758.313-1.wav?_=11

 

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని గాంధీ చౌక్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కన్వీనర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సిరిసిల్ల నిర్వహించడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండ పేదల పెన్నిధిగా మహోన్నత వ్యక్తిగా, ఇది నిన్న రాజీవ్ గాంధీ ఎంతోమంది పేదలకు అండదండగా ఉంటూ ముందుకు సాగరం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా నేడు తెలంగాణలో పేదల ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాంగ ముందుకు వస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సూర దేవరాజ్, మాజీ కౌంటర్ ఎల్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/rajiv-gandhi-1.wav?_=12

నేటి డిజిటల్ ఇండియా….నాటి రాజీవ్ గాంధీ విజన్

టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడారు.

దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు.దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు వెళ్లడానికి కారణం నాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ జంగం కళ, దీకొండ శ్యామ్ గౌడ్, గోపురాజం,పుల్లూరి కళ్యాణ్, కట్ల రమేష్,బత్తుల వేణు,శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.

“ములుగులో రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T125423.144-1.wav?_=13

 

ములుగులో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

#రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు

ములుగు, జిల్లా నేటిధాత్రి:

 

 

భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయతి వేడుకలు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొని ఈ కార్యక్రమంలో వారు దేశానికి చేసిన సేవల గురించి స్మరించుకుంటూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా,రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు,మండల నాయకులు ,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు,అబిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T124046.183.wav?_=14

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవరణలో చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నెంబర్ మల్లన్న పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాజీ వార్డ్ మెంబర్ ఆన్సర్ సీనియర్ నాయకులు ల్యాఖత్ అలీ రాజేందర్ సింగ్ అశ్విరఫ్ అలీ రజాక్ రవి కృష్ణ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు,

“రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఘన నివాళి”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T113303.922-1.wav?_=15

 

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మహాదేవపూర్ ఆగస్టు20నేటి ధాత్రి *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
భారతరత్న , మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, పాక్స్ చైర్మెన్ చల్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ, AMC డైరెక్టర్ పోత రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ కడార్ల నాగరాజు, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లు ఐత తిరుపతి రెడ్డి, శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్ రావు, కలికోట వరప్రసాద్ , కోట సమ్మయ్య, సుంకరి సమ్మయ్య, కేదారి నాగరాజు, వడ్ల సమ్మయ్య, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆవిర్భావ లు.

..తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. యూత్ ఆవిర్భావ. పండుగలను. యూత్ కాంగ్రెస్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65.వ. వేడుకలను. ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు. జిల్లా ఇన్చార్జి తూముకుంట అంకక్ష రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ మరియు సీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1965.లో. ఇందిరాగాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ యూత్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. 1960వ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని. ఇందిరా గాంధీ మరణం తర్వాత. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి. భారతదేశంలోని. యువత యువకులకు 18 సంవత్సరాల దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించిన ఏకైక వ్యక్తిగా. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని. ఆయన హయాంలోనే. దేశానికి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని ఆయన. ఆశయమని. దానికి అనుగుణంగా కాంగ్రెస్ యూత్ పార్టీ పనిచేస్తుందని. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి.మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.నియోజకవర్గ ఇన్చార్జి యూత్ చుక్క శేఖర్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ముందటి తిరుపతి. బండి పరశురాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన.

రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఏ.చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని భారత మాజీ ప్రధాని, యువ భారత్ శిల్పి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్దంతిని పురస్కరించుకుని, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.,ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.రాజీవ్ గాంధీ భారతదేశానికి నూతన దిశను చూపిన మహానాయకుడు. 21వ శతాబ్దం భారతానికి తగిన సాంకేతికత,ఐటీ విప్లవం, యువతలో నూతన ఆశలు నూరిపోసిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాల్లో ఆయన దూరదృష్టితో అమలు చేసిన పథకాలు ఇవాళా కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..
ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ , గ్రామ పంచాయతీ వ్యవస్థను బలపరిచారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయన కలలను సాకారం చేయడంలో ముందుండి నడుస్తోంది అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రాజీవ్ గాంధీ గారి జీవితం, స్వప్నాలు, దేశాభివృద్ధికి చేసిన సేవలపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ , శ్రీనివాస్ రెడ్డి , రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, సామెల్ గారు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు హుగెల్లి రాములు , శుక్లవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ , జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, ఉదయ్ శంకర్ పాటిల్ మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version