ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-5.wav?_=1

ప్రజాప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుంది

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల,నడికూడ,దామెర,ఆత్మకూరు మండల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించాలని,గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు సమావేశంలో గత ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని, మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నారు.స్థానిక సంస్థలు ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలిస్తేనే గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందిఅని,సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అన్నారు.విలేజ్ మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి ప్రజా సమస్యలకు ప్రియార్టీ ఇస్తామని,వచ్చే ఆదివారం సమావేశాల్లో ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని 60 ఓట్లకు ఒక బాధ్యున్ని నియమించాలన్నారు.గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో దోచుకుతున్నారని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గ్రామంలోని సమస్యలను చర్చించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు.గ్రామాల వారిగా జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపట్ల ప్రజలలో నమ్మకం కలిగిందని అందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version