*ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం…*
*ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంజూరు పత్రాన్ని అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ:- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు,గత బిఅర్ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు గత ప్రభుత్వ 10 ఏండ్ల పాలనలో
కేసముద్రం పట్టణ పరిధిలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు.
ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డా!! భూక్యా మురళి నాయక్ , ఎంపీ పోరిక బలరాం నాయక్ సారాధ్యంలో కేసముద్రం పట్టణానికి మొదటి విడతలో 89 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు బానోత్ కోదండపాణి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.