పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

*ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం…*

*ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్*

*కేసముద్రం/ నేటి ధాత్రి*

కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంజూరు పత్రాన్ని అందజేసిన యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ:- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు,గత బిఅర్ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు గత ప్రభుత్వ 10 ఏండ్ల పాలనలో
కేసముద్రం పట్టణ పరిధిలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు.

ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డా!! భూక్యా మురళి నాయక్ , ఎంపీ పోరిక బలరాం నాయక్ సారాధ్యంలో కేసముద్రం పట్టణానికి మొదటి విడతలో 89 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు బానోత్ కోదండపాణి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

‘ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

నేటిధాత్రి:

 

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ ను అలాగే తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇన్నాళ్లు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి , కల్వరీ ఎంబీ చర్చి పాస్టర్ మరియు చైర్మన్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ జాకబ్, సెక్రెటరీ డేవిడ్, రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version