22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్..

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.

యూరియా బ్లాక్‌పై రైతుల ఆందోళన హెచ్చరిక…

యూరియా ను రైతులకు పూర్తిస్థాయిలో అందించాలి

కొండు బానేష్ జిల్లా కార్యదర్శి రైతుసంఘం

మంచిర్యాల19ఆగస్టు నేటి దాత్రి

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఫర్టిలైజర్. డీ. సీ. ఎం. ఎస్. హాక. పి ఎ సి ఎస్. సెంటర్ల ద్వారా రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లపై తనిఖీలు చేపట్టాలి.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల షాపులను రద్దు చేయాలి.
రైతులకు ఎరువులను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అధికంగా వసూలు చేస్తున్న డీలర్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేయాలి.
యూరియా ఎంఆర్ పి 266.5 రూపాయలు ప్రభుత్వం నిర్ణీత రేటు కంటే ఎక్కువ నమ్ముతున్న డీలర్లపై కేసులు నమోదు చేయాలి.
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని రైతులను నిలువునా దోచుకుంటున్న వ్యవహారంపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వ నిర్ణీత ధరలకే డీలర్లు అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
సబ్సిడీ ద్వారా రైతులకు అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టకుండ దళారుల చేతులలోకి పోకుండ చూడాలి.
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల దళారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రైతులని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ. మండల కేంద్రాలలో కొనసాగుతుంది.
ఒక్కో యూరియా బస్తా మీద 80 నుండి 100 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు.
కానీ రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు ఫర్టిలైజర్ షాపులపై అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు యూరియా తదితర ఎరువుల కొరత సృష్టించి పేద మధ్య తరగతి రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మారుమూల ప్రాంతాల్లో ఊరుకోక ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని పేద మధ్య తరగతి రైతుల నడ్డి విరుస్తున్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు తనిఖీ చేస్తూ వారి పైన చర్యలు తీసుకోవాలి.
లేని యెడల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించడం జరిగింది.

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం..

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం

*రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం లేదు
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట( నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రైతులందరూ రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నారు. ఇది చాలా ప్రయోజనకరమైన విషయమని ఇలా తెలియజేసినందుకు రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతి నిధి తెలిపారు. కానీ రైతులకు అవసరమైన నీళ్ల గురించి ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా ఆస్యాస్పదంగా ఉందని మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే రైతు బీమా కంటే రైతుల జీవితాలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించి అధికారులను పురమాయించి నీళ్లు వచ్చే విధంగా పనిచేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యే మేల్కొని దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపే విధంగా పనిచేయాలని యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతులు లక్షల రూపాయలు వెచ్చించి వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వెంటనే ప్రభుత్వం స్పందించాలని మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అతి త్వరలోనే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో జరుగుతుందని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version