చర్ల సిహెచ్ సి లో మొదలైన సిజేరియన్ ఆపరేషన్లు

చర్ల సిహెచ్ సి లో మొదలైన సిజేరియన్ ఆపరేషన్లు

జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక కృషి

నేటిదాత్రి చర్ల

 

 

భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సదుపాయాలు బలోపేతం అవుతున్నాయి జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక కృషి డీసీహెచ్ఎస్ రవిబాబు చొరవ కలగలిపి జిల్లాలోని వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులలో ఆశించిన స్థాయిలో సేవలు అందుతున్నాయి జిల్లాలోని మారుమూల ప్రాంతమైన చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘట్టం

ఆవిష్కృతమైంది గత కొన్నాళ్ళుగా ప్రాథమిక వైద్యానికే పరిమితమైనా వైద్య సదుపాయాలు నేడు స్పెషాలిటీ వైద్య సేవలను సైతం అందుబాటులోకి వచ్చింది ఎం ఎల్ ఏ చొరవతో ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదనపు ప్రోత్సాహాలు ప్రకటించి గర్భిణి స్త్రీల ఆరోగ్య రీత్యా ఒక ప్రసూతి వైద్యురాలు ఒక పిల్లల వైద్య నిపుణుడు ఒక మత్తు వైద్యుడు ని నియమించారు ఈ నియామకంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక చొరవ చూపి వైద్యులను పది రోజుల క్రితం నియమించారు

ఈ క్రమం లో నేడు చర్ల సి హెచ్ సి లో మొదటి సీజేరియన్ ఆపరేషన్ జరిగింది చర్ల మండలం కొత్తూరు గ్రామంకి చెందిన తన్నీరు రాజేశ్వరి మొదటి కాన్పు కోసం రాగా సుఖప్రసవం కోసం ప్రయత్నం చేసి కాన్పు చేయలేని పరిస్థితిలో తల్లి బిడ్డ క్షేమం కోసం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి పండంటి రెండు కేజీల మగ బిడ్డకి ఊపిరిపోశారు గతంలో ప్రసూతి సేవల కోసం అరవై కిలోమీటర్ల దూరంలో భద్రాచలం వెళ్లే పరిస్థితులు ఉండేవి కానీ ఏజెన్సీ లో ని చర్ల లో సైతం ప్రసూతి సేవలను అందుబాటులో తెచ్చిన ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ పాటిల్ డిసిహెచ్ఎస్ రవిబాబు లకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయివర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు ఆసుపత్రిలో అందుతున్న స్పెషాలిటీ సేవల పట్ల చర్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ ఆపరేషన్ లో ప్రసూతి వైద్యురాలు శ్రావణి పిల్లల వైద్యులు రవి కుమార్ మత్తు వైద్యుడు శివరామకృష్ణ నర్సింగ్ ఆఫీసర్ ఝాన్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version