గ్రాడ్యుయేషన్స్ పట్టాలు అందించిన సర్పంచ్ శ్రీకాంత్…

గ్రాడ్యుయేషన్స్ పట్టాలు అందించిన సర్పంచ్ శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం కొంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో గ్రాడ్యుయేషన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ దేవా నాయకు కొంపెల్లి గ్రామ సర్పంచ్ శ్రీకాంతు ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం ఐదో ఆరవ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించారు కొంపెల్లి గ్రామ ప్రజలు ఊరిలో ఉన్న పాఠశాలకు విద్యార్థులను పంపించి విద్యార్థుల చదువుకు సహకరించాలని మన గ్రామంలో ఉన్న పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ గ్రామ ప్రజలు విద్యార్థు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది…

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది

సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి .

 

ప్రైమరీ స్కూల్ బిజ్వరం మండల ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి న నామ్ దే వ్ పదవి విరమణ వేడుకలలో సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలాస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తి గొప్పది అన్నారు. 37ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికి నామ్‌దేవ్ విద్యార్థులకు విద్యా బోధ సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శేఖర్ గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ సంఘాలు కెసి వెంకటేష్, రాములు, నరేష్ రాంనాయక్,రాజలింగం,
పాఠశాల ఛైర్మన్,రాములమ్మ, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తధితరులు పాల్గొన్నారు

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, పెన్సిళ్లను గోనె వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గోనె వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అలాగే ప్రాథమిక పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు నేర్పించే విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, వేణుమాధవ్,గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్,ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్,వార్డ్ మెంబర్లు అశోక్,తరుణ్,కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయురాలు యాదమ్మ పదవీవిరమణ

వ్యక్తి జీవితంలో ఉద్యోగ ప్రస్థానం ముఖ్యమైనది.

బాలానగర్ ఎంఈఓ శంకర్.

బాలానగర్ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు యాదమ్మ ఈరోజు పదవి విరమణ పొందింది. ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ మాట్లాడుతూ.. యాదమ్మ తన సుదీర్ఘ వృత్తి జీవితంలో ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి ఆమె కృషి చేశారన్నారు. ఆమె శేష జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వనపర్తి పాఠశాలలో బాలికల విద్యకు ప్రాధాన్యం

బాలికలను చదివిoచాలి
.సాహితి కళావేదిక

జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్‌
వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి పట్టణంలో హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో
జాతీయ బాలిక దినోత్సవ సందర్బముగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ బాలికల తో కలసి పాఠశాలలో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ బాలికలను చదివిద్దాం.వారిని గౌరవవిద్దాం అని అన్నారు.బలమైన భారతన్ని నిర్మించాలన్న బాలికలను చదివించాలన్నారు.బాలిక అంటే కేవలం కుటుంబ గౌరవమే కాదు,బాలికలకు
విద్య, భద్రత, గౌరవం సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు ప్రభుత్వ
పాఠశాలలో జాతీయ నాయకులఫోటోలు ఉన్న వాటిని,గోడలకు పెయింటింగ్ వేయించిన్న ప్రధానోపాధ్యాయులు రంగస్వామి కృషిని పలస శంకర్ గౌడ్ అభినందించారు సామాజిక వేత్త . గంధం నాగరాజు పాడి నందుకు సంతోషం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగస్వామి, ఉపాధ్యాయులు నవనీత, వెంకటేశ్వర్లు, హుస్సేన్, కార్యాలయ సబార్డినేట్ వసంత. తడితరులు పాల్గొన్నారని శంకర్ గౌడ్ తెలిపారు

జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు

ఆత్మీయ అభినందన సభ

చందుర్తి, నేటిదాత్రి:

 

జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇటివల గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఆత్మీయ అభినందన సభను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మరియు ఉపాధ్యాయ బృంధం ఏర్పాటు చేసి,ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గ సభ్యులు పాఠశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించగలరని, గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చొరవ చూపించాలని, విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షహనాజ్ షమీర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలకు మా వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు. మా మా పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్పించామని రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షహనాజ్ సమీర్, ఉపసర్పంచ్ గంట మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమరబండ సాయి, విలేజ్ సెక్రటరీ కే మారుతి
వార్డు సభ్యులు
గద్దరాశి రాజు
ఓల్లం లావణ్య తిరుపతి, గొల్లపల్లి నారాయణ,
పల్లి ప్రశాంత్,
చక్రాల మంగ,
అమర బండ రమ్యశ్రీ జలంధర్,
టేకుమల్ల రేణుక,
ముద్దాల ప్రవీణ్,
చింతం రాధా శంకర్
ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్, పాము వెంకటేశ్వర్లు, గుడిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ రవి తదితరులు పాల్గొన్నారు.

బోరేగావ్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

*ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ…*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

బోరేగావ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు ఈలియాస్ మరియు గ్రామ సర్పంచ్ నాగేంద్ర పటేల్ గ్రామ ఉపసర్పంచ్ నర్సింలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు

సి ఆర్ పి చిరంజీవి రాజు శివ మరియు గ్రామస్తులు తో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు గా పి సబితా ఆయాగా సమిన, నియమించడం జరిగింది గ్రామంలో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ప్రీ ప్రైమరీ పాఠశాలలో అడ్మిషన్ చేయవలసిందిగా మండల విద్యాధికారి తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోగ్రామస్తులు పాల్గొనడం జరిగింది,

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్…

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున రాష్ట్ర విద్యాశాఖ అనుదేశానుసారంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించినట్టుగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు అన్ని రకాల పౌష్టికాహారాన్ని అందించినప్పుడే పిల్లల్లో ఎదుగుదల కనిపించి ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థుల కోసం వివిధ రకాలైన వంటకాలను చికెన్, చికెన్ బిర్యాని,తెలంగాణ వంటకాలు,పులిహోర గులాబ్ జామ్,సేమ్యా,పుల్కా, సర్వపిండి,నువ్వుల ముద్దలు,
పల్లి పట్టీలు,పేలాల ముద్దలు, రాఫుడ్, వివిధ రకాలైనటువంటి పండ్లు తీసుకువచ్చి వారి పిల్లలకు తినిపించారు‌.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,అంగన్వాడి టీచర్ బీముడి లక్ష్మి,సుమారు 40 మంది తల్లులు పాల్గొనడం జరిగింది.

పిల్లలకు మెకానిక్ అసోసియేషన్ చేయూత..

పిల్లలకు మెకానిక్ అసోసియేషన్ చేయూత..

తిరుపతి(నేటిధాత్రి)

 

లక్ష్మీపురం లోని అంగనవాడి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు భోజన సౌకర్యార్థం తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సిలిండర్ స్టవ్ మంగళవారం వితరణ చేసి. తమవంతు చేయూత అందించారు. అలాగే ప్రైమరీ స్కూల్లోని పిల్లలకు బిస్కెట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి. గౌరవ అధ్యక్షుడు జలంధర్. కార్యదర్శి గురు ఆచారి. అంగన్వాడి ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు
జి.గీత.కే. చెంచమ్మ పాల్గొన్నారు.

విశ్రాంత అధికారి పాఠాలు: విద్యార్థులకు ఆనందం, దేశానికి ఉత్తమ పౌరులు…

విశ్రాంత అధికారి పాఠాలు: విద్యార్థులకు ఆనందం, దేశానికి ఉత్తమ పౌరులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి. అంజయ్య విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులుగా బోధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని, సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడపడం సంతోషాన్నిస్తుందని ఆయన తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమకు దగ్గరలోని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు బోధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలతో సమయం గడపడం దేశానికి ఉత్తమ పౌరులను తయారు చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రధానోపాధ్యాయులను లేదా మండల విద్యాధికారిని సంప్రదిస్తే బోధించడానికి అనుమతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత పాల్గొన్నారు.

ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్…

ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్

చందుర్తి’ నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపును మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తేది 14.10.2025 మంగళ వారం నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం, నూతన ఆధార్ కార్డు నమోదు, ఆధార్ కార్డులో పేరు మార్చుట, వేలిముద్రలు మార్చటం, మొబైల్ నెంబర్ మార్చుట, అడ్రస్ మార్చుట, పుట్టిన తేదీ మార్చుట, ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, ఆధార్ కార్డుకు పాన్ కార్డు మరియు ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానం చేయుట వంటి అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఈ ఆధార్ క్యాంపు సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే ఒకటి కొనసాగుతుందని, మంగళ వారం నుండి చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరో క్యాంపు మొదలవుతుందని తెలిపారు.
మండలం లోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు, ఆధార్ కార్డు లేని విద్యార్థులకు కొత్త ఆధార్ కార్డు తీసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి…

ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి

చందుర్తి, నేటిధాత్రి:

 

ప్రాథమిక పాఠశాల సనుగులలో నిర్వహిస్తున్న ఆదార్ నమోదు కేంద్రాన్ని మండల విద్యాధికారి వినయ కుమార్ సందర్శించి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పరిసర గ్రామాల బడి పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇంతవరకు వంద పైన అప్డేషన్ లు అయ్యాయని ఇంకా ఎవరైనా పిల్లలు తమ ఆదార్ ని నమోదు చేసుకోకపోయినా, నవీకరణ చేసుకోకపోయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సనుగుల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్, సి.ఆర్.పి ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం….

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం.
మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

 

 

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల దారికి పరిష్కారం చూపిన DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T133258.874.wav?_=1

పాఠశాల దారికి పరిష్కారం చూపిన DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్

మరిపెడ నేటిధాత్రి

 

మరిపెడ మండలం ఎల్లంపేట శివారు మంచ్య తండా ప్రాథమిక పాఠశాలలో దాదాపు 22 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తరుణంలో వారికి పాఠశాలకు రావడానికి మార్గం లేక అనేక అవస్థలు పడుతున్నారని డిఎస్ఎఫ్ఐ నేతలకు సమాచారం రాగా వెంటనే ఆ తండా పాఠశాలకు వెళ్లడం జరిగింది, పొలం గట్టే విద్యార్థులకు దారిగా మారిందని వర్షం వస్తే పిల్లలు కింద పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు,అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి 4 ఫీట్ల రోడ్డును ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు,అదే సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈవొ రవీందర్ రెడ్డి తో మాట్లాడి తక్షణమే ఆ పాఠశాలకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరగా, డీఈవో సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి కచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,డాక్టర్ వివేక్ తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెలోత్ సాయికుమార్, రాష్ట్ర కోశాధికారి గుగులోతు సూర్యప్రకాష్, కోర్ కమిటీ సభ్యులు ఎర్ర దిలీప్, డాక్టర్ వివేక్ వ్యక్తిగత సహాయకుడు శివ వర్మ, డిఎస్ఎఫ్ఐ నేతలు రమేష్,ఎర్ర నితీష్, లేవి జియాన్ చరణ్,మురళి,విష్ణు,సాయి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

“తిథి భోజన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T150035.198.wav?_=2

 

తిథి భోజన్ ద్వార ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

మండలంలోని కోమటి కొండాపూర్ మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో చదువుచున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో పౌష్టికాహారం అందివ్వడం జరిగింది. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు జ్యోష్ణ తన జన్మదినం సందర్బంగా, తిథి భోజన్ కార్యక్రమం లో భాగంగా 60 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వడం పట్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి వారిని అభినందించారు.ఈ సందర్బంగా రాజన్న మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వారి పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభ దినముల సందర్బంగా వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన భోజనం అందివ్వడం, మరియు సీజనల్ పండ్లు అందివ్వడం ద్వార విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, చిన్నయ్య, రత్నం, ప్రేమ్ కుమార్, సుధారాణి, రాణి, నర్మద, జ్యోష్ణ లు పాల్గొన్నారు. 

ఏడాకులపల్లిలో విద్యార్థులకు ఉచిత బ్యాగులు..

ఏడాకులపల్లి గ్రామంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రెస్టీజ్ వెంచర్ యజమాని సత్యనారాయణ ఝరాసంగం మండల గ్రామం ఏడాకులపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచిత స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాస్,గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి మరియు వీరన్న పాల్గొనడం జరిగింది.మరియు పాఠశాల ఉపాధ్యాయులు రజిత రేణుక పాఠశాల చైర్మన్ కల్పన ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

పఠనానికి గ్రేస్ మార్కులు – కేరళలో కొత్త నిర్ణయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-3.wav?_=3

కేరళ ప్రభుత్వం విద్యార్థుల్లో పఠన అలవాటును ప్రోత్సహించడానికి కొత్త నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పఠన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వనుంది.

రాష్ట్ర సాధారణ విద్యాశాఖ మంత్రి వి.శివాంకుట్టి ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రతి వారం ఒక పీరియడ్‌ను పుస్తక పఠనం మరియు అనుబంధ కార్యక్రమాలకు కేటాయిస్తారు. 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు పత్రికలు చదవడం మరియు అప్పగించబడిన కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది.
అంతేకాక, పాఠశాల కళోత్సవాల్లో పఠన సంబంధిత విభాగాన్ని చేర్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T132815.934-1.wav?_=4

ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంఘం మండలం బిడెకన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. జూలై నెలలో క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు గోరకనాథ్ ఈ అవార్డును అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-32-1.wav?_=5

మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలో కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రాథమికొన్నత లో పాఠశాలలో రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకొని విద్యార్థినిలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందస్తుగా రాఖీ కడుతూ” నేను, నీకు రక్ష, నీవు,నాకు రక్ష,మనమిద్దరం దేశానికి రక్షా” అంటూ వాగ్దానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ అనగా రక్షణ బంధం అన్నకు గానీ, తమ్మునికి గానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మద, జ్యోష్ణ, రాణి, లు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ.

మరిపెడ నేటిధాత్రి.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరకజాల తండా పూర్వ విద్యార్థి భానోత్ అనిల్ కుమార్, ప్రస్తుతం వారి స్వంత తండ పాఠశాల లోని విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ప్రహారీగా గ్రీన్ మ్యాట్ ను సైతము బహుకరణ చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బానోత్ వినోద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ . హఫీజర్, సహోపాధ్యాయురాలు గీతా దేవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంత్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం సత్కరించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version