ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు…

ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14 బాలుర ఎంపిక పోటీలు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్.జి.ఎఫ్ అండర్-14 బాలుర ఎంపిక పోటీలు శనివారం టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ఆధ్వర్యంలో (కోటపల్లి) ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 200 పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీలను సీఐ వేణుచందర్ ప్రారంభించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పీడీలు,పీటీలు తమ విద్యార్థులతో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వ్యవహరించగా,ముఖ్య అతిథులుగా సీఐ శ్రీరాంపూర్ వేణు చందర్,తహసిల్దార్ వనజ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడు,ఎస్సై శ్రీధర్,టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాల్ శ్రీధర్,జైపూర్ హైస్కూల్ హెచ్‌.ఎం.శ్రీనివాస్, ఎస్జిఎఫ్ సెక్రటరీ యాకూబ్,ఆబ్జర్వర్ ఫణిరాజా,నిర్వాహక కార్యదర్శి సాయి (పీడీ కోటపల్లి),వ్యాయామ ఉపాధ్యాయ సంఘ బాధ్యులు సుదర్శన్,బెల్లం శ్రీను,గాజుల శ్రీను,సిరంగి గోపాల్ తో పాటు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వర కుమారి,దాసరి మల్లేష్,పున్నం,వహీదా బేగం,పద్మ,బోయిని శ్రీనివాస్,సత్యనారాయణ,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version