సర్పంచ్ బరిలో రవికుమార్

సర్పంచ్ బరిలో యువ నాయకుడు రవికుమార్

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకుడు ఆకుల రవికుమార్ సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచాడు.ఎల్లప్పుడూ గ్రామస్తులకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.సర్పంచ్ పదవి కాలం పూర్తయి రెండు సంవత్సరాలు అవడంతో గ్రామంలో అనేక సమస్యలు పేరుకు పోయాయని రవికుమార్ అన్నారు.ఈ స్థానిక ఎన్నికలలో తనని సర్పంచిగా గెలిపిస్తే గ్రామానికి సేవ చేసుకుంటానని,అలాగే గ్రామ పంచాయతీలోని సమస్యలని పూర్తిగా తీర్చి ఆదర్శ గ్రామంగా నిలబెడతానని గ్రామస్తులకు తెలిపారు.తను సర్పంచ్ బరిలో గెలవడానికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత…

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసిన యువత

జైపూర్,నేటి ధాత్రి:

 

 

సొంత ఖర్చులతో బోర్ వెల్ మోటార్ ఏర్పాటు చేసి కొత్తగూడెం కాలనీ వాసులకు నీటి కష్టాలు తొలగించిన యువకులు.జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో బోర్ వెల్ మోటార్ చెడిపోయి కాలనీ వాసులు గత రెండు నెలలుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎవరూ కూడా పట్టించుకోలేదు అని గ్రామస్తులు వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిగుంట గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుందుకు వచ్చిన యువకులు గుండా సురేష్ గౌడ్,ఆకుల రవికుమార్,జిల్లాల శ్రీకాంత్,దూగుట రాజశేఖర్ వారి సొంత ఖర్చులతో కొత్త మోటర్ బిగించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కార మార్గం చూపారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతుగా కృషిచేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని అన్నారు.అలాగే కొత్తగూడెం కాలనీ వాసుల నీటి కష్టాలు తొలగిపోవడంతో యువకులకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version