దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం
జైపూర్,నేటి ధాత్రి:
దాబాలపై పోలీసుల దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.
