లింగయ్య స్వచ్ఛంద సంస్థ సేవ ఆధ్వర్యంలో పెన్నులు

లింగయ్య స్వచ్ఛంద సంస్థ సేవ ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

విద్యార్థులకు లింగయ్య స్వచ్ఛంద సంస్థ సేవలు ఆదర్శం. సీఐ శశిధర్ రెడ్డి ఎంఈఓ దత్తు ప్రసాద్. విద్యార్థుల విద్యాభివృద్ధికి దివంగత అసోసియేట్ లింగయ్య స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని సిఐ శశిధర్ రెడ్డి మండల విద్యాధికారి దత్తు ప్రసాద్ లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఓర్రగడ్డ ప్రభుత్వ పాఠశాలలో లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

 

 

 

 

ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రణాళిక అబద్దాలు ముందుకు వెళుతుందని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నుండి మొదలుకొని నోటుబుక్కులు కూడా ఉచితంగా అందజేయడమే కాకుండా మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కన్న కలలను సహకారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. గత మూడు దశాబ్దాల క్రితం చదివించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడేవారని కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయని పాఠ్యపుస్తకాలు నుండి మొదలుకొని మధ్యాహ్నం భోజనం వరకు ప్రభుత్వ పాఠశాలలోనే సమ కోరుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా లింగయ్య లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థులకు చేయూతగా విద్యాసామాగ్రిని అందజేయడం గొప్ప విషయం అన్నారు. తాము కూడా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. విద్యార్థి దశలో చెడలవాట్లకు ఎవరు కూడా బానిసలు కావద్దని వాటి జోలికి వెళ్ళవద్దని చెప్పారు.

 

 

 

 

 

మహిళా విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయాలని లేదా తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. తన సోదరుని జ్ఞాపకార్థం విద్యాసామాగ్రిని అందజేస్తున్న సోదరుడు ప్రశంసనీయమని చెప్పారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని విషయాన్ని విస్మరించవద్దని చెప్పారు. మంచి ఫలితాలు సాధించి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్కులతో పాటు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ పాఠశాల హెచ్ఎం పద్మజ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రామ్ వెంకటేశ్వర్లు చిలుముల శ్రీనివాస్ జి రమేష్ బీమ్ పుత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ.!

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బుధవారం పెన్నులు పంపిణీ చేశారు.మనమంతా శ్రీనివాసులు గ్రూప్ సభ్యులు కలిసి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల,కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సుమారుగా 150 కు పైగా పెన్నులను అందించారు.చిలుకూరి శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరామ్ బాపూజీ బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అందజేశారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యార్థులందరూ పరీక్షలు రాసి విజయం సాధించాలని తెలిపారు.సురేష్ ఆత్మారాం బాపూజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అందించిన పెన్నులను విద్యార్థులకు స్వయంగా తను అందజేయడం గొప్ప విషయమని అన్నారు.10 సంవత్సరాల నుండి సేవ చేయడం జరుగుతుందని విద్యార్థులకు సుమారుగా మూడు లక్షల పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రాణాలికను సిద్ధం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో మనమంతా మంచిర్యాల జిల్లా శ్రీనివాసులమ్ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాసరావు,మరియు బోయినపల్లి శ్రీనివాసరావు బొద్దుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version